-
జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆదర్శ గ్రామాల సర్పంచ్లకు సన్మానం రాజమహేంద్రవరం సిటీ : గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే జిల్లా ఆదర్శంగా తయారవుతుందని, గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకు సమష్టిగా కృషి చేయాలని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. రెండేళ్ల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం పూర్తకావడంతో రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ఆదివారం ‘ ఒక అడుగు స్వచ్ఛత వైపు’ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని బహిరంగ మలమూత విసర్జన రహిత గ్రామాల సర్పంచ్లను సన్మానించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛత వైపు అడుగులు చినరాజప్ప మాట్లాడుతూ ప్ర«ధాన మంత్రి మోదీ పిలుపు మేరకు స్వచ్ఛగ్రామాల వైపు అడుగులు వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం మెరుగుకు సహకరించాలన్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణ మలమూత్ర విసర్జన గ్రామాల్లో దుళ్ల గ్రామ సర్పంచ్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలోని 1069 పంచాయతీల్లో కేవలం 139 మాత్రమే మల,మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా గుర్తించబడ్డాయన్నారు. వచ్చే ఏడాది 250 గ్రామాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం 139 గ్రామాల సర్పంచ్లను ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పులవర్తి నారాయణరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ కే.పద్మ, డ్వామా పీడీ ఏ.నాగేశ్వరరావు పాల్గొన్నారు. సెంట్రల్ జైలులో రూ.ఆరుకోట్లతో ఆసుపత్రి రాజమహేంద్రవరం క్రైం : ఖైదీలకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు రూ.ఆరుకోట్లతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో హాస్పటల్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. సెంట్రల్ జైల్లో ఆదివారం ఖైదీల సంక్షేమ దినోత్సవం, గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామని, శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, మంజూరైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఎంపీ మాగంటి మురళీ మోహన్, జైల్ సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ మాట్లాడారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎం.చంద్రశేఖర్, డిఫ్యూటీ సూపరింటెండెంట్ ర ఘు, ఎస్.రాజారావు, సెంట్రల్ డీఎస్పీ కుల శేఖర్ పాల్గొన్నారు. -
సమగ్ర అభివృద్ధికి కృషి
సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ సిటీ: దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు, సత్వర రాష్ట్రాభివృద్ధికి ప్రజలంతా సమష్టిగా పునరంకితం అవుదామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోలీస్ పేరేడ్ మైదానంలో 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్, ఎన్సీసీ దళాలు నిర్వహించిన గౌరవ వందనాన్ని స్వీకరించి మార్చ్ఫాస్ట్ను తిలకించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను అందించిన మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. రెండంకెల రేటు అభివృద్ధి సాధన లక్ష్యంగా... జిల్లాలో ఈ సంవత్సరం రైతులకు రూ.6,800 కోట్లు పంట రుణాలుగా అందిస్తున్నామని, రెండంకెల రేటు అభివృద్ధి సాధన లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు పలు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యానవన రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేసిన రుణమాఫీ పథకం కింద జిల్లాలో 2,228 మంది రైతులకు రూ.38.75 కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఈ ఏడాది రూ.1,346 కోట్లు రుణాలు మహిళా గ్రూపులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా జిల్లాలో 4,74,975 మంది పేదలకు ప్రతి నెలా రూ.51 కోట్ల మొత్తాన్ని సామాజిక భద్రతా పింఛన్లుగా అందిస్తున్నామన్నారు. రూ.473 కోట్ల వ్యయంతో 21 వేల గృహాలు... ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.473 కోట్ల వ్యయంతో 21 వేల గృహాలు బడుగు వర్గాల కోసం నిర్మాణం చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.237 కోట్ల వ్యయంతో 3 లక్షల 40 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, పంట కుంటలు, పేదల భూముల్లో ఎన్టీఆర్ జలసిరి బోర్లు వంటి ఆస్తుల అభివృద్ధి చేశామన్నారు. జిల్లాలో 15,30,370 పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించామని, లక్షా 82వేల పేద కుటుంబాలకు దీపం వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మాతా శిశు సంజీవిని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, అన్న దీవెన తదితర కార్యక్రమాలతో మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వివిధ సామాజక వర్గాల సంక్షేమం కోసం ఈ ఏడాది చేట్టిన కార్యాచరణలో భాగంగా ఈ సంవత్సరం కాపు కార్పొరేషన్ ద్వారా రూ.150 కోట్ల సబ్సిడీతో 15వేల మంది లబ్ధిదారులకు రూ.300 కోట్ల విలువైన యూనిట్లు అందిస్తున్నామన్నారు. ప్రజలందరి సహకారంతో జిల్లా ప్రగతి పధంలో మరింత ముందుకు సాగాలని మంత్రి తన ప్రసంగంలో ఆకాంక్షిచారు. వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుడు చోడిపల్లి హనుమంతరావును మంత్రి సత్కరించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన జిల్లా గిరిజన సాహస యువకుడు దూబి భద్రయ్యను మంత్రి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు సహాయల పంపిణీ... వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలు పథకాల సమాచారం, ఎగ్జిబిట్లతో స్టాళ్ళను ఏర్పాటు చేశాయి. వివిధ శాఖల ద్వారా మంజూరు చేసిన వస్తుసముదాయాన్ని లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఇందులో భాగంగా డీఆర్డీఏ ద్వారా 1680 గ్రూపులకు రూ.75.60 కోట్ల బ్యాంకు రుణాల లింకేజీ, 1691 మంది మహిళలకు రూ. 20 కోట్ల 11 లక్షలు స్త్రీనిధి రుణాలు, మెప్మా ద్వారా 1112 గ్రూపులకు రూ.50 కోట్ల 3లక్షలు బ్యాంకు రుణాల లింకేజీని లబ్ధిదారులకు అందించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.31 లక్షలు విలువైన 18 యూనిట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.35 లక్షల 50వేల విలువైన 23 యూనిట్లు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా రూ.12లక్షల 11వేలు విలువైన 248 యూనిట్లు పంపిణీ చేశారు. Sవ్యవసాయ శాఖ ద్వారా రూ.175 కోట్ల మేరకు రుణమాఫీ ప్రయోజనాల పత్రాలను లబ్ధిదార రైతులకు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప సతీమణి అనూరాధ, కలెక్టర్ అరుణ్కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
వసంతోత్సవాలకు అంకురార్పణ
ముంపుపై ముందుచూపేది..?
No Headline
విత్తన నాణ్యతపై నజర్
నల్లమలలో శాకాహార జంతువుల సర్వే
ఇంటి అనుమతులు ఇవ్వాలని వృద్ధురాలు వేడుకోలు
నిందితులు రిమాండ్కు..
కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి
ఆన్లైన్ టికెట్లతో మోసపోయిన న్యాయవాదులు
విద్యుత్ వైర్లు తగిలి నాలుగు గేదెలు మృతి
తప్పక చదవండి
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
- సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- మాటలతో మూటలు
- అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి: హరీశ్రావు
- ప్రపంచంతో పోటీపడేలా కొత్త పారిశ్రామిక పాలసీలు
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
Advertisement