-
మనసు పడి.. 150 రెక్కీలు చేసి.. కిడ్నాప్!
తొలిసారి చూసినప్పటి నుంచే ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఆమె మనసు దోచుకోవాలని అనుకున్నాడు. అందుకోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు.. చివరకు కిడ్నాప్ చేశాడు! అందుకోసం ఏకంగా 150 సార్లు రెక్కీ చేయడమే కాదు.. రెండు ఆటోలు కూడా కొన్నాడు. ఇదీ ఘజియాబాద్లో కిడ్నాపైన స్నాప్డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా వెనుక జరిగిన కథ. అప్పటికే పెళ్లయిన దేవేందర్ (29) పాత నేరస్తుడు. అతడి మీద మూడు హత్యకేసులు కూడా ఉన్నాయి. తొలుత ఆమె బోయ్ఫ్రెండు తమను కిరాయికి మాట్లాడుకున్నాడని, కొంత డబ్బు తీసుకుని ఆమెను వదిలించుకోవాలనుకున్నాడని దీప్తితో దేవేందర్ చెప్పాడు. తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెడితే అసలు విషయం బయటకు వచ్చింది. కిడ్నాపర్ల గ్యాంగు నుంచి తాను విడిపోయి.. ఆమెను విడిచిపెట్టానని, ఆమె మనసు గెలుచుకున్నానని చెబుతున్నాడు. తొలిసారి దీప్తిని 2015 జనవరిలో రాజీవ్ చౌక్ మెట్రోస్టేషన్లో చూశాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పటినుంచి ఆమె వెనకాలే తిరిగి.. ఎక్కడ ఉంటోంది, ఏం పని చేస్తోంది.. అన్నీ తెలుసుకున్నాడు. ఆమె ఎక్కడికెళ్లినా వెనకాలే ఉండేవాడు. అలా మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు.. అన్నింటికీ వెళ్లాడు. తన మీద చాలా కేసులు ఉన్నాయని, ఇప్పుడు ప్రేమ కేసు ఎందుకు ఉండకూడదని పోలీసులను ప్రశ్నించాడంటే అతడి పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అతగాడి మీద ఇప్పటికే మూడు హత్యకేసులు సహా మొత్తం 32 పాత కేసులున్నాయి. దీప్తి కిడ్నాప్ కేసులో దేవేందర్తో పాటు ప్రదీప్, ఫహీమ్, మోహిత్, మాజిద్ అనే నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీప్తిని కిడ్నాప్ చేస్తే ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున వస్తాయని వాళ్లకు చెప్పాడు. ఇదంతా హవాలా మార్గంలో వస్తుందని చెప్పడంతో.. వాళ్లు కూడా చాలా సులభంగా డబ్బు సంపాదించొచ్చని భావించారు. ఫిబ్రవరి 10వ తేదీన కిడ్నాప్ చేయాలని, నవంబర్ నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దేవేందర్ రెండు కొత్త సీఎన్జీ ఆటోలు కొని.. వాటిని వైశాలి మెట్రో ప్రాంతంలో తిప్పడం మొదలుపెట్టాడు. దీప్తి ప్రతిరోజూ అక్కడి నుంచి ఘజియాబాద్ పాత బస్టాండు వద్దకు ఆటోలో వెళ్తుంది. అక్కడి నుంచి ఆమె తండ్రి కవినగర్లో ఇంటికి తీసుకెళ్తారు. ఇవన్నీ తెలుసుకునే అతడు కిడ్నాప్ ప్లాన్ వేశాడు. -
కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య
నందిపేట, న్యూస్లైన్: నందిపేట మండ లం వెల్మల్ గ్రామానికి చెందిన వివాహిత కొట్టూర్ భాగ్య(22) మంగళవారం రాత్రి ఒంటి పై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ంది. ఎస్సై విజయ్కుమార్ వివరాల ప్రకా రం... నిజామాబాద్ మండలం కులాస్పూర్ గ్రామానికి చెందిన భాగ్యను వెల్మల్ గ్రామానికి చెందిన కొట్టూర్ దేవేందర్తో ఆరే ళ్ల కిత్రం ఇచ్చి పెళ్లిచేశారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు నవకాంత్ ఉన్నాడు. అదనపు కట్నం తేవాలంటూ దేవేందర్ రెండేళ్లుగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. కులపెద్దలు పలుమార్లు చెప్పినా మార్పురాలేదు. దీంతో జీవితంపై విరక్తిచెందిన భాగ్య మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వెంటనే ఇరుగు పొరుగువారు తులపులు పగలగొట్టి భాగ్యను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. బుధవారం ఉదయం తహశీల్దార్ శ్రీధర్ ఆస్పత్రిలో శవపంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి శ్రీరాం లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
కిక్కిరిసిన కర్నూల్
డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
తప్పక చదవండి
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement