-
228 కిలోల గంజాయి పట్టివేత
సాక్షి,దేవరపల్లి : విశాఖ జిల్లా పాడేరు నుంచి తమిళనాడుకు రెండు కార్లలో అక్రమంగా రవాణా అవుతున్న 228 కిలోల గంజాయిని సోమవారం ఉదయం దేవరపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని, రెండు కార్లను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కొవ్వూరు రూరల్ సీఐ సి. శరత్రాజ్కుమార్ ట్రైనీ ఎస్పీ వై.రిషాంత్రెడ్డి సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గంజాయి అక్రమ రవాణా గురించి వివరించారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా బట్లగుండు గ్రామానికి చెందిన ఆనందన్శివసామి, చల్లపాండి, సంగీతకుమార్, రంజిత్లు బొలొరా, షిప్టు కార్లులో విశాఖ జిల్లా పాడేరు నుంచి తమిళనాడులోని బట్లగుండు గ్రామానికి 214 గంజాయి ప్యాకెట్లును రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. -
ముగిసిన సూర పొగాకు కొనుగోళ్లు
దేవరపల్లి : దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల్లో సూర పొగాకు కొనుగోళ్లు ముగిశాయి. ఈ నెల 14 నాటితో రెండు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముగియడంతో రైతుల వద్ద గల సూర పొగాకు కొనుగోళ్లును ప్రారంభించారు. ఈ నెల 17న ప్రారంభమైన సూర పొగాకు కొనుగోళ్లు శనివారం ముగిశాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో ఈ ఏడాది 6.36 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా.. కిలో గరిష్ట ధర రూ. 185 పలికింది. సగటు ధర రూ. 136.75 లభించింది. రైతులు కిలో సటగు ధర రూ. 150 వరకు ఆశించారు. మార్కెట్ చివరి దశలో పుంజుకుంది. దీంతో రైతులు కొంత వరకు ఊపిరిపీల్చుకున్నారు. నాలుగు రోజుల్లో వేలం కేంద్రంలో 3.50 లక్షల కిలోల సూర పొగాకు కొనుగోలు చేశారు. సూరకు కిలో గరిష్ట ధర రూ. 66, కనిష్ట ధర రూ. 10, సగటు ధర రూ. 39.36 లభించింది. శనివారం వేలం కేంద్రం పరిధిలోని గ్రామాల నుంచి రైతులు 891 సూర బేళ్లు వేలానికి తీసుకురాగా.. పూర్తిగా కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణాధికారి వై.వి.ప్రసాద్ తెలిపారు. 2015–16 సీజన్కు సంబంధించి పొగాకు వేలం ముగిసిందని ఆయన ప్రకటించారు. గోపాలపురం వేలం కేంద్రంలో 1.10 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేయగా కిలో గరిష్ట ధర రూ. 60, కనిష్ట ధర రూ. 11, సగటు ధర రూ. 36.12 లభించినట్లు వేలం నిర్వహణా«ధికారి టి.తల్పసాయి తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement