-
ఎమ్మెల్సీ ఓట్లు కొనేయండి..!
విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నేతలపై మంత్రుల ఒత్తిడి హోటల్లో రహస్య మంతనాలు ఎంత కావాలో చెప్పాలని బేరసారాలు విజయవాడ : ‘ఏ రూట్లో వెళతారో.. ఎలా వెళ్తారో.. మాకు తెలి యదు.. ఒక్క ఓటు కూడా వేరే వారికి వెళ్లకూడదు.. డబ్బు ఎంత కావాలో అడగండి.. ’ ఇదీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎలాగైనా రాబట్టుకోవాలనే ఆలోచనలో మంత్రులు టీడీపీలోని ముఖ్య నాయకులకు చెప్పిన మాటలు. ‘ఇంతమంది నాయకులం ఇక్కడ ఉన్నాం.. ఒకవేళ మనం గెలవలేకపోతే అవమానంగా ఉంటుంది. సీఎం కూడా మనపై మండిపడే అవకాశం ఉంది. అందుకనే చెబుతున్నాం. ఎలాగైనా గెలవాల్సిందే..’ అం టూ ఉపాధ్యాయ సంఘాల్లోని పలువురు నాయకులకు మంత్రులు, ముఖ్య నాయకులు ఉద్బోధ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి బందరురోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్కులో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నాయకులను పిలిపించి ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటర్లు ఏమడుగుతున్నారు, ఎవరికి ఏం కావాలి.. వంటి విషయాలపై వాకబు చేశారు. ‘రామకృష్ణను మన పార్టీ బలపరిచింది. ఎలాగైనా ఆయనే గెలవాలి..’ అని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల కరస్పాండెంట్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. శుక్రవారం రాత్రి వరకు మంత్రులిద్దరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసేందుకు వెళితే తీయకూడదంటూ కోపం ప్రదర్శించారు. హామీల వల ఈ సందర్భంగా మంత్రులిద్దరూ ఉపాధ్యాయుల వద్ద హామీల వర్షం గుప్పించారు. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు సంబంధించి 2006 నుంచి యూజీసీ స్కేల్ అమలు జరుగుతున్నందున అప్పటి నుంచే ఫిట్మెంట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో లెక్చరర్లు అనే పదాన్ని తొలగించారని, మన రాష్ట్రంలోనూ ఆ పదాన్ని తీసేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా మార్చాలని కొందరు ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఉపాధ్యాయులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న మంత్రులు తమ అభ్యర్థిని గెలిపిస్తే పరిష్కరిస్తామని అభయమిచ్చారు. వ్యూహం మార్చిన మంత్రి ఉమా టీడీపీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. అయితే, ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురిచేసేందుకు బుద్దా వెంకన్న ఇంటికి మంత్రి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న సీపీఎం నగర నాయకులు, కార్యకర్తలు ఆ ఇంటి వద్దకు వచ్చారు. దీంతో మంత్రి వ్యూహం మార్చారు. ప్రాజెక్టులు, అసెంబ్లీ వ్యవహారాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విమర్శలు చేసేందుకు ఒంటిగంటకు ప్రెస్మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి అప్పటికప్పుడు అక్కడ విలేకరులతో మాట్లాడి ఎమ్మెల్సీ హడావుడిని పక్కదోవ పట్టించారు. వీరితో పాటు టీడీపీ రాష్ట్ర నాయకుడు ముద్దుకృష్ణమనాయుడు ఉన్నారు. కాగా, మేయర్ శ్రీధర్, డెప్యూటీ మేయర్ రమణారావు కూడా ఉపాధ్యాయులతో మంతనాలు జరుపుతున్నారు. యూటీఎఫ్ నాయకత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలని, ఎన్నికల్లో వారిని ఓడించి తమ సత్తా ఏంటో చూపించాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. కేవలం ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలు పాఠశాలలు, కాలేజీల కరస్పాండెంట్లనే కాకుండా విద్యాశాఖలోని ముఖ్య అధికారులను కూడా పిలిపించి లోగుట్టు విషయాలు చర్చించినట్లు సమాచారం. -
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తా
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఎన్టీటీపీఎస్లో ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడానికి తాను కృషి చేస్తానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎన్టీటీపీఎస్లో కాంట్రాక్టు కార్మికుడు నుంచి తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన పర్వతనేని సాంబశివరావుకు శుక్రవారం రాత్రి ఏకాలనీ ఎస్వీఎస్ కల్యాణ మండపంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో థర్మల్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సాంబశివరావు రాష్ట్ర అధ్యక్షుడు కావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈసందర్భంగా సాంబశివరావును ఘనంగా సన్మానించి మెమెంటోను అందజేశారు. తొలుత ఇబ్రహీంపట్నం రింగుసెంటర్ నుంచి ఎ-కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె. సమ్మయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ చీదిరాల ప్రసూన, వైఎస్ ఎంపీపీ వెంకటకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు రాధ, ఇబ్రహీంపట్నం గ్రామ మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావు, టీడీపీ నాయకుడు జంపాల సీతారామయ్య, తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, ప్రాంతీయ కమిటీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
సూర్యప్రభ వాహనంపై గోవిందుడు
బడి బస్.. ఫిట్నెస్
పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు
కౌంటింగ్కు పటిష్టంగా భద్రత
No Headline
ఇంటర్ మ్యాథ్స్–బి, హిస్టరీ పరీక్షలు ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
తత్కాల్ ఫార్మ్స్పై నంబర్లు వేసి ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో సిరికల్చర్ ఉద్యోగి మృతి
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
తప్పక చదవండి
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
- రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
- Lok Sabha Election 2024: బెంగాల్లోకి అక్రమ వలసలు
- ప్రాణాలు తీస్తున్న గజరాజులు
- లయ తప్పుతున్న గుండె
- ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
- ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
- 3 నుంచి బడిబాట
- Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
Advertisement