-
ఆధార్, పాన్ వంటి డాక్యుమెంట్లు ఎలా దాచుకోవాలంటే?
-
డిజిటల్ పత్రాలకు కొత్త ప్లాట్ఫామ్ ‘ఈక్వల్’.. ఆవిష్కరించిన జీవీకే
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి కుమారుడు కేశవ్ రెడ్డి కొత్తగా ఈక్వల్ పేరిట ప్రత్యేక ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిలాకర్, పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా స్టాక్ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. యూజర్లు తమ డిజిటల్ పత్రాలను భద్రపర్చుకునేందుకు, ఒక్క క్లిక్తో సురక్షితంగా, నిరాటంకంగా షేర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో సుమారు 10 లక్షల బీటా యూజర్లు ఉన్నారని కేశవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి వెంచర్స్, అరాజెన్ లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ ఫౌండేషన్ జీవీకే ఏఎంఆర్ఐ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్!
రేషన్కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటీ ఐడీ కార్డ్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ గుర్తింపు కార్డులలో వేర్వేరు వివరాలు ఉండి వాటిని మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న వారికి ఊరట కలిగిలించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్లో అడ్రస్ సహా ఎమైనా వివరాలు తప్పుగా ఉండి వాటిని అప్ డేట్ చేస్తే మిగతా డాక్యుమెంట్లలో మార్పులకై ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా అన్నింట్లోనూ ఆటోమెటిక్ వివరాలు అప్డేట్ అయ్యేలా కొత్త వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విభాగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డ్తో ఆటో అప్డేట్ ఎలా సాధ్యం? ప్రధానంగా పైన పేర్కొన్నట్లుగా ప్రభుత్వ ఐడీ కార్డ్లను డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్తో పాటు ఇతర డాక్యుమెంట్లను డిజిలాకర్ (DigiLocker)లో భద్రపరుచుకుంటుంటారు. ఆ డిజిలాకర్లో ఉన్న ఆధార్ కార్డులో ఏదైనా అడ్రస్ లేదంటే ఇతర వివరాలు మారిస్తే.. వెంటనే డిజి లాకర్లో ఉన్న మిగిలిన ఐడెంటిటీ కార్డ్లలో డేటా సైతం అటోఅప్డేట్ అవుతుంది. ప్రస్తుతం, ఈ ఆటో అప్డేట్పై కేంద్ర ఐటీ శాఖ.. రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి పరిమిత మంత్రిత్వ శాఖలతో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పాస్పోర్ట్లను ఆటోమేటిక్గా అప్డేట్ చేయడానికి యూజర్లకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆధార్ ఆటో అప్డేట్ విధానం అమల్లోకి రానుంది. ఆటో అప్డేట్ సిస్టమ్ ప్రయోజనాలు ఆధార్ ద్వారా డిజిలాకర్లో ఉన్న ఐడెంటిటీ కార్డ్లను ఆటో అప్డేట్ చేయడం ద్వారా ఆయా డిపార్ట్మెంట్ల సమయం, ఖర్చుల తగ్గింపుతో పాటు ఫేక్ ఐడీ కార్డ్ల ముప్పు నుంచి సురక్షితంగా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల కారణంగా తరచు ప్రాంతాలు మారే వారికి ప్రయోజనం కలుగుతుంది. కాగా, గత నెలలో కేంద్ర బడ్జెట్ను సమర్పించే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విధమైన వ్యవస్థను త్వరలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్టెక్ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్ఫామ్లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లు, ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్ఫామ్లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్టెక్ సంస్థలు డిజీలాకర్లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్ను డిజీయాత్ర యాప్పై ఐడెండిటీ వెరిఫికేషన్కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్లెస్ చెకిన్కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
ఇంటివద్దకే మొబైల్ సిమ్!
న్యూఢిల్లీ: కొత్త మొబైల్ కనెక్షన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ టెలికం శాఖ (డాట్) ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం కస్టమరు.. ఆన్లైన్లోనే కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఆధార్ లేదా డిజిలాకర్లో భద్రపర్చిన ఇతరత్రా గుర్తింపు పత్రాలతో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటి వద్దే సిమ్ కార్డు పొందవచ్చు. కొత్త మొబైల్ కనెక్షన్ కోసం విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి సంబంధించిన ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ సర్వీసులను వినియోగించుకున్నందుకు గాను కస్టమర్లు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం టెలికం రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా డాట్ .. తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ప్రీ–పెయిడ్ నుంచి పోస్ట్–పెయిడ్కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ–పెయిడ్ కనెక్షన్కు మారాలన్నా కస్టమరు కచ్చితంగా భౌతిక కేవైసీ (కస్టమరు వివరాల వెల్లడి) ప్రక్రియ పాటించాల్సి ఉంటోంది. గుర్తింపు, చిరునామా ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో రిటైల్ షాపునకు వెళ్లాల్సి వస్తోంది. ఆన్లైన్ వినియోగం పెరగడం, కోవిడ్–19 కారణంగా కాంటాక్ట్రహిత సర్వీసుల అవసరం నెలకొనడం వంటి పరిణామాల నేపథ్యంలో .. కొత్త విధానం సబ్స్క్రయిబర్స్కు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని డాట్ తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement