-
లుక్స్ ఓకే!
‘లీడర్’ నుంచి మొన్నామధ్య విడుదలైన తమిళ చిత్రం ‘బెంగళూరు నాట్కళ్’ వరకూ రానా కెరీర్ని పరిశీలిస్తే, వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న విషయం తెలుస్తుంది. ఇప్పటివరకూ రానా చేసిన చిత్రాల్లో ఒక సినిమాకీ ఇంకో సినిమాకీ అస్సలు పోలిక ఉండదు. ప్రస్తుతం ‘బాహుబలి 2’, ‘ఘాజి’ చిత్రాలతో పాటు తమిళ చిత్రం ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మరో చిత్రం అంగీకరించారు. తేజ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రానా. ఇది నిజంగా ఎవరూ ఊహించని కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఓ విశేషం అయితే, తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో రానా సరసన కథానాయికగా నటించనుండటం మరో విశేషం. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తేజ దర్శకత్వంలో ఆమె చేయనున్న చిత్రం ఇది. రానా, కాజల్ పాల్గొనగా లుక్ టెస్ట్ కూడా చేశారు. ఈ జోడీ చాలా బాగుందట. లుక్ టెస్ట్ ఓకే కావడంతో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో వారంలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. -
తేజ దర్శకత్వంలో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!
తేజ దర్శకత్వంలో ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందనుంది. దర్శక, నిర్మాత, రాజకీయవేత్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దీనికి నిర్మాత. సోమవారం కేతిరెడ్డి పుట్టినరోజు వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ - ‘‘తెలుగు భాష విశిష్టతను చాటిన తెలుగు తేజం శ్రీ కృష్ణదేవరాయుల్ని అవహేళన చేసే రీతిలో తమిళ నటుడు వడివేలు ప్రధాన పాత్రలో ఇటీవల ఓ చిత్రం రూపొందింది. ఆ తమిళ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ జగదీశ్వరరెడ్డి తమిళనాడులో ధర్నాలు నిర్వహించి, తెలుగువారి గొప్పతనాన్ని చాటారు. నేటి తరానికీ, రాబోయే తరానికీ తెలుగు భాష గొప్పతనం చెప్పే ఈ డాక్యుమెంటరీ చేయనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement