-
ఓటు.. గెలిచేట్టు..
ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన యంత్రాంగం.. పోలింగ్ రోజు ప్రతి ఓటు పడేలా చూసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కారణం ఏదైనా.. దివ్యాంగులు పోలింగ్కు దూరంగానే ఉండిపోతున్నారు. అందుకోసమే ఈసారి ప్రత్యేకించి పోలింగ్ ప్రక్రియలో దివ్యాంగులు, వృద్ధులను భాగస్వాముల్ని చేసే ప్రయత్నం జరుగుతోంది. దివ్యాంగులతో పాటు వృద్ధులు నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. దేశంలోనే తొలిసారి ఈ వినూత్న ప్రయోగానికి తాజాగా ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాలు వేదిక కానున్నాయి. వయోభారం, అంగవైకల్యంతో పోలింగ్ స్టేషన్కు రావడానికి ఇబ్బంది పడే ఓటర్లను ఆటో రిక్షాల ద్వారా తరలిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32,572 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ బూత్లను అనుసంధానిస్తూ 19,044 లొకేషన్లలో వీటిని వృద్ధులు, దివ్యాంగుల సేవల కోసం అందుబాటులో ఉంచుతారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఈ ఆటోల్లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే వికలాంగులు సులువుగా ఓటు వేయడానికి వీల్చైర్లను కూడా సమకూరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో ట్రైసైకిళ్లను సేకరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీచేసింది. దివ్యాంగ ఓటర్లు 4 లక్షల పైనే.. తెలంగాణలో ‘సదరం’ రికార్డుల ప్రకారం 18 ఏళ్లు నిండిన దివ్యాంగులు 7 లక్షల మందికి పైనే ఉంటారని అంచనా. వీరిలో ఓటుహక్కు కలిగిన వారు 4,12,098 మంది ఉన్నారు. ‘సదరం’ రికార్డుల ద్వారా ఇంకా దివ్యాంగులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం పోలింగ్ బూత్ల వారీగా వారిని గుర్తించే ప్రక్రియ కూడా నడుస్తోంది. దివ్యాంగులకు కల్పించే సౌకర్యాల విషయమై ప్రతి జిల్లా కేంద్రంలోనూ హెల్ప్లైన్లనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ‘వాదా యాప్’ ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తేనున్నారు. తీవ్ర వైకల్యం ఉన్న వారికి ఆన్లైన్ ద్వారా ఓటింగ్ సదుపాయాన్ని కల్పించాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. మ్యాపింగ్ పూర్తి! దివ్యాంగ ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ల మ్యాపింగ్ ప్రక్రియ 70 శాతం వరకు పూర్తయింది. ఇది మొత్తం పూర్తయితే తదనుగుణంగా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దివ్యాంగులు ఏ సమయంలో ఓటెయ్యడానికి వస్తారో తెలుసుకుని ఆ సమయంలో వాహన సౌకర్యం కల్పిస్తారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల వీల్చైర్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో చిన్నపాటి ర్యాంపు నిర్మించి, అక్కడ వీల్చైర్ను ఉంచుతారు. అంతకుముందు పోలింగ్ బూత్ వరకు వారిని తరలించేందుకు ఆటోలు, ఇతర రవాణా వాహనాలను వినియోగిస్తారు. అలాగే, మహిళల కోసం పింక్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది నియోజకవర్గానికి ఒకటి ఉంటుంది. ఇంకా దివ్యాంగ ఓటర్లను ఓటు వేయించే దిశగా ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అంబాసిడర్లుగా నియమించింది. వీరిలో సినీ నటి అభినయశ్రీ, అంధ క్రికెటర్లు మహేంద్ర, మధు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆంజనేయులు, టీవీ యాంకర్ సుజాత, గాయకురాలు శ్రావ్య, శాస్త్రవేత్త బాబూ నాయక్ దివ్యాంగుల్లో ఓటు చైతన్యం కోసం వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఐదు రకాల గుర్తింపు కార్డులు దివ్యాంగులను మొత్తం ఐదు రకాలుగా విభజించారు. ఈ మేరకు గుర్తింపు కార్డులను తయారు చేస్తున్నారు. వీటిని నవంబర్ నెల చివరి నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి దివ్యాంగులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కార్డులను బట్టి దివ్యాంగులను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈ ఐదు రకాల రంగులతో కూడిన దివ్యాంగుల ఓటర్ల జాబితాను ఎన్నికల సిబ్బందికి కూడా అందచేస్తారు. దీనివల్ల ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులు ఏ కేటగిరీ వారో గుర్తించి, వెంటనే వారికి తగిన సౌకర్యం కల్పిస్తారు. - కాళ్లు, చేతులు లేనివారు వీరిని ‘లోకోమోటర్’గా వ్యవహరిస్తారు. వీరిని గుర్తించేందుకు వీలుగా ఎరుపు రంగు (రెడ్) గుర్తింపు కార్డు జారీ చేస్తారు. - అంధులు కంటి చూపు లేని వారిని గుర్తించేందుకు ఆరెంజ్ కార్డు కేటాయించారు. - మానసిక వికలాంగులు వీరిని గుర్తించేందుకు పర్పుల్ కార్డులను జారీ చేస్తారు. - బధిరులు: వినికిడి లోపం గల వీరి కోసం నీలి రంగు (బ్లూ) కార్డు అందచేస్తారు. వీరితో సంజ్ఞల భాషలో మాట్లాడేందుకు వీలుగా పోలింగ్ సిబ్బందికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, ఈ లోపం గల ఓటర్లకు 15 అంశాలతో కూడిన ఒక కరపత్రాన్ని రూపొందించి అందచేస్తారు. - మల్టిపుల్ డిసేబిలిటీ ఒకటి కంటే ఎక్కువ వైకల్యలోపాలు గల వారిని పర్పుల్ రంగు కార్డు ద్వారా గుర్తిస్తారు. అంధుల కోసం ఓటరు కార్డు మలక్పేటలోని బ్రెయిలీ ప్రెస్లో అంధుల కోసం దాదాపు 50 వేల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించారు. ఇటువంటి గుర్తింపు కార్డుల ముద్రణ దేశ ఎన్నికల చరిత్రలోనే తొలి ప్రయత్నమని అంటున్నారు. ఇటీవల నగర పర్యటనకు వచ్చిన ఎన్నికల ప్రధాన అధికారి రావత్ వీటిని పరిశీలించారు. అలాగే, అంధులు ఆయా పార్టీల చిహ్నాలను గుర్తించేందుకు వీలుగా కూడా ప్రత్యేక బ్యాలెట్ను తయారు చేసే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ బ్యాలెట్ ద్వారా అంధులు ఎవరికి ఓటు వేయాలో సులభంగా గుర్తించగలుగుతారని బ్రెయిలీ ప్రెస్ ఎడిటర్ జి.వెంకటేశ్వర రావు (అంధుడు) తెలిపారు. దాదాపు రూ.90 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో నార్వే దేశం నుంచి బ్రెయిలీ ముద్రణ యంత్రాన్ని కొనుగోలు చేసి ముద్రణ పనులు మొదలు పెట్టినట్లు వివరించారు. ఈ మిషన్ ద్వారా ప్రతీ రోజూ 20 వేల కార్డులను ముద్రించవచ్చని ఆయన అంటున్నారు. ఓటెయ్యడమెంతో ‘సరళ’ం దివ్యాంగులను ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యుల్ని చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్వేతామహంతి చెప్పారు. ఈ జిల్లాలో దివ్యాంగుల కోసం ‘సరళ్’ పేరుతో ఆమె ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి దివ్యాంగుడు పోలింగ్ నాడు ఓటేసేలా చూడటం, ఓటింగ్లో వారినీ భాగస్వాముల్ని చేయాలనే లక్ష్యాలతో ‘సరళ్’కు శ్రీకారం చుట్టినట్టు ఆమె చెబుతున్నారు. జిల్లాలోని 14 మండలాల్లో సదరం క్యాంపు ద్వారా సర్టిఫికెట్లు పొందిన, పొందని దివ్యాంగులను కూడా గుర్తించి ఓటుహక్కు కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,709 మంది దివ్యాంగులను గుర్తించారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఉన్న దివ్యాంగులను గుర్తించే పని కూడా పూర్తయిందని, ఇక వారి చేత ఓటెయ్యించడమే మిగిలిందని శ్వేతా హమంతి ‘సాక్షి’కి చెప్పారు. ‘‘దివ్యాంగులకు సహకరించేందుకు వలంటీర్లను నియమిస్తాం. వికలాంగ సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. 3,600 మంది దివ్యాంగులకు ఇంటి నుంచి వాహన సౌకర్యం కల్పించాలని నిర్ణయించా’మని చెప్పారు. ఇన్పుట్స్: డి.వెంకటేశ్వర్రెడ్డి, సిలివేరు యాదగిరి, ఎన్.వెంకటేశ్వర్లు -
వికలాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో వికలాంగ ఓటర్లంతా చురుగ్గా పాల్గొనే చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈఓ) విజయ్దేవ్ శనివారం ప్రకటించారు. వికలాంగులు ఓటింగ్ రోజు ఎన్నికల అధికారులను సంప్రదించడానికి వీలుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్బూత్ల వద్ద వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఈ సాఫ్ట్వేర్ను వారంలోపు అందుబాటులోకి తెస్తారు. దీనిని వినియోగించుకోవాలనుకునేవాళ్లు అందులో తమ పేరు, చిరునామాతోపాటు ఏవైనా అవసరాలు ఉంటే తెలియజేయాలి. ‘వికలాంగులు సులువుగా ఓటు వేయడానికి వీలుగా వారికి అన్ని సదుపాయాలూ కల్పిస్తాం. అందుకే ఈ సాఫ్ట్వేర్ను తయారు చేస్తున్నాం’ అని విజయ్దేవ్ వివరించారు. ఉదాహరణకు ఒక వికలాంగుడికి వీల్చెయిర్ లేదా సహాయకుడి అవసరం ఉంటే అతడు/ఆమె వెబ్సైట్లోని సాఫ్ట్వేర్ ద్వారా ఎన్నికల సంఘానికి ఆ విషయం తెలియజేయవచ్చు. ముందస్తుగా సమాచారం అందితే అధికారులు సదరు ఓటరుకు ఆ సదుపాయాలు కల్పిస్తారు. అంతేకాదు ఢిల్లీ వ్యాప్తంగా ఎంతమంది వికలాంగ ఓటర్లు ఉన్నారో ఈ సాఫ్ట్వేర్ వల్ల తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఎంతమంది వికలాంగ ఓటర్లు ఉన్నారో తెలియకపోవడం వల్ల వారికి తగిన ఏర్పాట్లు చేయలేకపోతున్నామని విజయ్దేవ్ అన్నారు. జాతీయ వికలాంగుల ఉపాధి ప్రోత్సాహక కేంద్రం (ఎన్సీపీఈడీపీ) గణాంకాల ప్రకారం రాజధానిలో 2.5 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపి బ్యాలెట్ పత్రాలు/ర్యాంప్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించామని విజయ్దేవ్ ఈ సందర్భంగా తెలిపారు. ‘వికలాంగుల అభిప్రాయాలు తీసుకొని వారికి అనుగుణంగా ఏర్పాట్లు చేసే పని ఇంత వరకూ జరగలేదు. అందుకే మేం కొన్ని స్వచ్ఛందసంస్థలను సంప్రదించి సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. కేంద్ర న్యాయ, సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖ కూడా ఇందుకు సహకరించింది. ప్రతి పోలింగ్బూత్ వద్ద వికలాంగ ఓటర్ల కోసం కొందరు స్వచ్ఛంద సేవకులు, ఒక వీల్చెయిర్ అందుబాటులో ఉంచుతున్నాం. వాళ్లు సులువుగా లోపలికి ప్రవేశించి నిష్ర్కమించేలా చూడాలని పోలింగ్ సిబ్బందిని ఆదేశించాం. వైకల్యమున్న ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని కూడా సూచించాం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని విజయ్దేవ్ అన్నారు. అయితే వికలాంగుల హక్కుల కోసం పోరాడేవాళ్లు మాత్రం ఈ చర్యలు సరిపోవని అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల సంఘం మాత్రమే ఇటువంటి చర్యలను ప్రకటించిందని, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమంటని వికలాంగుల హక్కుల సంస్థ సమన్వయకర్త జావెద్ అబీదీ ప్రశ్నించారు. వికలాంగ ఓటర్లకు తగిన సదుపాయాలు కల్పించేలా ఆదేశించాలంటూ ఆయన 2004లోనే సుప్రీంకోర్టును ఆదేశించారు. వైకల్యమున్న వాళ్లు పోలింగ్బూత్లోకి ప్రవేశించేందుకు తగిన ర్యాంప్లు (మెట్లకు బదులుగా) లేవని ఆక్షేపించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
తెలంగాణ టెట్ హాల్టికెట్లు విడుదల..
Hyderabad Heavy Rains: హైదరాబాద్లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
SRH vs GT: మ్యాచ్కు వర్షం అడ్డంకి.. హెచ్సీఏ కీలక ప్రకటన
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
జగన్కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement