-
మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ!
వాషింగ్టన్: మద్యపానంతో వయసు మళ్లిన వారితో పోలిస్తే యువతకే అనారోగ్య ముప్పు ఎక్కువట! మద్యం సేవనంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణుల పరిశోధన ఫలితాలను లాన్సెట్ జర్నల్లో శుక్రవారం ప్రచురించారు. 15–39 ఏళ్ల వారిలో ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి రిస్క్ అధికంగా ఉంటున్నట్లు పరిశోధనలో తేలింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 40 ఏళ్లు దాటి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు పరిమితంగా మద్యం తీసుకుంటే కార్డియో వాస్క్యులర్ జబ్బులు, గుండెపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతున్నట్లు వెల్లడయ్యింది. ఒకటి నుంచి రెండు పెగ్గులకే పరిమితం అయితే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. 15–39 ఏళ్ల పురుషులు ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యపరంగా నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చిచెబుతున్నారు. మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటి ఘటనల్లో బాధితులుగా మారుతున్నది ఎక్కువ శాతం 15–39 ఏళ్ల వయసు విభాగంలో ఉన్నవారేనని గుర్తుచేస్తున్నారు. ‘‘మేమిచ్చే సందేశం ఏమిటంటే.. యువత మద్యం జోలికి అస్సలు వెళ్లొద్దు. 40 ఏళ్లు దాటినవారు చాలాపరిమితంగా మద్యం తీసుకోవచ్చు. దానివల్ల వారికి ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలున్నాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ఎమ్మానుయేల్ గాకిడౌ చెప్పారు. -
అమ్మో... న్యుమోనియా
విజయనగరం ఆరోగ్యం, న్యూస్లైన్: శీతాకాలం ప్రారంభమవడంతో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువైంది. దీంతో న్యుమోనియా వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. రోజుకు సగటున జిల్లాలో 200 నుంచి 400 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలతో బాధపపడుతూ ఒక్క కేంద్రాస్పత్రికే రోజుకు 20 నుంచి 30 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పసికందు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. 70 శాతం రైలో వైరస్ వల్ల, 30 శాతం బ్యాక్టీరియాల ప్రభావంతో న్యుమోనియా వ్యాపించే అవకాశం ఉంది. న్యుమోనియా(ఊపిరిత్తులకు సోకే ఇన్ఫెక్షన్) ఈ వ్యాధి వైరస్ వల్ల, బాక్టీరియా వల్ల, క్షయవ్యాధి వల్ల వ్యాప్తి చెందుతుంది. పొగతాగడం, చలిగాలిలో తిరగడం, కుటుంబ పరంగా అస్తమా, అనారోగ్య పరిస్థితుల వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. శరీరంలో ఉన్న కురుపులు వల్ల రక్తం ఊపిరి తిత్తుల్లోకి వెళ్లి న్యుమోనియాగా మారుతుంది. ఈ వ్యాధిని ఎక్స్రే, సి.టి.స్కాన్, రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలు తరచూ దగ్గు వస్తుంది. దగ్గేటప్పుడు ఛాతీలో నొప్పితో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శారీరకంగా బలహీనడతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ వ్యాధి సోకేముందు ఎలాం టి ఆహారమూ తీసుకోరు. పాలు తాగేందుకు నిరాకరిస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి. క్షయ వ్యాధి కోసం కఫం పరీక్ష చేసుకోవాలి. న్యుమోనియా పిల్లలకు సోకితే ప్రమాదకరం. పిల్లలను చలికాలంలో బయట తిప్పకూడదు. జలుబు, దగ్గు ఉన్న వారు పిల్లలను ఎత్తుకోరాదు. జనసంచారం ఎక్కువగా ఉన్న చోటకి, గ్రూపులుగా ఉన్న చోట పిల్లలను తిప్పకూడదు. గోరు వెచ్చని నీళ్లు స్నానం చేయించాలి. పెద్దలయితే ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ వ్యాధికి ముందు జలుబు, కొద్దిగా దగ్గు వస్తాయి. ఆ సమయంలో వెచ్చని దుస్తులు ధరించడం, ఆవిరి పట్టడం చేస్తే వ్యాధిని కొంతవరకూ నిరోధించవచ్చు. రికార్డు కాని కేసులు ప్రాణంతకమైన ఈ వ్యాధి పట్ల వైద్య ఆరోగ్యశాఖాధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏటా ఎంత మందికి వ్యాధి సోకుతోంది. అందులో పిల్లలు ఎంతమంది తదితర వివరాలు వైద్య ఆరోగ్యశాఖాధికారులు నమోదుచేయవలసి ఉన్నా అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏటా ఎంత మంది మృత్యువాత పడుతున్నారో , ఎంత మంది వ్యాధి బారిన పడుతున్నారో తెలియన పరిస్థితి నెలకింది. అప్రమత్తత అవసరం... శీతకాలంలో ఈ వ్యాధి అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. చల్లగాలిలో తిరగడం సాధ్యమైనంతవరకు మానుకోవాలి. అత్యవసరమనుకుంటే ముఖాన్ని పూర్తిగా కప్పే విధంగా ఉండే టోపీలు, స్వెట్టర్లు వంటి వాటిని ధరించి వెళ్లాలి. పిల్లలను బయటకు తీసుకుని వెళ్లినప్పుడు తప్పని సరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం పొడిబారకుండా క్రీములు రాయాలి. పొగతాగడం పూర్తిగా మానుకోవాలి. మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. - బి.వెంకటేష్, ఫిజిషియన్, పిల్లల వైద్యులు, కేంద్రాస్పత్రి. గత ఏడాది కంటే అధికంగా కేసులు గత ఏడాది రోజుకు 10 నుంచి 20 కేసులు వస్తే, ఈఏడాది 20 నుంచి 30 వరకు వస్తున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా చలి ఎక్కువైంది. పిల్లలు , వృద్ధులు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడుతున్నారు. - బి.గౌరీశంకర్, పిల్లల వైద్యుడు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement