-
నకిలీ విత్తన మాఫియాను వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న మాఫియాను ఉపేక్షించవద్దని, వారిపై పీడీ యాక్ట్లాంటి కేసులతో ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. నకిలీ విత్తన మాఫియాను అరికట్టేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, అక్రమంగా రవాణా చేసేవారిని, విక్రయదారులను ఏమాత్రం ఉపేక్షించకూడదని, వారికి కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నకిలీ విత్తనాల కేసుల్లో 13 పీడీ యాక్ట్ కేసులు పెట్టామన్నారు. నకిలీ విత్తనాల ఉత్పత్తి, రవాణాను గుర్తించేందుకు క్షేత్రస్థాయి అధికారులు నిరంతర నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తన కార్యకలాపాల్లో పాలుపంచుకున్న నిందితులపై పోలీసు ఠాణాల వారీగా రౌడీషీట్ తెరవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇలాంటి కార్యకలాపాలకు ఊతమిస్తోన్న వ్యక్తులను, తయారీదారులను, రవాణా చేసేవారిని, డిస్ట్రిబ్యూటర్లను, విక్రయదారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిందితులందరి డేటాబేస్లను ప్రత్యేకంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖతో కలిసి పోలీసులు చేస్తోన్న దాడులపై ఏరోజుకారోజు ఎస్పీలు/ కమిషనర్లు పంపిన నివేదికను తాను స్వయం గా సమీక్షిస్తానని డీజీపీ వెల్లడించారు. నకిలీ విత్తన మాఫియాపై జరుగుతున్న పోరులో వ్యవసాయశాఖ అధికారులంతా పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. అసలైన, నకిలీ విత్తనాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం లో పోలీసులకు అవగాహన కల్పించామన్నా రు. కార్యక్రమంలో ఏడీజీ జితేందర్ (లాఅండ్ఆర్డర్), ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీలు/కమిషనర్లు అన్ని ఠాణాల ఎస్హెచ్వోలు పాల్గొన్నారు. -
స్థాయీ సంఘం..తూతూమంత్రం
కరీంనగర్: జిల్లా పరిషత్ స్థాయూ సంఘ సమావేశాలు తూతూమంత్రంగా సాగారుు. కీలకమైన సమావేశాలకు అందులో సభ్యులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు పలువురు జెడ్పీటీసీలు గైర్హాజరయ్యూరు. వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు ప్రభుత్వ పథకాలపై అమలులో అధికారుల తీరుపై సభ్యులు మండిపడ్డారు. వ్యవసాయంపై మూడవ స్థాయూ సంఘ సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలైంది. స్థాయూ సంఘం చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ట్రైయినీ కలెక్టర్ అధ్వైత్సింగ్, జెడ్పీ సీఈవో సూరజ్కుమార్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ధర్మారం జెడ్పీటీసీ నారా బ్రహ్మయ్య మాట్లాడుతూ... ఏప్రిల్, మేనెలల్లో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే మండుతున్నాయని, ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వదలచుకుందో స్పష్టం చేయూలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు ట్రాక్టర్లు మంజూరైనా, బ్యాంకులు కాన్సెంట్ ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి సన్న, చిన్నకారు రైతులకు త్వరితగతిన రుణాల మంజూరు చేయూలని డిమాండ్ చేశారు. మల్హర్ జెడ్పీటీసీ గోనె శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల మాఫీపై స్పష్టతలేదని, నిబంధనలు ఏమిటో వెల్లడించాలన్నారు. ట్రాక్టర్ల యూనిట్ల సంఖ్యను పెంచడంతో పాటు లోన్లో ఉన్న నిబంధనలను సడలించాలని కోరారు. సంఘ చైర్మన్ రాజిరెడ్డి కల్పించుకొని జిల్లాకు 110 ట్రాక్టర్లు మంజూరయ్యాయని, మరిన్ని యూనిట్ల కోసం మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ వివరాలపై జేడీ ఛత్రునాయక్ను వివరణ కోరారు. ఇప్పటికే పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ 90 శాతం పూర్తయిందని, ఆన్లైన్లో తలెత్తిన చిన్న తప్పిదాల వల్ల పొరపాట్లు జరిగాయని, నెలరోజుల్లో ఎలాంటి సమస్యలు పరిష్కారిస్తామని జేడీఏ పేర్కొన్నారు. మామిడితోటలకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యమెందుకని ధర్మారం, చందుర్తి జెడ్పీటీసీలు నారా బ్రహ్మయ్య, అంబటి గంగాధర్ ప్రశ్నించారు. 2011నుంచి ఇంతవరకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామని, డబ్బులు రాగానే అందజేస్తామని ఉద్యానవన శాఖ ఏడీ జ్యోతి వెల్లడించారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ, అటవీశాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు రాంచందర్నాయక్, దేవేందర్, జ్యోతి, ప్రభాకర్ పాల్గొన్నారు. విద్య, వైద్యంపై చర్చ మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైన నాల్గవ విద్య, వైద్య సేవల స్థాయూ సంఘ సమావేశం గరంగరంగా కొనసాగింది. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీలు పొన్నాల లక్ష్మయ్య, చల్ల ప్రగతి, సిద్దం వేణు, జంగిలి సునీత, యాట దివ్య పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే కోహెడ, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీలు మోడల్ స్కూళ్లలో కనీస వసతులు కరువయ్యాయని, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లుల చెల్లింపులో జాప్యంపై మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అధికారులకు నివేదించినా ఫలితంలేదని, కోట్ల నిధులు వస్తున్నా ఉపయోగపడడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీలు చల్ల ప్రగతి, జె.సునీత, దివ్య మాట్లాడుతూ.. వైద్యాధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వసతులు కరువయ్యాయని, పారదర్శకత, సమయపాలన లేకపోవడం వల్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వశిక్ష అభియాన్ పథకాల అమలు తీరుపై ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సభ్యులు మాట్లాడుతూ.. కోట్ల నిధులు ఖర్చుచేస్తున్నా ఆశించిన ప్రగతి కనిపించడం లేదని, విద్యా వ్యవస్థను ఒకేగొడుగు కిందికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎలా? : తుల ఉమ సమయానికి రారు. నివేదికలు తేరు. సంబంధిత శాఖ అధికారులు కాకుండా అసిస్టెంట్లను పంపుతారు. ఇలాగైతే ఎలా? అంటూ అధికారుల తీరుపై తుల ఉమ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే అధికారులు ఆలస్యంగా రావడం, సమగ్ర నివేదికలు తేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటిస్తూ జవాబుదారీతనంతోనే ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి చేరుతాయని, అధికారులు తీరుమార్చుకోవాలని చురకలంటించారు. కొత్త బిచ్చగాళ్లం.. సహకరించండి : ఎమ్మెల్సీ మాది ప్రజాప్రభుత్వం. అధికారుల్లారా నిర్లక్ష్యం వద్దు. పూర్తి సమాచారంతో రండి. పనిచేస్తామనే ఆరాటం మాకుంది. మాతో సహకరించండి అంటూ పాతూరి సుధాకర్రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం కోట్లు ఖర్చుచేస్తుంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడం బాధాకరమని, ఏం జరుగుతుందో తమకు బోధపడడంలేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల డుమ్మా.. ప్రభుత్వ పథకాల అమలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించే స్థాయూ సంఘ సమావేశాలకు కీలకమైన ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. కీలకమైన వ్యవసాయం, విద్య, వైద్యం స్థాయూ సంఘ సమావేశాలకు సభ్యులైన ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యేలు టి.జీవన్రెడ్డి, పుట్ట మధు, జెడ్పీటీసీలు జనగామ శరత్రావు, డి.ప్రభాకర్, ఎం.ప్రమీల, ఎం.సరోజన, చొప్పరి సదయ్య గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన విద్య, వైద్య స్థాయూ సంఘం సమావేశానికి సభ్యులైన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్కుమార్, దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్కుమార్ హాజరుకాలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement