-
రూ.17 లక్షలు సీజ్..
భిక్కనూరు, న్యూస్లైన్ : నిజామాబాద్ జిల్లా సరి హ ద్దు గ్రామమైన బస్వాపూరు సమీపంలో ఏర్పాటు చేసి న చెక్పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురి నుంచి రూ. 14 లక్షల 60 వేలను స్వాధీ నం చేసుకున్నారు. హెదరాబాద్కు చెందిన బాలకారి నర్సింహారావు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు వెళ్తుండగా ఆయన వాహనాన్ని తనిఖీ చేసి రూ. 3 లక్షల 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెదక్ జిల్లా సిద్దిపేట కు చెందిన కూర వెంకటేశం తన కుటుంబంతో కలిసి వాహనంలో నిజామాబాద్ వెళ్తుండగా తనిఖీ చేసి పోలీ సులు రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్కు చెందిన చంద్ర రంగరావు బాల్కొండ కు వాహనంలో వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేసి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్.. ఇదిలా ఉండగా డబ్బులు తీసుకెళ్తూ పట్టుబడిన వారి లో జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన వారు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే డబ్బులను సీజు చేయవద్దని పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే తనిఖీలు చేస్తున్నామని, డబ్బులను నిబంధనల ప్రకారమే సీజు చేశామని, తామేమీ చేయలేమని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. రూ. 2 లక్షల 50 వేలు స్వాధీనం జాన్కంపేట(ఎడపల్లి): మండలంలోని జాన్కంపేట చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన తనిఖీలో పోలీసు లు రూ. 2. 50 వేలు పట్టుకున్నారు. మద్నూర్ నుంచి ఆర్ముర్కు వెళ్తున్న కారును తనిఖీ చేయగా డబ్బు కనిపించిందని, డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
కలవరపెడుతున్న నకిలీ ఎరువు
బిచ్కుంద న్యూస్లైన్: రబీ సాగుకు సిద్ధమవుతున్న త రుణంలో రైతన్నను కల్తీ ఎరువులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారుల్లో నిం డా నిర్లక్ష్యం పేరుకుపోయింది. కల్తీ ఎరువులను గుర్తించేందుకు లక్ష్యం మేరకు దుకాణాల నుం చి కనీసం శాంపిళ్లను సేకరించలేకపోతున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రతి మండల వ ్యవసాయ అధికారి తన పరిధిలో ఉన్న దుకాణాల నుంచి ఎరువుల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించాల్సి ఉంటుంది. ఎరువుల్లో నాణ్యత లోపిస్తే అధికారులు వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. అయితే ఎక్కడా ఈ మేరకు అధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది జిల్లాకు సుమారు 560 శాంపిళ్ల సేకరణను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని 36 మండలాల నుంచి లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. కాగా అధికారుల ఇప్పటి వరకు కేవలం 280 శాంపిళ్లను సేకరించి చేతులు దులుపుకున్నారు. ఎక్కువగా ఎరువుల వినియోగం ఖరీఫ్లోనే ఉన్నా..ఎప్పటికప్పుడు అనుమానం కలి గి నా... రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు ఆయా దుకాణాల నుంచి శాంపిళ్లను సేకరించి జాగ్రత్త పర్చాలి. అయితే ఇవేమీ అమలు కావడం లేదు. కల్తీ ఎరువులపై కొరడా ఝళిపించాల్సిన విజిలెన్స్ అధికారులు పత్తాలేకుండా పోయారు. అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహించామనిపించి అధికారులు తర్వాత కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న జిల్లాలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుం ద, బోధన్ మండలాల్లో జోరుగా నకిలీ ఎరువులు, స్ప్రే మందుల విక్రయాలు సాగుతున్నాయి. నాణ్యతను గుర్తించలేకపోతున్న రైతులు వాటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో నిజామాబాద్ ఏడీఏ ప్లాంట్ ప్రొటక్షన్ అధికారి చంద్రశేఖర్ను సంప్రదించగా జిల్లాలో ఇప్పటి వరకు 280 ఎరువుల శాంపిళ్లు సేకరించామని తెలిపారు. అందులో నిజామాబాద్ నగరంలోని దుకాణాల్లో లభించిన 10.26.26, 17.17.17, 14.35.14 ఎరువులలో నాణ్యత తక్కువగా ఉందని తెలి పారు. బిచ్కుంద ఏడీఏ వేణుగోపాల్ మాట్లాడుతూ జుక్కల్లో 20.20.0.13 రకాల ఎరువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలిందని చెప్పారు. ఎవరైనా ఇలాంటి ఎరువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement