-
అవిశ్వాసం గట్టెక్కేనా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా మార్కెటింగ్ కో ఆపరేటివ్ సొసైటీలో అవిశ్వాస తీర్మానం మళ్లీ తెరపైకి వచ్చింది. శుక్రవారం అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలోనే గురువారం చైర్మన్ పదవికి నారాయణరెడ్డి రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. రాజీనామాను కమిషనర్కు సమర్పించకపోవడంతో ఆ రాజీనామా చెల్లుబాటు కాదని జిల్లా సహకార అధికారి (డీసీవో) సూర్యచందర్రావు స్పష్టం చేశారు. దీంతో నిర్ణయించిన సమయానికే అవిశ్వాస తీర్మానం జరుగుతుందని తెలిపారు. ఫలితంగా శుక్రవారం అవిశ్వాస తీర్మాన సమావేశం అనివార్యమైంది. టీఆర్ఎస్ ఖాతాలోకే..! డీసీఎంఎస్ అధ్యక్ష పదవిని టీఆర్ఎస్ చేజిక్కించుకునేందుకు నారాయణరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ డెరైక్టర్లతోనే జూలై 11న అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇప్పించారు. ఈ నేపథ్యంలో డీసీవో ఆగస్టు 8న డెరైక్టర్లందరికీ నోటీసులు జారీ చేశారు. దీనిపై నారాయణరెడ్డి జిల్లా సహకార అధికారికి సమావేశం నిర్వహించే అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. కొంత కాలంగా హైకోర్టు ఆదేశానుసారం తీర్మానం నిలిచిపోయింది. తాజాగా స్టే వేకెంట్ కావడంతో మళ్లీ శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకులంగా ఏడుగురు సభ్యులు (మూడింట రెండు వంతులు) ఓటేస్తే చైర్మన్, వైస్ చైర్మన్లు పదవి నుంచి వైదొలుగుతారు. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు గులాబీ పార్టీ అండదండలతో క్యాంపుల్లో ఉన్నారు. దీంతో అవిశ్వాసం నెగ్గడంఖాయంగా కనిపిస్తోంది. కొంత కాలంగా చైర్మన్ నారాయణరెడ్డి, వైస్చైర్మన్ శ్రీనివాస్రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సాధ్యం కాలేదు. కుట్రలతోనే రాజీనామా.. 2005 నుంచి ఇప్పటివరకు అధ్యక్ష పదవి చేపట్టానని, గతంలో జిల్లా మార్కెట్ సంఘం తీవ్ర సంక్షోభంలో ఉండేదని.. ఇప్పుడు రూ.60 లక్షల లాభాల్లో ఉందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణరెడ్డి స్పష్టం చేశారు. డీసీవో సూర్యచందర్రావుకు రాజీనామా పత్రం అందజేశాక మాట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లు, బ్లాక్మెయిల్ రాజకీయాలతోనే తాను రాజీనామా చేశానని పేర్కొన్నారు. రాజీనామా సమర్పించే సమయంలో ఆయనతోపాటు టీపీసీసీ కార్యదర్శి నరేష్జాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింగ్రావు, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, లక్ష్మణచాంద సర్పంచ్ నారాయణ, డీసీసీ మెంబర్ రాధాకిషన్ ఉన్నారు. -
తెరపైకి అవిశ్వాసం
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : సహకార రాజకీయాలు మళ్లీ రసకందాయంలో పడ్డాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తాత్కాలికంగా బ్రేక్ పడిన డీసీఎంఎస్(జిల్లా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ) చైర్మన్ ఐర నారాయణరెడ్డి(కాంగ్రెస్), వైస్ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డిలపై అవిశ్వాస అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి హైకోర్టు స్టే వెకేట్ కావడంతో జిల్లా సహకార అధికారి(డీసీఓ) సూర్యచంద్రరావు సోమవారం డీసీఎంఎస్ డెరైక్టర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28న ఉదయం 11గంటలకు డీసీఎంఎస్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డెరైక్టర్లు అందరూ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో డీసీఎంఎస్ క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) తన వశం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.., డీసీఎంఎస్పై కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు పావులు కదిపింది. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం డీసీఎంఎస్ చైర్మన్పై కాంగ్రెస్ పార్టీ డెరైక్టర్లతోనే జూలై 11న అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇప్పించారు. ఈ నేపథ్యంలో డీసీఓ సూర్యచంద్రరావు ఆగస్టు 8న డీసీఎంఎస్ డెరైక్టర్ల సమావేశం ఏర్పాటు చేస్తూ డెరైక్టర్లందరికీ నోటీసులు జారీ చేశారు. పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లో ఉన్న జిల్లా సహకార అధికారికి ఈ సమావేశం నిర్వహించే అధికారం లేదని నారాయణరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సమావేశం నిలిచిపోయింది. తాజాగా స్టే వెకేట్ కావడంతో మళ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు డీసీఓ సూర్యచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. డీసీఎంఎస్లో మొత్తం పది మంది డెరైక్టర్లు ఉన్నారు. ఏడుగురు సభ్యులు(మూడింట రెండు వంతులు) అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే చైర్మన్, వైస్ చైర్మన్లు పదవి నుంచి వైదొలిగిపోతారు. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు క్యాంపుల్లో ఉండడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాంపులో ఉన్న ఒక్కో డెరైక్టర్కు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు నజరానా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొంత మొత్తాన్ని చైర్మన్ ఎన్నిక అనంతరం ఇవ్వాలనే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం అంశం విషయంలో జిల్లా మంత్రి జోగు రామన్న, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్రెడ్డిలు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28న జరగనున్న డీసీఎంఎస్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం నెగ్గితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీ కానున్నాయి. తర్వాత ఈ పదవుల ఎన్నిక కోసం నోటీఫికేషన్ జారీ చేస్తామని, మరోమారు డెరైక్టర్ల సమావేశం నిర్వహించి ఈ పదవుల ఎన్నిక నిర్వహిస్తారని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు. చైర్మన్ పదవి రేసులో డెరైక్టర్ బి.వినోద్రెడ్డి(జామిడి పీఏసీఎస్) ఉన్నట్లు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement