-
ఆ ఘటన కలిచివేసింది: దివ్య దేవరాజన్
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్లో జరిగిన ఘటన కలిచివేసిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు ఇప్పటివరకు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికి ముగ్గురు నిందితులను అరెస్టయ్యారని, అక్కడ ఉన్న చిన్నారులను ప్రభుత్వ హోంకి తరలించామని వెల్లడించారు. నేటి నుంచి హైపవర్ కమిటీతో విచారణ జరుగుతుందన్నారు. డీజీపీ మహేందర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ అనాథాశ్రమాలపై విచారణ చేస్తున్నామన్నారు. పాప పోస్ట్మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 429 ప్రైవేట్ హోమ్స్ లో విచారణ చేస్తున్నామని ఆమె వెల్లడించారు. చివరిగా చిన్నారి స్టేట్మెంట్ ఇచ్చిందని, అందులో చిన్నారి బంధువు కూడా వైర్తో దాడి చేసినట్లు తెలిపిందన్నారు. ఆశ్రమంలో అమ్మాయిపైనా అఘాయిత్యం జరిగినట్లు చిన్నారి తెలిపిందని పేర్కొన్నారు. ఆగస్టు 20న హైపవర్ కమిటీ ప్రాథమిక నివేదిక అందిస్తుందని దివ్యదేవరాజన్ తెలిపారు. -
అధికారుల అంచనా తప్పిందా!?
సాక్షి, ఆదిలాబాద్ :అంచనా తప్పిందా.. ఆదివాసీ ఉద్యమం విషయంలో యంత్రాంగం తప్పటడుగు పడిందా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. సద్దుమణిగిందనే భావన.. ఇంటెలిజెన్స్ నివేదికలు అలాగే ఉన్న పరిస్థితుల్లో మరోసారి ఉద్యమ గళం ఉలిక్కిపడేలా చేసింది. డిసెంబర్ 9న ఢిల్లీలో తలపెట్టిన ఆదివాసీ సభ నేపథ్యంలో తాజాగా ఆదివాసీలు ఉట్నూర్లో కదం తొక్కడం బలప్రదర్శనగానే భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. రెండేళ్ల కిందట జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితుల నుంచి పూర్తిగా కుదుట పడ్డామన్న భావనలో ఉన్న జిల్లా యంత్రాంగానికి ఇది మింగుడుపడని వ్యవహారమే. తాజా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆందోళనకరమే. రెండేళ్ల పరిస్థితుల నుంచి.. డిసెంబర్ 9.. మళ్లీ ఈ తేదీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017లో ఆదివాసీలు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. సరిగ్గా ఆ రోజే ఈ ఉద్యమానికి నాంది పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ రోజు హైదరాబాద్ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివెళ్లారు. అప్పుడు ఈ ఉద్యమం పెద్దస్థాయిలో రాజుకుంటుందని అంచనా వేయలేకపోయారు. ఆ సభ తర్వాత ఉమ్మడి జిల్లాలో పూర్తిగా శాంతిభద్రతలు అదుపుతప్పి ఉద్యమ తీవ్రతను చాటింది. ఈ పరిస్థితుల్లో అప్పుడు ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి ఆదిలాబాద్ కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్, నిర్మల్ కలెక్టర్ ఇలంబరిది, కుమురంభీం కలెక్టర్ చంపాలాల్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాస్, కుమురంభీం ఎస్పీ సన్ప్రీత్సింగ్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. వారి స్థానంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆదిలాబాద్ కలెక్టర్గా దివ్యదేవరాజన్, నిర్మల్ కలెక్టర్గా ప్రశాంతి, కుమురంభీం కలెక్టర్గా ప్రశాంత్ జీవన్పాటిల్, విష్ణు ఎస్.వారియర్ను నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఎస్పీగా, కుమురంభీం జిల్లా ఎస్పీగా కల్మేశ్వర్లను నియమించారు. ఆ తర్వాత క్రమంలో కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్ల బదిలీలు జరిగాయి. ఇక దివ్యదేవరాజన్, ప్రశాంతి, విష్ణు ఎస్.వారియర్లు అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారు. ప్రధానంగా శాంతిభద్రతలను అదుపులోకి తేవడం, ఆదివాసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఆ తర్వాత క్రమంలో ఉమ్మడి జిల్లాలో పరిస్థితులు మారాయి. వరుసగా ఎన్నికలు రావడం, ఎన్నికల అనంతరం ఆదివాసీ ఉద్యమానికి ప్రధానంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోయం బాపురావు ఎంపీ కావడంతో ఇక్కడ వాతావరణం మారుతుందని యంత్రాంగం భావిస్తూ వచ్చింది. ప్రధానంగా ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్ ఆదివాసీలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఈ రెండేళ్ల కాలంలో విశేషంగా చొరవ చూపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమ రూపం మారిందేమోనన్న భావన యంత్రాంగంలో కనిపించింది. బలప్రదర్శన.. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ ఉద్యమ తీవ్రత లేదనే భావనతో పోలీసు యంత్రాంగంలో కనిపించింది. అయితే ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రోజు ఉట్నూర్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు సమావేశం నిర్వహించిన కుమురంభీం కాంప్లెక్స్ వద్దకు వచ్చి మీటింగ్ను అడ్డుకునే యత్నాలు చేయడం ఒక్కసారిగా పోలీసు వర్గాలను నివ్వేరపోయేలా చేసింది. ఊహించని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆదివాసీలు కేబీ కాంప్లెక్స్కు తరలిరావడంతో వారికి ఈ పరిస్థితి కత్తిమీదా సాములా తయారైంది. అటు తర్వాత తాజాగా సోమవారం ఉట్నూర్లో ఆదివాసీలు తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీని పోలీసు వర్గాలు అసలు అంచనా వేయలేకపోయింది. వేలాది మంది ఆదివాసీ మహిళలు, పురుషులు ఉట్నూర్కు తరలివచ్చిన విధానం పోలీసులకు ఇప్పటికీ అంతుపట్టని రీతిలో ఉంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా విఫలమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు ఉట్నూర్కు అంతా పెద్దఎత్తున తరలిరావడం, అసలు ఎక్కడి నుంచి ఇంతమంది ఒక్కసారిగా వచ్చారు.. ఓ మెమోరాండం ఇచ్చేందుకు వస్తున్నారని తెలిసినా ఇంత పెద్ద ఎత్తున వస్తారని ఊహించలేకపోయారు. వీరందరు ఉట్నూర్ వరకు ఎలా వచ్చారన్న సమాచా రం లేకపోవడంతో పోలీసు శాఖలోనే విస్మ యం వ్యక్తం చేస్తోంది. అలాగే ఆదివాసీ ఉద్యమంలో సోమవారం జరిగిన ర్యాలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. వారు ర్యాలీ నిర్వహిం చిన విధానం ఎవ్వరికి అంతుపట్టని రీతిలో ఉం ది. పోలీసు వర్గాలనే విస్మయ పర్చేలా ఆదివాసీ ఉద్యమ నాయకత్వం వ్యూహాలు రచిస్తున్నాయనడానికి నిన్న జరిగిన ర్యాలీయే నిదర్శనమన్న చర్చ సాగుతోంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ సోయం బాపురావు పార్లమెం ట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న సమయంలో అసలు ఈ ర్యాలీని ఎవరు అంచనా వేయలేకపోయారు. మరోపక్క ఎంపీ సో యం బాపురావు తాను ప్రత్యక్ష కార్యాచరణలో లేకపోయినా ఆయన కనుసన్నల్లోనే ఇది జరుగుతుందనేది పోలీసుల భావన. అయితే ఎవరికీ అంతుపట్టని రీతిలో ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా ఆదివాసీలు తమ సత్తా చాటుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే గళం.. డిసెంబర్ 9న ఢిల్లీలో ఆదివాసీలు భారీ సభ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేలాది మంది ఢిల్లీ తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సభ కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక రైళ్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనేక బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలివెళ్లేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా అనేక మంది ఆదివాసీలు విమానయానం ద్వారా కూడా హస్తీన బాట పట్టనున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి డిసెంబర్ 9 ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో 2017 డిసెంబర్ 9న హైదరాబాద్ సభ ద్వారా పడిన అడుగుకు ఇది కొనసాగింపుగా నిర్వహిస్తున్న సభగా నిర్వహిస్తున్నారు. ఆదివాసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడి తరలివెళ్లేందుకు సిద్ధమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఐటీడీఏ సమావేశం రోజు ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలు అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొంతమంది అధికారులు ఆదివాసీల భాష నేర్చుకోవడం ద్వారా, గుస్సాడీ నృత్యం చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేశారనే భావనలో ఉండవద్దని పరోక్షంగా హెచ్చరించడం ప్రస్తుత పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయి. -
మారని రిమ్స్ ఆస్పత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్లో కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. నవిపోదురూ.. నాకేంటి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి 2008లో రూ.125 కోట్లతో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను ఏర్పాటు చేశారు. 500 పడకలతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. కార్పొరేట్ వైద్యం అందుతుందని భావించిన ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. జ్వరం, చిన్నపాటి రోగాలు తప్పా గుండెనొప్పి, క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్స కోసం నాగ్పూర్, యావత్మాల్, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. గుండెనొప్పితో రిమ్స్లో చేరిన కన్జర్వేటర్ ఫారెస్టుకు సరైన వైద్యం అందక ఆస్పత్రిలోనే మృతిచెందిన సంఘటనలు అనేకం. జూనియర్ డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతో వారు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నమే ఇంటిముఖం.. రిమ్స్లో పనిచేసే వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కానీ కొంతమంది వైద్యులు ఆలస్యంగా రావడమే కాకుండా మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయం రిమ్స్ అధికారులకు, జిల్లా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ క్లినిక్లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదు. కొంతమంది వైద్యులు విధులకు హాజరుకానప్పటికీ వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూనియర్లతోనే వైద్యం.. రిమ్స్ ఆస్పత్రి జూనియర్ వైద్యులతోనే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఎమర్జెన్సీతో పాటు అన్ని వార్డుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు జూనియర్ డాక్టర్లే విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణలో ఉన్న వీరు రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే రోగి పరిస్థితిని సీనియర్ వైద్యుడికి ఫోన్ ద్వారా విన్నవించి ఎలాంటి వైద్యం అందించాలి అనే వివరాలను తెలుసుకుంటున్నారు. రాత్రి వేళల్లో కనీసం ఒకరిద్దరు సీనియర్ వైద్యులు కూడా ఉండటం లేదు. రాత్రి డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఇంటి వద్ద ఉండడంతో అత్యవసర సమయంలో వైద్యుడి ఇంటికి వాహనాన్ని పంపించి వారిని రిమ్స్కు తీసుకొస్తున్నారు. ఖాళీల జాతర.. గత కొన్నేళ్లుగా రిమ్స్ ఆస్పత్రితో పాటు వైద్య కళాశాలలో పోస్టుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. దీంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందకపోగా మెడికోలకు సైతం సరైన రీతిలో విద్యాబోధన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. రిమ్స్కు మొత్తం 151 పోస్టులు మంజూరు ప్రస్తుతం 95 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 21కి ఏడుగురు పనిచేస్తుండగా, 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 30 పోస్టులకు 15 మంది పనిచేస్తుండగా, మరో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 41 పోస్టులకు గాను 34 పనిచేస్తున్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ట్యూటర్ పోస్టులు 59కి 39 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రి అంతా కంపు కంపు రిమ్స్ ఆస్పత్రి ఆవరణతో పాటు వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. మరుగుదొడ్లు సరిగా లేవు. చెత్తాచెదారం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన వారు ముక్కున వేలుసుకొని, మూతికి గుడ్డ పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో రోగులను చూడటానికి వచ్చిన వారి బంధువులు రోగాల భారీన పడాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు. పారిశుధ్యం కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్, రిమ్స్ సూపరింటెండెంట్ను ఫోన్ ద్వారా సంప్రదించగా వారు స్పందించ లేదు. సెప్టెంబర్ 14న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ రిమ్స్ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకరిద్దరు వైద్యులు తప్పా ఎవరూ అందుబాటులో లేరు. వైద్యులు విధులను విస్మరించి ప్రైవేట్ క్లీనిక్లు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పలుసార్లు రిమ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో సమావేశం నిర్వహించారు. రోగులకు నాణ్యమైన సేవలు అం దించాలని, సమయపాలన పాటించాలని సూచిం చారు. విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పలు మార్లు ఆదేశించినప్పటికీ రిమ్స్ వైద్యుల తీరులో మా త్రం మార్పు కానరావడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేపడుతున్నప్పటికీ కూడా వారిలో చలనం లేకుండా పో యిందని పలు వురు పేర్కొంటున్నారు. ఇదీ రిమ్స్ వైద్యుల తీరు.. -
‘దివ్య’మైన ఆలోచన
ఆదిలాబాద్అర్బన్: కలెక్టర్ దివ్యదేవరాజన్ పరిపాలన తీరే సెపరేటు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఏ పనిలో పాలు పంచుకున్నా.. అందులోని ప్రాధాన్యతను గుర్తించి గుర్తుండి పోయేలా ముద్ర వేయడం ఆమె ప్రత్యేకత. దొరికిన ఏ కొంత సమయాన్నైనా ప్రజలకు ఉపయోగపడేలా మలచడం కలెక్టర్కు ఉన్న అలవాటు. అందులో భాగంగానే 2019లో పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని కలెక్టర్ కొత్త ఏడాది మొదటి రోజు నుంచే ప్రారంభించారని చెప్పవచ్చు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వీట్లతో వచ్చి పూలబొకేలు కలెక్టర్కు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం సహజం. దీంతో అధిక ధరకు కొనుగోలు చేసి తీసుకువచ్చిన పూలబొకేలు కొన్ని రోజులకు చెడిపోయి ఎక్కడో పడేయాల్సి వస్తోంది. బొకేల వల్ల ఉపయోగం లేక పోవడంతో ఈసారి వినూత్నంగా ఆలోచించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే ఎవరైనా సరే బొకేలకు బదులు దుప్పట్లు, బ్లాంకెట్లు, శాలువాలు, రగ్గులు తీసుకురావాలన్నారు. పేదలకు అవి పంపిణీ చేసేందుకు ఉపయోగపడుతాయనేది కలెక్టర్ ఉద్దేశం. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దివ్యదేవరాజన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు శాలువాలు, రగ్గులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వాటిని వెనుకబడిన ప్రాంతాల్లోని పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆదివాసీ మహిళలతో ఆదిలాబాద్ కలెక్టర్ డ్యాన్స్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement