-
భారీ విస్తరణ దిశలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. నూతన మాల్స్ ఏర్పాటు ద్వారా రిటైల్ విభాగాన్ని అయిదేళ్లలో రెండింతలకు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. రిటైల్ రంగంలో ప్రస్తుతం సంస్థ ఖాతాలో 42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 మాల్స్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. 30 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని విభాగాల్లో కలిపి 150కిపైగా ప్రాజెక్టులను సంస్థ ఇప్పటికే పూర్తి చేసింది. అద్దె కింద 4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. 21.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య భవనాల నిర్మాణానికి అవసరరమైన స్థలం కంపెనీ చేతిలో ఉంది. గృహ, కార్యాలయ ప్రాజెక్టులను సైతం కొత్తగా అభివృద్ధి చేస్తామని డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో వెల్లడించారు. ‘ఆఫీస్, మాల్స్ అద్దె వ్యాపారం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. షాపింగ్ మాల్స్లో కస్టమర్ల రాక మహమ్మారి పూర్వ స్థాయికి స్థిరంగా చేరుతోంది’ అని వివరించారు. కాగా, నూతన బుకింగ్స్ 2021–22లో రెండింతలై రూ.7,273 కోట్లు నమోదైంది. గురుగ్రామ్, గోవాలో రెండు షాపింగ్ మాల్స్ నిర్మాణానికి రూ.2,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. -
ఫేస్బుక్లో వాద్రా సంచలన వ్యాఖ్యలు
ఆయనకు పదవులు అంటూ ఏమీ లేవు.. కానీ ఉన్న గుర్తింపు మాత్రం తక్కువది కాదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు. అవును.. ఆయనే రాబర్ట్ వాద్రా. ఆయనగారి మీద లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. భూముల విషయంలో అక్రమాలు చేశారన్న ఆరోపణలపై వాద్రామీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే.. ఈ వ్యవహారంపై రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, ప్రభుత్వాలు తన విషయంలో ఏమీ రుజువు చేయలేవని అన్నారు. ‘‘ఆధారాలు లేకుండా వాళ్లు ఏమీ రుజువు చేయలేరు. దాదాపు దశాబ్దం నుంచి ప్రభుత్వాలు నాపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి’’ అని వాద్రా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. హర్యానాలో డీఎల్ఎఫ్ సంస్థకు, వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు మధ్య జరిగిన భూములఘొప్పందాలపై జస్టిస్ ఎస్ఎన్ ఢింగ్రా కమిషన్ విచారణ పూర్తిచేసిన ఒకరోజు తర్వాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జస్టిస్ ఢింగ్రా కమిషన్ విచారణ సమయంలో వాద్రాను మాత్రం తమ ముందుకు పిలవలేదు. కమర్షియల్ లైసెన్సుల మంజూరుకు సంబంధించిన 250 ఫైళ్లను పరిశీలించింది. 26 మంది ప్రభుత్వాధికారులను విచారించింది. 2014 హర్యానా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు వాద్రా భూ అక్రమాలపై బీజేపీ మండిపడింది. 2015 మే నెలలో హర్యానా ప్రభుత్వం జస్టిస్ ఢింగ్రా కమిషన్ను ఈ అక్రమాలపై విచారణకు నియమించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement