-
Narcotics Control Bureau: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్.. డీఎంకే మాజీ నేత అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారిగా, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్ (36)ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవల ఎన్సీబీ సుమారు రూ.2 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను బ్యూరో ఛేదించడం తెలిసిందే. సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తమిళ, హిందీ సినీ రంగ ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. ‘‘పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాదిక్ నుంచి ముడుపులందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని చెప్పారు. అతనిపై త్వరలో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మూడు దేశాలకు స్మగ్లింగ్ భారత్ నుంచి కొబ్బరి పొడి, మిక్స్ ఫుడ్ పౌడర్లో కలిపిన సూడోఎఫెడ్రిన్ తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2023 డిసెంబర్లో ఎన్సీబీకి ఉప్పందించాయి. ఢిల్లీలో సాదిక్కు చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడోఎఫెడ్రిన్ దొరికింది. దీన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియాకు తరలిస్తున్న రాకెట్లో సాదిక్ కీలక సూత్రధారిగా తేలాడు. పైరేటెడ్ సీడీల నుంచి మొదలైన దందా సాదిక్ దందా పైరేటెడ్ సీడీలతో మొదలైంది. కెటమైన్ డ్రగ్ను అంతర్జాతీయ మార్కెట్కు స్మగ్లింగ్ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ను అంతర్జాతీయ మార్కెట్లోకి పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్కు అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది! -
అయోమయంలో అళగిరి!
డీఎంకే నుంచి బహిష్కృతుడైన అళగిరి అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈనెల 17వ తేదీన తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పిన అళగిరి సోమవారం మదురైలో నిర్వహించిన సమావేశంలో పార్టీ పెట్టేది లేదని, డీఎంకేను కాపాడుకోవడమే తన లక్ష్యమంటూ చెప్పడంతో మద్దతుదారులందరూ అయోమయంలో పడిపోయారు. చెన్నై : రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండగా డీఎంకే కార్యక్రమాలకు దూరమై అళగిరి వర్గం దాదాపు ఖాళీగా ఉంది. గత వారం రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీ అగ్రనేతలతోపాటూ సూపర్స్టార్ రజనీకాంత్ను సైతం కలిసిన అళగిరి 17వ తేదీన తన నిర్ణయా న్ని ప్రకటిస్తానని తెలిపారు. భారీ సంఖ్యలో అనుచరులు హాజరుకాగా మధురైలో సోమవారం ఆయన సమావేశమైన్నారు. కొత్తగా పార్టీని పెట్టబోయేది లేదని స్పష్టం చేయడం ద్వారా అనుచరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. డీఎంకే అధినేత తనకు తండ్రి, అంతేకాదు పార్టీ అధినేత, తాను తప్పుచేశానని క్షమాపణ కోరడంలో తప్పులేదని పేర్కొనడం ద్వారా మళ్లీ డీఎంకేలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పొరపాట్లు, సంస్థాగత ఎన్నికలు జరగకుండానే పార్టీ పదవుల్లో నియామకం వంటివి కరుణ దృష్టికి తెచ్చినందుకు తొలగించారని తెలిపారు. పోస్టర్లు వేయడమే తమవర్గానికి నష్టం చేసిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పాత పోస్టర్లు వదిలేస్తే తాజాగా కలైంజర్ డీఎంకే అంటూ మళ్లీ పోస్టర్లు వేయ డం వల్ల తాను అదేపేరుతో కొత్తపార్టీ పెడుతున్నట్లుగా ప్రచారం జరిగిందన్నారు. డీఎంకేనే కలైంజర్గా ఉన్నపుడు మరో కలైంజర్ డీఎంకే పార్టీ ఎందుకని వ్యాఖ్యానించారు. ఇకపై పోస్ట ర్లు వేయవద్దని అంటూనే డీఎంకేనే కలైంజర్, కలైంజరే డీఎంకే అనే నినాదంతో ఒక పోస్టరు వేయాల్సిందిగా ఆదేశించారు. కరుణ కొందరి కంబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నారని, ఆ ఇబ్బందులు ఏమిటో తనకు తెలిపితే ఆయనను విడిపించేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. అన్నాడీఎంకే, డీఎండీకేల నుంచి వచ్చిన కొందరు కరుణ ఆంతరంగికులుగా మారి ద్రోహాన్ని తలపెడుతున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. డీఎంకేను, తండ్రి కరుణానిధిని ఇటువంటి దుష్టశక్తుల నుంచి కాపాడుకోవడం తన ముందున్న తక్షణ కర్తవ్యమని చెప్పారు. పార్టీకి పూర్తిస్థాయిలో నమ్మకమైన వ్యక్తిని తాను మాత్రమేనని ప్రకటించుకున్నా రు. ఇటీవల రజనీకాంత్ను కలుసుకున్నపుడు రాజకీయాలపై చర్చించలేదన్నారు. కుటుంబ పరంగా తనకు జరిగిన కష్టాన్ని రజనీతో పంచుకుని ఈ సమయంలో ఓదార్పుగా పలకరించినందుకు కృత జ్ఞతలు తెలిపానని చెప్పారు. ఎప్పుడైనా తనను కలుసుకోవచ్చని ఆయన హామీ ఇచ్చారని అళగిరి తెలిపారు. కరుణ నుంచి సానుభూతి పొందేలా అళగిరి ప్రసంగం సాగడం ద్వారా డీఎంకేలో పునఃప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో అళగిరి మద్దతుదారులు మళ్లీ డీఎంకేలోకి వెళ్లాలా వద్దా అనే అయోమయంలో పడిపోయూరు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement