-
రూ.1.2 లక్షల కోట్లకు ఆయుర్వేద మార్కెట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రెట్టింపు స్థాయికి పైగా వృద్ధి చెందనుంది. ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 57,450 కోట్లు) ఉన్న ఈ మార్కెట్ 16.27 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) చేరనుంది. స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లలో సహజసిద్ధ చికిత్సా విధానాలకు డిమాండ్ నెలకొనడం, ఆయుర్వేద ప్రాక్టీషనర్లు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు కొత్తగా ఈ విభాగంలోకి ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా వస్తుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఆయుర్వేద టెక్ స్టార్టప్ సంస్థ నిరోగ్స్ట్రీట్ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2023 – 2028 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ ఏటా 15 శాతం చొప్పున పెరగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. నివేదిక ప్రకారం ప్రోడక్ట్ విభాగం 16 శాతం, సర్వీసుల విభాగం 12.4 శాతం చొప్పున వృద్ధి చెందనున్నాయి. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 7,500 పైచిలుకు ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థలు ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, జమ్మూ–కశీ్మర్, కేరళ ఈ జాబితాలో ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఆయుష్ (ఆయుర్వేద, యోగ, యునానీ, సిద్ధ, హోమియోపతి) విభాగం 24 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోటేచా ఇటీవల ప్రస్తావించిన నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని నిరోగ్స్ట్రీట్ తెలిపింది. -
గడచిన పదేళ్లలో... గృహ వినియోగం రెండింతలు
న్యూఢిల్లీ: భారత్లో నెలవారీ తలసరి గృహ వినియోగం గడిచిన దశాబ్ద కాలంలో రెండింతలకు పైగా పెరిగినట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. 2011–12 నాటికి తలసరి వినియోగం రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి ఇది పట్టణ ప్రాంతాల్లో రూ.6,459కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కాలంలో తలసరి వినియోగం రూ.1,430 నుంచి రూ.3,773కు చేరింది. గృహ వినియోగ వ్యయంపై ఎన్ఎస్ఎస్వో 2022 ఆగస్ట్–2023 జూలై మధ్య జరిపిన సర్వే వివరాలను విడుదల చేసింది. ప్రతి వ్యక్తి సగటున చేసే గృహ వినియోగ ఖర్చును తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టింది. 2021–12 నాటి ధరల ప్రకారం చూస్తే.. సగటు ఎంపీసీఈ పట్టణ ప్రాంతాల్లో రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి రూ.3,510కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఎంపీసీఈ రూ.1,430 నుంచి రూ.2,008కి పెరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పట్టణ ప్రాంతాల నుంచి 1,55,014 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,06,732 గృహాల సగటు శాంపిళ్లను ఈ అధ్యయనంలో భాగంగా ఎన్ఎస్ఎస్వో సేకరించింది. -
రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది?
రష్యా పలు అధికారిక కార్యక్రమాల కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డూప్ (బాడీ డబుల్స్)ను వినియోగిస్తున్నదంటూ సోషల్మీడియాలో తరచూ పలు ఊహాగానాలను షికారు చేస్తున్నాయి. అయితే వీటిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఖండించింది. క్రెమ్లిన్ అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఇటువంటి వాదనలను వినోదం కోసమే చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మాస్కోలో ప్రారంభమైన రష్యా ఎగ్జిబిషన్లో పెస్కోవ్ మాట్లాడుతూ ‘మాకు ఉన్నది పుతిన్ ఒక్కరే. రష్యా అధ్యక్షుని ‘బాడీ డబుల్స్’ అంటూ వస్తున్న ఊహాగానాలు హాస్యాస్పదమైనవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇటువంటివి విరివిగా కనిపిస్తున్నాయని అన్నారు. కొందరు నిపుణులు ఇంటర్నెట్లో పుతిన్ రూపాలను లెక్కకుమించి సృష్టిస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుని బాడీ డబుల్స్ను పలు విదేశీ పర్యటనలతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారని ఒక వార్తాపత్రిక పేర్కొంది. అలాగే ఇటీవల జపనీస్ టీవీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిల్ బుడనోవ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. పుతిన్ ‘లుక్-అలైక్’ అంటూ వచ్చిన పలు నివేదికలు అసంబద్ధమైనవంటూ తాజాగా మరోమారు డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నారని , నాన్స్టాప్గా కూడా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
యూఎస్ ఓపెన్ డబుల్స్ బరిలో సాకేత్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ ఏడాది నాలుగో గ్రాండ్స్లామ్ టోర్నీ లోనూ పోటీపడనున్నాడు. భారత్కే చెందిన యూకీ బాంబ్రీతో కలిసి 77వ ర్యాంకర్ సాకేత్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలలో బరిలోకి దిగాడు. యూఎస్ ఓపెన్లో మాత్రం యూకీతో కాకుండా కరత్సెవ్ (రష్యా)తో సాకేత్ జత కట్టాడు. బ్రెజిల్ ప్లేయర్ డెమోలైనర్తో కలిసి యూకీ ఆడనున్నాడు. 35 ఏళ్ల సాకేత్ 2016 యూఎస్ ఓపెన్ సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్లో నిష్క్రమించాడు. -
సెమీస్లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్లో ఈసారి కొత్త చాంపియన్
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో భాగంగా పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 7–5, 6–2తో టాలన్ గ్రీక్స్పూర్–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 2015 తర్వాత వింబుల్డన్ టోర్నీలో బోపన్న డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్లో ఈసారి కొత్త చాంపియన్ ఆన్స్ జబర్, ఎలీనా రిబాకినా వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్ అవతరించనుంది. ట్యునిషియా క్రీడాకారిణి, ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆన్స్ జబర్ ధాటికి డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ ఆన్స్ జబర్ 6–7 (5/7), 6–4, 6–1తో రిబాకినాను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జబర్ తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుసగా రెండు సెట్లు గెలిచి విజయం దక్కించుకుంది. ఎనిమిది ఏస్లు సంధించిన జబర్ నెట్ వద్దకు 11 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు రిబాకినా 22 సార్లు నెట్ వద్దకు వచ్చి 10 సార్లు మాత్రమే పాయింట్లు నెగ్గింది. 35 విన్నర్స్ కొట్టిన జబర్ ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రిబాకినా 20 అనవసర తప్పిదాలు చేసింది. సెమీస్కు చేరుకున్న సబలెంకా మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండోసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్కు చేరింది. 87 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సబలెంకా 6–2, 6–4తో 25వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. రెండో సెట్లో ఒకదశలో సబలెంకా 2–4తో వెనుకబడినా ఆందోళన చెందకుండా పట్టుదలతో ఆడి వరుసగా నాలుగు గేమ్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్లో స్వితోలినా (ఉక్రెయిన్)తో వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్); ఆన్స్ జబర్తో సబలెంకా తలపడతారు. సెమీస్లో ప్రవేశించిన సబలెంకా, అల్కారాజ్ తొలిసారి సెమీస్లోకి అల్కరాజ్, మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 6–4, 1–6, 4–6, 7–6 (7/4), 6–1తో క్రిస్టోఫర్ యుబాంక్స్ (అమెరికా)పై, అల్కరాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); మెద్వెదెవ్తో అల్కరాజ్ ఆడతారు. Welcome back to the semi-finals, @SabalenkaA 👏 The No.2 seed powerfully gets past Madison Keys in straight sets, 6-2, 6-4#Wimbledon pic.twitter.com/tPuQdJzmoc — Wimbledon (@Wimbledon) July 12, 2023 చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్తో దురుసు ప్రవర్తన #NovakDjokovic: 46వసారి సెమీస్లో.. ఫెదరర్ రికార్డు సమం
Pagination
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement