-
రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం!
ప్రభుత్వ వాహనాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ పాత వెహికల్స్ను స్క్రాప్గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిందే. ఈ నేపథ్యంలో ఆ వాహనాల్ని రద్దు చేస్తూ..స్క్రాప్గా మార్చేలా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2023,ఏప్రిల్ 1 నుంచి దేశంలో 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను రద్దు చేయనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖల బస్సులు, ఇతర వాహనాలకు ఈ కొత్త నియమం తప్పనిసరి. రాబోయే ౩౦ రోజుల్లో దీనికి సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది. అధికారిక వెబ్సైట్ comments-morth@gov.in కు పంపించాలని కోరింది. స్క్రాప్గా మార్చేస్తాం 15 ఏళ్లు పైబడిన భారత ప్రభుత్వ వాహనాలన్నింటినీ స్క్రాప్ (చెత్త) గా మారుస్తామని, దీనికి సంబంధించిన విధి, విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు అగ్రికల్చర్ కార్యక్రమం 'ఆగ్రో విజన్' ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఓల్డ్ గవర్నమెంట్ వెహికల్స్ను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అధికారిక ఫైల్లో సంతకం చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలకు పంపాను. ఆయా ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అమలు చేయాలని కోరారు. వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ 2021లో వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ పాలసీ ద్వారా పరిశ్రమకు మూడు విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని చెబుతోంది. అందులో పాత వాహనాల నుండి వెలువడే ఉద్గారాలను (కాలుష్యం) తగ్గించడానికి సహాయపడుతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభసాటిగా మారుతుంది. ఎందుకంటే పాత వాహనాలను కొత్త వాహనాలతో భర్తీ చేసేలా డిమాండ్ను పెంచుతుంది. ఉక్కు పరిశ్రమ కోసం చౌకైన ముడి పదార్థాలు స్క్రాప్ మెటీరియల్ నుండి లభిస్తాయి. ఈ చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించేందుకు దోహద పడతాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
Agnipath Scheme: దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు
సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సోమవారం(నేడు) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్లో 25,000 మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నేవీలో మొదటి బ్యాచ్కు ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ అగ్నిపథ్ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్ అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎంపికైన మొదటి బ్యాచ్కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్ త్రిపాఠి ఉద్ఘాటించారు. ఐఏఎఫ్లో డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో రిక్రూట్మెంట్ల గురించి ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఏఎఫ్లో అగ్నిపథ్ కింద మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. -
ఏపీ రాజధానిలో భూ సంతర్పణ
-
నెరవేరనున్న మండల కల
డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్కు చోటు సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు కల్హేర్: కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్ పేరు ఉండడంతో ప్రజల దశాబ్దాల కలకు అడుగు పడినట్టు అయ్యింది. చాలా కాలంగా మండల ఏర్పాటు కోసం సిర్గాపూర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ కళ సాకారం కానుంది. కల్హేర్ మండలంలో సిర్గాపూర్ ఓ పెద్ద గ్రామం. ఈ గ్రామానికి మండల హోదా కల్పిస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ప్రజలు భావించారు. ఇదే డిమాండ్ను చాలా కాలంగా వినిపిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో సిర్గాపూర్కు కలిసొచ్చింది. చాలా కాలంగా మండలం కోసం నిరీక్షిస్తున్న ప్రజల ఆకాంక్షను అధికారులు, ప్రభుత్వం గుర్తించింది. మండల ఏర్పాటుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్నాయని బేరీజు చేసుకొని ఆ దిశగా అడుగులు వేసింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్కు చోటు కల్పించింది. దీంతో ఇక్కడి ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. త్వరలో మా గ్రామం కూడా మండల కేంద్రం అవుతుందని సంతోష పడుతున్నారు. ఇదిలా ఉండగా సమీపంలో ఉన్న పంచాయతీలు కూడా సిర్గాపూర్ మండల కేంద్రం అయితే మేలు జరుగుతుందని, అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. దసరా నుంచి కొత్త మండలంలో మా జీవితాలు ప్రారంభమవుతాయని సిర్గాపూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాట నిలుపుకున్న పాలకులు ఖేడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో సిర్గాపూర్లో పర్యటించిన నాయకులు, ప్రజాప్రతినిధులు మండల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ప్రజలకు కూడా నమ్మకం కలిగింది. అనుకున్నట్లే ప్రజల ఆకాంక్ష మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సిర్గాపూర్కు స్థానం కల్పించారు. మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మండలంలో చేరిన గ్రామాలు కల్హేర్ మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు, 41 తండాలు ఉన్నాయి. సిర్గాపూర్ను మండలంగా ఏర్పాటు చేయడంతో పలు గ్రామాలు విలీనమయ్యాయి. సిర్గాపూర్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు కానుంది. కల్హేర్ మండలంలోని సిర్గాపూర్, కడ్పల్, ఖాజాపూర్, గోసాయిపల్లి, పోచాపూర్, బోక్కస్గాం, చిన్న ముబారక్పూర్, పెద్ద ముబారక్పూర్, అంతర్గాం, సుల్తానాబాద్, కంగ్టీ మండలంలోని చీమాల్పాడు, గర్డెగాం, సంగెం, వాసర్, పోట్పల్లి, నాగన్పల్లి, వంగ్దాల్, గౌడ్గాం(కె), గాజుల్పాడు, బాన్స్వాడ(డి), దామర్గ్ది(పిఎం), నారాయణఖేడ్ మండలంలోని ఉజలంపాడ్ను కలిపి సిర్గాపూర్ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సిర్గాపూర్ మండలం జనాభా 35,004 ఉండనుంది. గర్వించ దగ్గ అంశం సిర్గాపూర్ కేంద్రంగా మండలం ఏర్పాటు కానుండడం మాకు గర్వంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో దశాబ్దాల కళ సాకారం కానుంది. సిర్గాపూర్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మండల ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. - మనీష్పాటిల్, సర్పంచ్, సిర్గాపూర్ మాట నిలబెట్టుకున్నారు సిర్గాపూర్ను మండలంగా చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వారి మాటను నిలుపుకున్నారు. గ్రామస్తుల విన్నపాన్ని మన్నించి మండలం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. - సంజీవరావు, ఎంపీటీసీ, సిర్గాపూర్ -
అభ్యంతరాల స్వీకరణకు చర్యలు
మహబూబ్నగర్ న్యూటౌన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్, మండలాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకుగాను అధికారులు చర్యలు తీసుకున్నారు. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్గా విభజిస్తూ జారీ చేసిన ఈ నోటిఫికే షన్లో అచ్చంపేట రెవెన్యూ డివిజన్తోపాటు ఏడు కొత్త మండలా (మహబూబ్నగర్ రూరల్, రాజాపూర్, మరికల్, చిన్నంబావి, పదర, అమరచింత, నాందిన్నె) లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక ఫరూఖ్నగర్, కేశంపేట, కొత్తూరు, కొందుర్గు మండలాలను శంషాబాద్ జిల్లాలో కలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా గ్రామాలు, ప్రాంతాల ప్రజల నుంచి నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలతో కూడిన అభ్యంతరాలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అభ్యంతరాలిలా.... రాతపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేయాలనుకునే వారు తమ ప్రాంతంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోగాని, కలెక్టరేట్లో గానీ తెలియజేయాలి. నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలతో అభ్యంతరాలు తెలియజేయాలి. మండలాలు, గ్రామాల కూర్పు, జిల్లాల ఏర్పాటు వంటి విషయాలు, ఇప్పటివరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మండలాలను శంషాబాద్ జిల్లాలో చేర్చిన విషయాలపై అభ్యంతరాలుంటే క్లుప్తమైన సమాచారంతో రాతపూర్వకంగా ఆర్డీఓ కారాలయాల్లో అధికారులకు అందజే యాలి. ఆన్లైన్లో అభ్యంతరాలు తెలపాలంటే ఠీఠీఠీ.n్ఛఠీఛీజీట్టటజీఛ్టిటజౌటఝ్చ్టజీౌn.్ట్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్ సైట్లో తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement