-
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే
హైదరాబాద్ : టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యతను బీజేపీనే భర్తీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ గ్రామానికి మోదీ పథకాలను తీసుకు వెళ్తామని తెలిపారు. త్వరలోనే గ్రామాల్లో పర్యటించనున్నట్లు లక్ష్మణ్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. -
'మజ్లిస్ కనుసన్నల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నేతలు ఎమ్మెల్యే లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావులు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మజ్లిస్ పార్టీ కనుసన్నలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మెదక్ రైతులపై జరిగిన లాఠీఛార్జ్ అత్యంత పాశవికమని, విద్యుత్ కోసం ఇంతవరకూ ఛత్తీస్గఢ్ సీఎంతో సీఎం కేసీఆర్ మాట్లాడలేదని కిషన్రెడ్డి అన్నారు. కేసీఆర్! నీ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని కిషన్రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తుందని బీజేఎల్పీ నేత డా.లక్ష్మణ్ అన్నారు. విద్యార్థుల ఉద్యోగ కల్పనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగడం శోచనీయమని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ అన్నారు. బీజేపీలో కుటుంబం కాదు, దేశ సౌభాగ్యం, రాష్ట్ర అభివృద్ది ముఖ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు వ్యాఖ్యానించారు. కుటుంబపాలన కొనసాగించేవారికి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని మురళీధర్రావు అన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement