-
అతివేగం.. నిద్రమత్తు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రుతిమించిన వేగం, నిద్రమత్తు కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు వెల్లడయింది. ఎక్కువగా జాతీయ రహదారులపైనే దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటలలోపే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఏడాది అంటే.. 2021లో 23,313 ప్రమాదాలు జరిగాయి. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువగా 35 ఏళ్లలోపు వారే. ప్రమాదాల్లోనూ, మృతుల్లోనూ అనంతపురం జిల్లాలోనే ఎక్కువ ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు సగటున 64 ప్రమాదాలు రాష్ట్రంలో రోజుకు సగటున 64 ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలింది. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ప్రమాదానికి గురవుతున్నారు. 35 ఏళ్లలోపు యువకులు అత్యంత వేగంగా వెళ్లడం కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక జాతీయ రహదారుల్లో ట్రక్కులు, కార్లు వంటివి మితిమీరిన వేగంతో వెళుతూ అదుపుతప్పి ప్రమాదానికి గురవుతున్నాయి. కొన్నిసార్లు బ్లాక్ స్పాట్స్ (ప్రమాదం జరిగే ప్రాంతం) సూచికలున్నా పట్టించుకోకుండా వెళుతుండడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రద్దీ కారణంగానే.. వాహనాల రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగా రహదారుల నిర్వహణ చేయాల్సి ఉంది. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రతి నెలా ఒక మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ను రహదారి భద్రతకు కేటాయిస్తున్నాం. స్పీడ్ లేజర్ గన్ల సాయంతో అతివేగంతో ప్రయాణించే వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నాం. – శివరామప్రసాద్, ఉప రవాణా కమిషనర్, అనంతపురం -
తూ.కొ.శాఖ మొద్దు నిద్ర
కళ్లముందే బంక్ల్లో చోరీ నివ్వెరపరుస్తున్న సాఫ్ట్వేర్ మోసం సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్ బంకుల పంపింగ్లో జరుగుతున్న కొత్త తరహా మోసాన్ని గుర్తించకుండా తూనికల కొలతల శాఖ మొద్దునిద్ర పోతోంది. ఎస్వోటీ పోలీసులు దాడులకు దిగితేనే కానీ మేల్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు నగరంలోని పెట్రోల్ బంకుల పంపింగ్లో యథేచ్ఛగా దోపీడీ కొనసాగుతున్నా అడ్డుకట్ట వేయాల్సిన అధికారులకు మామూళ్ల మత్తు నిద్ర మాత్రం వీడడం లేదు. పెట్రోల్ వినియోగంలో హైదరాబాద్ మహానగర వాటా రాష్ర్టంలోనే సగానికి పైగా ఉండడంతో డిమాండ్ను సాకుగా తీసుకొని పెట్రోల్బంకుల యాజమాన్యాలు అక్రమాలకు తెరలేపారు. ఇప్పటికే మీటర్ పంపింగ్లో చేతివాటంతో పాటు ఇంధనంలో కల్తీతో వినియోగదారుడు మోసానికి గురవుతున్నాడు. దాంతో ప్రతి లీటర్కు 50 నుంచి 99 ఎంఎల్ల వరకు తక్కువగా రావడం సర్వసాధరణమైంది. ఆయితే తాజాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సాఫ్ట్వేర్ చిప్ వినియోగంతో పెట్రోల్ పంపింగ్పై ‘రిమోట్’ కంట్రోల్ వ్యవహారం వెలుగుచూడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తనిఖీలు జరిమానాలతో సరి.... మహానగరంలోని పెట్రోల్ బంకుల మీటర్ పంపింగ్లో మోసాలు కొనసాగుతున్నా.. తూనికల కొలతల శాఖ మాత్రం తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్ళినప్పుడు మాత్రం ఆయన ఆదేశాల మేరకు మొక్కుబడి తనిఖీలు నిర్వహించి, నామమాత్ర కేసులతో సరిపెట్టడం, చివరకు జరిమానాలతో కేసులను క్లోజ్ చేయడం సర్వసాధరణంగా మారింది. గ్రేటర్ పరిధిలో తూనికల కొలతల శాఖ కూడా గత మూడేళ్లలో సుమారు 352 బంకులను తనిఖీ చేసి మీటర్ పంపింగ్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొన్నింటిపై కేసులు నమోదు చేసి జరిమాన విధించి చేతులు దులుపుకుంది. వాస్తవంగా జరిమానతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు. మరోవైపు బంకుల్లోని మీటర్ పంపింగ్ యూనిట్లను తనిఖీ చేస్తూ సీల్ వేయాల్సి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. మహానగరం పరిధిలో సుమారు 330పైగా పెట్రోల్, డీజిల్ బంక్లు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 40 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. అందులో పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్షలు, డీజిల్తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు 11 లక్షల వాహానాలు వరకు ఉంటాయన్నది అంచనా. ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. కొత్త మోసం... నగరంతో పాటు శివార్లలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించడంతో వినియోగదారులు ఆయోమయానికి గురవుతున్నారు. సుమారు 75 బంక్లు మోసాలకు పాల్పడతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో పెట్రోల్బంకుల యాజమానుల్లో ఆందోళన రగులుకుంది. కొత్త తరహా మోసంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ కల్గిన చిప్ల వినియోగంతో ఫ్యూయల్ మిషన్తో తోపాటు బయట ఉండే రిమోట్ పనిచేస్తోంది. వినియోగదారునికి మీటర్పై లెక్కలు సరిగ్గానే ఉన్నప్పటికీ పంపింగ్ తక్కువగా జరుగుతుంది. తనిఖీలు జరిగినప్పుడు రిమోట్ ద్వారా చిప్ను ఆఫ్ చేస్తే కొలతల్లో తేడా రాకుండా పంపింగ్ మిషన్ పనిచేస్తుంది.దీంతో మోసాలు బయటపడే అవకాశాలు ఉండవు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement