-
ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినతి
-
విజయవాడలో కరోనా డస్ట్బిన్ల ఏర్పాటు
-
డస్ట్బిన్ల కోసం ఆ సీఎం సంచలన నిర్ణయం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 1,100 గ్రామాలలో మార్కెట్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేసినందుకు తన ఆరు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చెత్త, ప్లాస్టిక్ రహిత త్రిపుర కోసం ప్రచారం ప్రారంభించాలని అన్ని గ్రామ ప్రధాన్లను కోరినట్లు దేబ్ చెప్పారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బీజేపీ యూనిట్లు సెప్టెంబర్ 14 నుండి వారం రోజుల పాటు 'సేవా సప్తాహ్' లేదా సర్వీస్ వీక్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 1,100 గ్రామాలలోని మార్కెట్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేసినందుకు తన ఆరు నెలల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని త్రిపుర సీఎం వెల్లడించారు. అలాగే 'సేవా సప్తాహ్'లో భాగంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో రక్తదానం, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా అయిన దేవ్ తెలిపారు. -
చెత్త బుట్ట.. అవినీతి పుట్ట!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన చెత్త బుట్టల కొనుగోళ్లు సైతం అవినీతి వ్యవహారాలకు అడ్డాగా మారాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు చెత్త బుట్టల చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రెండు చెత్త బుట్టలు బహిరంగ మార్కెట్లో రూ.70కే లభిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.135 ధర పెట్టి కొనుగోలు చేస్తోంది. అంటే జత చెత్త బుట్టలపై రూ.65 అదనంగా ఖర్చు చేస్తోందన్న మాట! రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉండగా, ఒక్కో కుటుంబానికి రెండు చెత్త బుట్టలు ఇస్తారు. ఈ లెక్కన రూ.110.50 కోట్లు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఖర్చంతా స్థానిక సంస్థలు భరించాల్సిందే. స్థానిక సంస్థలపైనే భారం రాష్ట్రంలో మొదటి విడతలో పంచాయతీలకు చెత్త బుట్టల సరఫరాను ప్రారంభించారు. తర్వాత పురపాలక సంఘాల్లో సరఫరా చేయనున్నారు. చెత్తబుట్టల ఖర్చంతా పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సరఫరా చేసిన చెత్త బుట్టలకు సంబంధించి రూ.135 చొప్పున ఎస్బీఐ ఖాతా సంఖ్య 52096005308లో నగదు జమ చేయాలని పేర్కొంది. చెత్తబుట్టల పేరిట పంచాయతీలు, మున్సిపాలిటీలపై అదనపు భారం మోపడం ద్వారా ఆర్థిక సంఘం నిధుల నుంచి వసూలు చేసే రూ.110.50 కోట్లు ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే వెళుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు కట్టకుంటే నిధులు బంద్ పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి కనీసం అనుమతి తీసుకోకుండానే చెత్త బుట్టలను సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఈ సొమ్మును వసూలు చేసేందుకు ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వెంటనే నగదు జమ చేయాలని లేదంటే మిగతా నిధులను అడ్డుకుంటామని సర్పంచ్లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంఘం నుంచి వచ్చే కొద్దిపాటి నిధులు కరెంటు బిల్లులకే సరిపోతున్నాయని ఇప్పుడిలా బలవంతంగా చెత్త బుట్టలు అంటగడితే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేమని సర్పంచ్లు వాపోతున్నారు. ప్రతి పంచాయతీపై రూ.4 లక్షల అదనపు భారం కర్నూలు జిల్లా కోడుమూరు పంచాయతీలో 6,200 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి రెండు చెత్తబుట్టల చొప్పున మొత్తం 12,400 బుట్టలను ప్రభుత్వం సరఫరా చేసింది. జత చెత్తబుట్టలు బహిరంగ మార్కెట్లో రూ.70కే దొరుకుతున్నాయి. ఈ లెక్కన 6,200 కుటుంబాలకు 12,400 చెత్త బుట్టలను సరఫరా చేసేందుకు రూ.4,34,000 ఖర్చవుతుంది. అయితే, జత చెత్తబుట్టలకు ప్రభుత్వం రూ.135 వసూలు చేస్తున్నందు వల్ల ఈ మొత్తం రూ.8,37,000 అవుతుంది. అంటే కోడుమూరు పంచాయతీపై రూ.4,03,000 అదనపు భారం పడిందన్నమాట. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇదే. -
ఇక అండర్గ్రౌండ్ డస్ట్ బిన్స్
నగరంలో తీవ్రమవుతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ కొత్త ఆలోచన చేస్తోంది. రోడ్డు పక్కన డంపర్ బిన్లు...వాటి చుట్టూ చెత్తాచెదారం నిండడం..దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలకు చెక్ చెప్పేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ బిన్స్ ఏర్పాటు చేయనుంది. ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ సర్కిల్–10 (ఏ, బీ) పరిధిలో డంపర్బిన్స్ ఉండే చోట అండర్గ్రౌండ్ బిన్స్ నిర్మిస్తారు. బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ..మరో కొత్త కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. రోడ్ల పక్కన చెత్తడబ్బాలు(డంపర్ బిన్లు) కనిపించకుండా ఉండేందుకు వీటిని భూగర్భంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించారు. లండన్, బ్రిస్సెల్స్, హాంబర్గ్లతో పాటు మన దేశంలోనూ కొన్ని నగరాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా భూగర్భంలో ఉండే డంపర్ బిన్లున్నాయి. నగరంలోనూ కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్సార్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ద్వారా అలాంటివి ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. భూగర్భంలోనే ఈ డంపర్బిన్లను ఏర్పాటు చేయడం వల్ల రహదారులపై చెత్త కనిపించదు. దాంతో పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తాయి. రోడ్లపై పయనించే వారికి దుర్గంధం రాదు. సెన్సర్ల సహాయంతో పనిచేసే ఈ చెత్త డబ్బాలు నిండగానే సంబంధిత అధికారుల మొబైల్ఫోన్లకు సమాచారం అందేలా సాంకేతిక ఏర్పాట్లుంటాయి. దాంతో చెత్త నిండినట్లు తెలియగానే వెంటనే తరలిస్తారు. చెత్త ట్రక్లో వేసేందుకు సైతం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ట్రక్లో ఉండే క్రేన్ డంపర్బిన్ను పైకి లేపుతుంది. డంపర్బిన్ నుంచి చెత్త మాత్రం ట్రక్లో పడుతుంది. తొలిదశలో ఎంపిక చేసిన వాణిజ్య ప్రాంతాల్లో 50 డబ్బాలను ఏర్పాటుచేయాలనుకున్నారు. ఇందుకుగాను దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. వీటి వల్ల మానవ శ్రమ చాలా వరకు తగ్గుతుంది.తొలి దశలో సెంట్రల్జోన్ పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేయాలని భావించిన అధికారులు బుధవారం జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. సర్కిల్ 10–బి ఏఎంఓహెచ్, ట్రాన్స్పోర్ట్ ఇంజినీర్లు, అర్బన్ గ్రీన్సిటీ సంస్థకు చెందిన ప్రతినిధులు స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement