-
కోల్కతాలో పాకిస్తాన్ మ్యాచ్లు.. భారీ భద్రతా ఏర్పాట్లు: గంగూలీ
వన్డే ప్రపంచకప్-2023కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 5న చెన్నై వేదికగా జరగనున్న ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్లు 10 వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి. హైదరాబాద్లో మూడు మ్యాచ్లు మినహా మిగిలిన అన్ని వేదికలు కూడా ఐదు మ్యాచ్లు, అంతకుపైనే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అందులో కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఒకటి. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్లు ఈడెన్ గార్డెన్స్లో ఆడనుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ తెలిపారు. మేము ఇప్పటికే టీ20 ప్రపంచకప్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చాం. కానీ ఈసారి రెండు పాక్ మ్యాచ్లు ఉన్నాయి. ఈడెన్లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ వంటి పటిష్ట జట్టులతో ఆడనుంది. ప్రపంచకప్ వంటి ఈవెంట్ను నిర్వహించడం అంత ఈజీ కాదు, సవాలుతో కూడుకున్నది. అయితే లాంటి ఛాలెంజ్నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ మ్యాచ్లకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నాం. పాకిస్తాన్ గతంలో కోలకతాలో చాలా మ్యాచ్లు ఆడింది. అందుకే వారు మొదటి ప్రాధాన్యత కోల్కతాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత వారు చెన్నై, బెంగళూరు వంటి వేదికలలో ఆడాలని డిమాండ్ చేశారు అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహాశిష్ గంగూలీ పేర్కొన్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 15న జరగనుంది. చదవండి: టీమిండియా చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్! -
లెజెండ్స్ లీగ్ క్రికెట్ పూర్తి షెడ్యూల్ విడుదల..
లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్ సీజన్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను టోర్నీ నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. ఈ టోర్నీ దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో జరగనుంది. లీగ్ మ్యాచ్లు కోల్కతా, న్యూఢిల్లీ, కటక్, లక్నో, జోధ్పూర్ వేదికగా జరగనున్నాయి. అయితే ప్లేఆఫ్ వేదికలు ఇంకా ఖారారు కాలేదు. కాగా టోర్నమెంట్ ఓ ప్రత్యేకమైన మ్యాచ్తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఓ చారటీ మ్యాచ్ జరగనుంది. ఇండియా మహరాజాస్కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఎంపిక కాగా.. వరల్డ్ జెయింట్స్కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి అసలైన టోర్నీ ప్రారంభం కానుంది. కాగా ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. ఇండియా మహరాజాస్ జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్,యూసఫ్ పఠాన్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అక్షశ్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 పూర్తి షెడ్యూల్ కోల్కతా(ఈడెన్ గార్డెన్స్): సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు లక్నో: సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు న్యూఢిల్లీ: సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు కటక్(బారాబతి స్టేడియం): 2022 సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు జోధ్పూర్: అక్టోబర్1 నుంచి 3 వరకు ప్లే-ఆఫ్లు: అక్టోబర్ 5 నుంచి 7 వరకు(వేదిక ఇంకా ఖారారు కాలేదు) పైనల్: అక్టోబర్ 8(వేదిక ఇంకా ఖారారు కాలేదు) చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్కు చుక్కలు చూపించేది అతడే' -
IND Vs WI T20 Series: బీసీసీఐ కీలక నిర్ణయం.. అభిమానులకు శుభవార్త
టీమిండియా అభిమానులకు శుభవార్త. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ నెల 20న జరిగే చివరిదైన మూడో టీ20 మ్యాచ్కు ఇరవై వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. వీరిలో అధిక శాతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) టికెట్ హోల్డర్స్ ఉంటారని బీసీసీఐ పేర్కొంది. బీసీసీఐ నిర్ణయం పట్ల క్యాబ్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా హర్షం వ్యక్తం చేశాడు. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ప్రస్తుత పర్యటనలో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ (తొలి టీ20).. ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో జరిగిన విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లను మహమ్మారి నుంచి రక్షించే ఉద్దేశంతోనే మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించడం లేదని బీసీసీఐ బాస్ గంగూలీ గతంలో వెల్లడించాడు. అయితే, నిన్న జరిగిన తొలి టీ20తో పాటు ఫిబ్రవరి 18న (శుక్రవారం) జరిగే రెండో టీ20 మ్యాచ్ కోసం 2000 మందికి పైగా అభిమానులు స్టేడియంలో కూర్చునేందుకు బీసీసీఐ అనుమతించడం విశేషం. ఇదిలా ఉంటే, విండీస్ తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ లో టీమిండియా ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో విజయాలు సాధించి, జోరుమీదుంది. వన్డే సిరీస్ ను 3-0తో, టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతుంది. చదవండి: IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..! -
వెస్టిండీస్తో సిరీస్.. భారత అభిమానులకు గుడ్ న్యూస్
India-West Indies T20 series: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న మాడు టీ20ల సిరీస్కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్- వెస్టిండీస్ మధ్య జరగబోయే మ్యాచ్లకు 75 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు బెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది. అన్ని ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల్లో జరిగే క్రీడలకు 75 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మ్యాచ్లకు సుమారు 50,000 మంది ప్రేక్షకుల హాజరయ్యే అవకాశం ఉంది. గత ఏడాది ఇంగ్లండ్తో సిరీస్తో తర్వాత ఈ వేదికలో తొలిసారి అభిమానుల మధ్య టీమిండియా ఆడనుంది. కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులు లేని ఖాళీ క్రికెట్ స్టేడియంలలోనే బీసీసీఐ మ్యాచ్లు నిర్వహించింది. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 16న జరగనుంది. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
సాధించాల్సింది చాలా ఉంది:రోహిత్ శర్మ
కోల్ కతా: ప్రపంచ క్రికెట్ లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గురువారం నాటి నాల్గో వన్డేలో డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డులను తిరగరాసిన రోహిత్.. తాజాగా తాను ఆడిన ఇన్నింగ్స్ తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందన్నాడు. తన కెరీర్ లో మరిన్ని లక్ష్యాలను అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. టీమిండియా ఘనవిజయం సాధించిన అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ఈ రికార్డు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడే అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడాలనుకున్నానని సృష్టం చేశాడు. ఇదిలా ఉండగా తన పునరాగమంలో జట్టు ఫిజియో వైభవ్ దాగా కృషి మరువలేనిదని రోహిత్ తెలిపాడు. ఆస్ట్రేలియన్లు మంచి క్రికెట్ ఆడతారని, ఆస్ట్రేలియి పర్యటనకు భారత్ కు పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. తాను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో టీం మేనేజ్ మెంట్ నిర్ణయిస్తుందన్నాడు. జట్టు ప్రయోజనాలకు తనకు ముఖ్యమని రోహిత్ స్పష్టం చేశాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement