-
లాక్డౌన్లతో మేలుకన్నా కీడే ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేయడం కోసం ప్రపంచంలోని పలు దేశాలు అమలు చేస్తోన్న లాక్డౌన్ల వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతోందని ఎడిన్బర్గ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఓ తాజా అధ్యయనంలో తేల్చారు. కరోనా కట్టడిలో భాగంగా యువతను బయటకు వెళ్లకుండా చేయడం కోసం విద్యా సంస్థలను, వినోద కేంద్రాలను మూసివేయడం తెల్సిందే. ఫలితంగా వైరస్ ప్రభావంతో యువతలో సహజ సిద్ధంగా పెరగాల్సిన రోగ నిరేధక శక్తిని అనవసరంగా వాయిదా వేస్తున్నామని పరిశోధన ఫలితాలకు అక్షరరూపం ఇచ్చిన ప్రొఫెసర్ గ్రేమీ ఆక్లాండ్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావాన్ని నేరుగా యువత ఎదుర్కొన్నట్లయితే వారిలో త్వరగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, వైరస్ను ఎదుర్కోవడంలోనూ సమష్టితత్వం బాగా పనిచేస్తోందని, యువత కలసి మెలసి తిరుగుతూనే వైరస్ ప్రభావానికి గురవడం వల్ల అందరిపై వైరస్ అంత ఎక్కువగా ప్రభావం చూపలేదని కూడా ఆయన చెప్పారు. పైగా తొలి రోజుల్లోనే యువతను వైరస్ను ఎదుర్కొన్నయిట్లయితే వైరస్ కూడా వాతావరణంలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. వైరస్కు యువతను దూరంగా ఉంచడం వల్ల యువతపై వైరస్ ప్రభావాన్ని వాయిదా వేస్తున్నామని, దానితోపాటు వారిలో పెరగాల్సిన రోగ నిరోధక శక్తి అభివద్ధిని కూడా వాయిదా వేస్తున్నామని చెప్పారు. చదవండి: ట్రంప్ చేతకానితనం వల్లనే ఈ భారీ నష్టం వృద్ధులు, ఇతర జబ్బులతో బాధ పడుతున్నవారికి కరోనా వైరస్ మరింత ప్రాణాంతకం కనుక అలాంటి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వారి విషయంలో లాక్డౌన్లు పని చేస్తున్నాయి తప్పా యువత విషయంలో కాదని అన్నారు. యువతను దూరంగా ఉంచడం వల్ల ప్రస్తుతం ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించగలుగుతున్నాం తప్పా మరేమి కాదని ప్రాఫెసర్ ఆక్లాండ్ చెప్పారు. వ్యాక్సిన్ వచ్చాక కొంతకాలం లాక్డౌన్ విధించి అందరికి వ్యాక్సిన్ చేస్తూ రావడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. వైరస్ మహమ్మారి అనేది ఎక్కువగా జన సమూహాలపైనే ప్రభావం చూపిస్తుందని, సమూహంగాన్నే వైరస్ను ఎదుర్కోవడం వల్ల సంఖ్యాపరంగా వైరస్ శాతం తగ్గి అది బలహీన పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. లాక్డౌన్ విధించిన దేశాలు, ప్రాంతాలు, ఎప్పుడు లాక్డౌన్లు విధించారు, ఎప్పుడు ఎత్తివేశారన్న అంశాలతో పాటు, అప్పుడు, ఇప్పుడు కరోనా బారిన పడి మరణిస్తున్న వారి డేటాను కంప్యూటర్ సిములేషన్తో విశ్లేషిస్తే మృతుల సంఖ్య ఎప్పటిలానే ఉన్నట్లు తేలిందన్నారు. అంటే లాక్డౌన్ల వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరిగిందన్న మాట. హెర్డ్ ఇమ్యూనిటీ (జన సముహాలు)కి మద్దతుగా తీసుకొచ్చిన బారింగ్టన్ డిక్లరేషన్కు తొమ్మిది వేల మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆమోదం తెలిపారు. కరోనా వైరస్ సోకిన రోగుల్లో 86 శాతం మందిలో ప్రధానమైన మూడు వ్యాధి లక్షణాలు అసలే లేవని కూడా బుధవారం నాటి సర్వేలో తేలింది. వైరస్కు వ్యతిరేకంగా పోరాడటంలో ఈ అంశం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోందని ప్రొఫెసర్ ఆక్లాండ్ వ్యాఖ్యానించారు. లాక్డౌన్ల మూలంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన విషయం తెల్సిందే. -
డిప్రెషన్ గుట్టు తెలిసింది!
లండన్: డిప్రెషన్తో సంబంధముండే దాదాపు 80 కొత్త జన్యువులను బ్రిటన్లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యువుల స్వభావం పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా మానసిక రోగాలకు కొత్త ఔషధాలను కనుగొనేందుకు వీలు కల్గుతుందని పరిశోధకులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సామర్థ్యలేమి పెరగడానికి ప్రధానకారణం మనోవేదన అని ప్రఖ్యాత ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. -
ఎడిన్బర్గ్ వర్సిటీలో హీరో ఉపన్యాసం
జీవితమే ఓ పాఠం.. దానిని తెలుసుకుంటూపోవడం ఓ అద్భుతమంటున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) బ్రిటన్లోని ప్రఖ్యాత ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. దీని గురించి షారుఖ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. 'జీవిత పాఠాల గురించి నేను ఈ రోజు ఉపన్యసించబోతున్నాను. జీవితం గురించి తెలుసుకోవడం అద్భుతం' అని పేర్కొన్నాడు. బ్లాక్ అండ్ వైట్లోని ఓ ఫొటో కూడా పోస్టు చేశాడు. షారుఖ్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన నటించిన 'దిల్వాలే దుల్హన్ లేజాయెంగే', 'కుచ్ కుచ్ హోతా హై', 'జబ్ తక్ హై జాన్' సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కాసులు కురిపించాయి. 49 ఏండ్ల షారుఖ్ ప్రస్తుతం 'దిల్వాలే', 'రాయిస్', 'ఫ్యాన్' సినిమాల్లో నటిస్తున్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement