-
బులెటిన్ బోర్డ్
ఈసీఐఎల్లో 10 పోస్టులు హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ ఉద్యోగాల నియామకానికి ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. ఈ పోస్టులను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. ఖాళీలు: టెక్నికల్ ఆఫీసర్–4, సైంటిఫిక్ అసిస్టెంట్–3, జూనియర్ ఆర్టిజన్–3. విద్యార్హత: టెక్నికల్ ఆఫీసర్కు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్). సైంటిఫిక్ అసిస్టెంట్కి పైన పేర్కొన్న సబ్జెక్టుల్లో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిప్లొమా. జూనియర్ ఆర్టిజన్కు ఐటీఐ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/కంప్యూటర్స్/ఇన్స్ట్రుమెంటేషన్) . ఎస్సీ, ఎస్టీలకు సెకండ్ క్లాస్ (50 శాతం మార్కులు) ఉన్నా సరిపోతుంది. ఠి అనుభవం: సంబంధిత రంగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 2017 జనవరి 31 నాటికి టెక్నికల్ ఆఫీసర్కు 30 ఏళ్ల లోపు; మిగిలిన రెండు పోస్టులకు 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఠి ఇంటర్వూ్య తేది: ఫిబ్రవరి 11 (శనివారం) ఇంటర్వూ్య వేదిక: ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుల్లోని ఈసీఐఎల్ జోనల్, బ్రాంచ్ ఆఫీసుల్లో జరుగుతుంది. వెబ్సైట్: www.ecil.co.in జాతీయ మేధో దివ్యాంగుల సాధికారత సంస్థలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఈపీఐడీ–జాతీయ మేధో దివ్యాంగుల సాధికారత సంస్థ).. హెడ్ క్వార్టర్స్తోపాటు రీజనల్ సెంటర్లలో గెస్ట్ ఫ్యాకల్టీ/స్టాఫ్ను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. ఈ సంస్థను గతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్(ఎన్ఐఎంహెచ్)గా పేర్కొనేవారు. ఖాళీలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిహాబిలిటేషన్ సైకాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్, సీఆర్పీఎం, మెడికల్), లెక్చరర్ (రిహాబిలిటేషన్ సైకాలజీ, స్పెషల్/రెగ్యులర్ ఎడ్యుకేషన్, సీఆర్పీఎం, మెడికల్, ఫిజియోథెరపీ), రిహాబిలిటేషన్ థెరపిస్ట్/ఫార్మసిస్ట్/అసిస్టెంట్ లైబ్రేరియన్/స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్/వొకేషనల్ ఇన్స్ట్రక్టర్/ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, డేటా బేస్/నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సెక్షన్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (యూడీసీ, ఎల్డీసీ లెవల్), హెడ్ మాస్టర్, టీచర్(జనరల్). కాంట్రాక్ట్ కాల వ్యవధి: తొలుత ఆరు నెలల వరకు. తర్వాత మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది. విద్యార్హత: పోస్టును బట్టి ఎంఫిల్/పీహెచ్డీ/ఎంఈడీ/ఎండీ/డీఎం/ఎంఎస్/ఎంఎస్సీ/ఎండీఆర్ఏ/ఎల్ఎల్ఎం/ఎల్ఎల్బీ/ఎంబీఏ/ఎంటెక్/డిగ్రీ, అనుభవం. ఇంటర్వూ్య తేదీలు: ఫిబ్రవరి 2, 3, 9, 10, 16, 17, 23, 24. ఠి ఇంటర్వూ్య వేదిక: ముంబై, ఢిల్లీ, కోల్కతా, సికింద్రాబాద్ www.nimhindia.gov.in -
ఈవీఎంల కొనుగోలుకు రూ.920 కోట్లు
కేంద్ర కేబినెట్ మంజూరు న్యూఢిల్లీ : 2019లో జరిగే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 14 లక్షల కొత్త ఈవీఎంలను కొనాలన్న ఎన్నికల కమిషన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై పలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. 2016-17లో మొదటి విడతలో 5.5 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.45 లక్షల కంట్రోల్ యూనిట్లను కొనేందుకు రూ. 920 కోట్లను మంజూరుచేసింది. ఒక్కో ఈవీఎంకు బ్యాలెట్యూనిట్, కంట్రోల్ యూనిట్ ఉంటాయి. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) తయారుచేస్తాయి. కాగా ట్రాన్స్జెండర్ల (హక్కుల పరిరక్షణ) బిల్లును ప్రవేశపెట్టేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఓడరేవులను అభివృద్ధి పరచేందుకు ‘సాగరమాల అభివృద్ధి కంపెనీ’ని కంపెనీ చట్టం కింద ఏర్పాటుచేయడానికి, గోరఖ్పూర్(యూపీ)లో రూ.1,011 కోట్లతో ఎయిమ్స్ను నిర్మించాలన్న ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. బినామీ లావాదేవీలను కట్టుదిట్టంగా నిరోధించేందుకు ఉద్దేశించిన బినామీ లావాదేవీల సవరణ బిల్లు-2015లో కొన్ని సవరణలను ఆమోదించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement