-
విచారణలో కక్కుర్తి
ఎంసెట్ లీకేజీ విచారణ పక్కదారి బ్రోకర్తో మిలాకత్ అయిన సీఐడీ డీఎస్పీ బాలుజాదవ్పై సస్పెన్షన్ వేటు కానిస్టేబుల్పై కూడా చర్య వరంగల్ : ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ కేసు విచారణలో నిందితులకు సహకరించాడన్న ఆరోపణలతో సీఐడీ డీఎస్పీ బాలుజాదవ్, కానిస్టేబుల్ సదాశివరావుపై వేటు పడింది. విచారణను పక్కదారి పట్టించేలా వ్యవహరించారనే కారణంగా డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణ జరుగుతోంది. దీని కోసం సీఐడీ విభాగం పలు బృందాలను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్కు చెందిన బ్రోకర్ గుమ్మడి వెంకటేశ్ను ఈ కేసులో నిందితుడిగా సీఐడీ గుర్తించింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించాలని వరంగల్ సీఐడీ విభాగం డీఎస్పీ బాలుజాదవ్ను ఈ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. బ్రోకర్ వెంకటేశ్ను అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చినా అరెస్టు చేయకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. బ్రోకర్ను అరెస్టు చేసేందుకు మరో బృందాన్ని రాష్ట్ర అధికారులు పంపించారు. ఈ బృందం సదరు బ్రోకర్ను అరెస్టు చేసేందుకు వెళ్లగా.. ఇప్పటికే ఒక అధికారి వచ్చాడని, ఈ కేసు నుంచి తప్పిస్తే రూ.2లక్షలకు ఇచ్చేందుకు ఒప్పుకొని అందులో సగం రూ.లక్ష ఇచ్చానని బ్రోకర్ వెంకటేశం అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. దీంతో సీఐడీ అధికారులు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. ఈ ఆరోపణలపై రాష్ట్ర సీఐడీ విభాగం విచారణ చేపట్టగా డీఎస్పీ బాలుజాదవ్ బ్రోకర్ వద్ద డబ్బులు తీసుకున్నట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సీఐగా బాలు జాదవ్ వర్ధన్నపేట, నర్సంపేట, సుబేదారి పోలీసు స్టేషన్లలో పనిచేసినప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై డీఎస్పీ బాలుజాదవ్ను వివరణ కోరగా శనివారం విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. -
ఇదేం విచారణ ?
ఫోన్లో సమాచారం తీసుకుంటే సరిపోతుందా బాధితులను కలిసిన సందర్భమే లేదు ఎంసెట్–2 లీకేజీపై బాధిత తల్లిదండ్రుల పెదవి విరుపు ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు? పరకాల : ఎంసెట్–2 పేపర్ లీకేజీపై సీఐడీ కొనసాగిస్తున్న విచారణ పట్ల బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని ఆధారాలతో బయటపెట్టినా నామమాత్రపు విచారణే చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. బాధితులను, ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సైతం కలిసిన సందర్భాలు లేవని, లీకేజీ వ్యవహారంలో పరకాల, భూపాలపల్లి ప్రాంతాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాలను సందర్శించిన దాఖాలు లేవని అంటున్నారు. మొక్కుబడి విచారణ జరిపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్–2లో తమ పిల్లలతోపాటే కోచింగ్ తీసుకొని పరీక్షకు సరిగ్గా వారం రోజుల ముందే రహస్య ప్రాంతాలకు తరలిపోవడం, తమకు తెలియని ప్రాంతంలో పరీక్షకు హాజరు కావడం, ఫలితాల్లో మార్కులతోపాటు ర్యాంకులు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసి తాము నిజాయితీతో విచారణ జరిపించామనే వాదనను వినిపించడం కోసం తాత్కాలికంగా అలా ప్రకటన చేశారని కొందరు చెబుతున్నారు. ఎక్కడో ఉండి ఫోన్లో సమాచారాన్ని సీఐడీ అధికారులు తీసుకున్నారని, పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో నుంచి ర్యాంకుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను స్వయంగా కలిసి వివరాలు సేకరించలేదని చెబుతున్నారు. ఎంసెట్–2లో లీకేజీపై లోతైన విచారణకు అధికారులు దూరంగా ఉన్నట్లు తెలుస్తుందని ఓ బాధిత విద్యార్థి తండ్రి చెబుతున్నాడు. విచారణను నిష్పాక్షపాతంగా జరిపించడం కోసం అవసరమైతే ప్రత్యక్ష్యంగా ఆందోళన చేపడుతామని చెబుతున్నారు. ఇప్పటికే ఎంసెట్–2లో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి నిరసన తెలుపాలని భావిస్తున్నారు. –ప్రైవేటులో చేద్దామని దళారుల చేతికి డబ్బు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. తమ పిల్లలను ఎలాగైన ఎంబీబీఎస్ చదివించాలనే లక్ష్యంతో కొందరు విద్యార్థుల తండ్రులు దళారులను ఆశ్రయించారని తెలుస్తోంది. డబ్బుకు కొదవ లేని ఆ కుటుంబాలు.. దళారులు అడిగినంత డబ్బు సమర్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రైవేటులో లక్షలు ఖర్చవుతాయని, అవే డబ్బులు తమకిస్తే గవర్నమెంటు సీటు లభిస్తుందని చెప్పిన దళారుల మాటలు నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంసెట్–2లో జరిగిన అక్రమాల వల్ల తమ పిల్లలకు మంచి ర్యాంకులు రాలేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో చివరకు సర్టిఫికెట్ల పరిశీలన వాయిదాపడే వరకు వెళ్లింది. కానీ ఎంసెట్–2లో ఫలితాలను తారుమారు చేసిన బాధ్యులను ఇంకా గుర్తించలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement