-
జనవరిలో కొలువుల జోరు..
ముంబై: నూతన సంవత్సరం తొలి నెలలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న గణాంకాలతో పోల్చి చూస్తే 2019 జనవరిలో ఉద్యోగ నియామకాలు 15% పెరిగాయి. ప్రధానంగా ఐటీ పరిశ్రమ ఇందుకు దోహదం చేసింది. ఈ ఒక్క రంగంలోనే నియామకాలు జనవరిలో 36 శాతం పెరిగాయి. ఈ మేరకు జనవరి నెలకు సంబంధించి నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ గణాంకాలు విడుదలయ్యాయి. జనవరిలో ఈ ఇండెక్స్ 2,251గా నమోదైంది. 2018 జనవరిలో ఇది 1,951గా ఉండటం గమనార్హం. నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ ప్రతినెలా నౌకరీ డాట్ కామ్ సైట్లో ఉద్యోగ వివరాల నమోదు ఆధారంగా విడుదలయ్యే గణాంకాలు. బెంగళూరు నగరం 27 శాతం నియామకాల వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. ముంబైలో 10 శాతం, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 8 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. మొత్తం మీద ప్రారంభ స్థాయి (0–3 ఏళ్ల అనుభవం కలిగిన వారు)లో నియామకాలు 16 శాతం పెరగ్గా, 4–7 ఏళ్ల అనుభం కలిగిన వారి నియామకాలు 18 శాతం పుంజుకున్నాయి. -
ఫీజుల ‘దడ’ఖాస్తు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ దరఖాస్తు సగటు నిరుద్యోగికి చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తుకు భారీ మొత్తంలో ఫీజు నిర్ధారించడంతో అభ్యర్థి చేతి చమురు వదులుతోంది. ఎలాంటి ఆదాయ వనరు లేని నిరుద్యోగి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషస్ జారీ చేసిన టీఆర్ఈఐఆర్బీ.. దరఖాస్తు ఫీజును రూ.1,200 నిర్ధారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు రూ.600 చొప్పున ఖరారు చేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ సగటున ఓ దరఖాస్తుకు రూ.200 ఫీజు నిర్ధారించిందని, అందుకు 6 రెట్లు పెంచడం సరికాదంటున్నారు. పీజీటీ, టీజీటీ కలిపి రూ. 2,400 సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2,932 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో టీజీటీ పోస్టులు 960, పీజీటీ పోస్టులు 1,972 ఉన్నాయి. వీటికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో రూ. 1,200 దరఖాస్తు ఫీజు చూసిన అభ్యర్థులు అవాక్కయ్యారు. పీజీటీ, టీజీటీ అర్హత ఉన్న జనరల్ అభ్యర్థి దరఖాస్తుకు రూ. 2,400 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. సర్కారు బడ్జెట్ ఇవ్వకపోవడంతో.. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం టీఆర్ఈఐఆర్బీ (తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ జాప్యమవుతుండటంతో త్వరగా భర్తీ చేసేందుకు బోర్డును ఏర్పాటు చేశారు. కానీ బోర్డు నిర్వహణకు సర్కారు నిధులివ్వకుండా.. ఉద్యోగాలకు వచ్చే దరఖాస్తు ఫీజుతోనే పరీక్షల నిర్వహణ, నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్ఈఐఆర్బీ.. దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసింది. 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు టీఆర్ఈఐఆర్బీ నిర్దేశించిన ఫీజు అభ్యర్థులను నిలువునా దోచేయడమే. ఆ ఫీజుతో 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, కోచింగ్లంటూ రూ. వేలల్లో ఖర్చు చేస్తున్న నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా వసూలు చేయడం సరికాదు. ఫీజు తగ్గించి.. టీఎస్పీఎస్సీ మాదిరిగా రూ. 200 చొప్పున తీసుకుంటే బాగుంటుంది. – పల్రెడ్డి అనూష, అభ్యర్థి -
ఉద్యాన పంటలకు.. హార్టికల్చరిస్ట్
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కార్యాలయంలో కూర్చొని చేసే డెస్క్ జాబ్ మీకిష్టం లేదా? నిత్యం ప్రకృతి ఒడిలో ఉంటూ, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పనిచేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. హార్టికల్చరిస్ట్. ప్రస్తుతం హార్టికల్చరిస్ట్లకు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని కెరీర్గా ఎంచుకుంటే ప్రకృతిని కాపాడుతూ, ప్రజల ఆహార అవసరాలను తీరుస్తూ సమాజానికి సేవ చేస్తున్నామన్న వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది. ఉద్యోగాలు, పరిశోధనలు : హార్టికల్చరిస్ట్లు ప్రధానంగా సుందరమైన ఉద్యాన వనాల పెంపకంతోపాటు పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిని చేపట్టాల్సి ఉంటుంది. క్రాప్ ప్రొడక్షన్, ప్లాంట్ బ్రీడింగ్, క్రాస్-బ్రీడింగ్, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ ఫిజియాలజీ తదితర రంగాల్లో పరిశోధనలు చేయాలి. నాణ్యమైన, అధిక పోషకాలతో కూడిన ఫలసాయమిచ్చే మొక్కలను సృష్టించాలి. ఉద్యాన పంటలన్నీ హార్టికల్చరిస్ట్ పరిధిలో ఉంటాయి. హార్టికల్చర్లో వెజిటెబుల్ సైన్స్, ఫ్రూట్ టెక్నాలజీ, ఫ్లోరికల్చర్ అనే స్పెషలైజేషన్లు ఉన్నాయి. హార్టికల్చరిస్ట్లకు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు, ఫామ్హౌస్లు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. రహదారుల పక్కన పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హైవే అథారిటీలు వీరిని నియమించుకుంటున్నాయి. ఇక సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకొని అగ్రిప్రెన్యూర్గా ఉపాధి పొందొచ్చు. పరిశోధనా రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు. ఆసక్తి ఉంటే కన్సల్టెంట్గా కూడా ప్రజలకు సేవలందించొచ్చు. కావాల్సిన స్కిల్స్: ఈ రంగంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. హార్టికల్చరిస్ట్కు ప్రకృతిపై ఇష్టం, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. కొత్త వంగడాల అభివృద్ధికి, నాణ్యమైన పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రీయ దృక్పథం అవసరం. ఈ రంగంపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. అందమైన వనాలను పెంచేందుకు సృజనాత్మకత ఉండాలి. అర్హతలు: భారత్లో అగ్రికల్చర్ సైన్స్లో వివిధ కోర్సులున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో చేరొచ్చు. పరిశోధనా రంగంలో అడుగుపెట్టాలంటే డాక్టరేట్ పూర్తిచేయాలి. హార్టికల్చరిస్ట్గా కెరీర్ను ప్రారంభించాలంటే పీజీ చేస్తే సరిపోతుంది. వేతనాలు: హార్టికల్చరిస్ట్/సూపర్వైజర్కు ప్రారంభంలో నెలకు రూ.12 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి మేనేజర్/సీనియర్ మేనేజర్కు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు లభిస్తుంది. ఇక డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.లక్షకు పైగానే అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్ వెబ్సైట్: www.angrau.ac.in డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెబ్సైట్: www.drysrhu.edu.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్: www.iht.edu.in ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-ఢిల్లీ వెబ్సైట్: www.iari.res.in ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడొచ్చు ‘‘దైనందిన కార్యకలాపాలకు అవసరమైన కోర్సులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో అగ్రికల్చర్, అనుబంధ విద్యకు గిరాకీ తగ్గదు. హార్టికల్చర్లో గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలున్నాయి. ఉద్యానవన, విత్తనాభివృద్ధి సంస్థల్లో పనిచేయవచ్చు. స్వయం ఉపాధి పొందుతూ మరికొందరికి మార్గం చూపాలంటే నర్సరీలు, సీడ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగానూ పనిచేయొచ్చు’’ - డాక్టర్ బి.ఎం.సి.రెడ్డి, వైస్ఛాన్సలర్, డాక్టర్ వై.ఎస్.ఆర్.హార్టికల్చరల్ యూనివర్సిటీ జాబ్స్ అలర్ట్స్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్. అర్హత: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సివిల్ ఇంజనీరింగ్లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: గేట్-2015 స్కోర్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గేట్-2015 రిజిస్ట్రేషన్కు చివరితేది: అక్టోబరు 1 పీజీసీఐఎల్ రిజిస్ట్రేషన్: జనవరి 15 - ఫిబ్రవరి 27, 2015 వెబ్సైట్: www.powergridindia.com ముగిసిన ‘ఐఈ-ఫెస్ట్’ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఇన్నోవేషన్ ఇంజనీరింగ్(ఐఈ) ఫెస్ట్-2014 సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖు లు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3డీ స్కానింగ్, 3డీ ప్రింటింగ్ వంటి సాంకేతిక పరికరాల రూపకల్పనను ప్రాక్టికల్గా చేసి చూపారు. క్రాంతి విస్తాకుల రూపొందించిన ‘బ్లో హాట్, బ్లో కోల్డ్’ సూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడే ఇంజనీరింగ్ పూర్తిచేసిన క్రాంతి ఉన్నత విద్యను అమెరికాలోని ప్రతిష్టాత్మక మిట్లో పూర్తి చేశార ు. అనంతరం దామా ఇన్నోవేషన్స్ సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్లో స్టార్టఅప్లకు అందుబాటులోని అవకాశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ‘ఇంజనీర్స్ డే’ను క్యాంపస్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ పరీక్షలో విటమిన్లు, హార్మోన్లపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వీటిని ఏ విధంగా చదవాలి? - ఎస్.అశోక్, బొల్లారం అన్ని రకాల పోటీ పరీక్షల్లో హర్మోన్లు, విటమిన్లపై సర్వసాధారణంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ రెండు అంశాల్లో ప్రతి దాని నుంచి రెండు లేదా మూడు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. విటమిన్లు, వాటి చారిత్రక అంశాలు, గుర్తించిన వారు, వాటి రకాలు, ఉనికి, విధులు మొదలైన విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అదే విధంగా వివిధ రకాల హార్మోన్లు, వాటిని ఉత్పత్తి చేసే గ్రంథులు, ఉత్పత్తికి అవస రమైన మూలకా లు, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు/ ప్రభావం గురించి చదవాలి. మొక్కలకు సంబంధించిన హార్మోన్లపై ముఖ్యంగా వాటి ప్రభావం వల్ల కలిగే ఫలితాల గురించి అడుగుతారు. ప్రశ్నలో కొద్ది మార్పుతో భిన్న సమాధానాలున్న ప్రశ్నలను కూడా అడగవచ్చు. విటమిన్ల రకాలు, అవి లభించే పదార్థాలు, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు మొదలైన అంశాలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ఆయా అంశాల్లో వివిధ రకాలను గుర్తుంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా కోడ్ను రాసుకోవడం ద్వారా వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో గందరగోళానికి గురయ్యేందుకు ఆస్కారం ఉండదు. సరైన సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇన్పుట్స్: టి. సుధాకర్రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ -
టైమ్ బాబూ టైము..
పదేళ్ల పాటు జిల్లాలో ఆయన దందా అంతా ఇంతా కాదు. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, ఉద్యోగ నియామకాలు చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆయన దృష్టికెళ్లాకే ఏదైనా చేయాల్సి వచ్చేది. ఏ అధికారి అయినా కాదూ కూడదంటే ఇబ్బందులు పడడమో, బదిలీపై వెళ్లిపోవడమో జరిగేది. ఎంతటి అధికారైనా ఆయన కన్నుసన్నల్లో పనిచేయాల్సిందే. ఏ పనైనా తన మాట ప్రకారమే జరగాలంటూ హుకుం జారీ చేసేవారు. కొన్ని సందర్భాల్లోనైతే ఎంతటి అధికారినైనా పరుష పదజాలంతో కసురుకునే వారు. ప్రతిదానికీ అధికారులు ఇంటికొచ్చి సలామ్ కొట్టే విధంగా పరిస్థితులు కల్పించారు. ఈ పరిస్థితుల్లో మనసు చంపుకొని కొంతమంది పనిచేయగా, ఇంకొంతమంది ఆయన ప్రాపకం కోసం పనిచేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే అధికారులు మాకు టైమ్ వచ్చిందంటూ ఆయనకు ముఖం చాటేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇన్నాళ్లూ జిల్లాలో చక్రం తిప్పిన రాజ్యాంగేతర శక్తి, మంత్రి బంధువు, షాడో నేతకు తిరోగమనం ప్రారంభమైందా? మంత్రి మేనల్లుడి గా చక్రం తిప్పిన ఆయన జోరుకు బ్రేక్ పడిండా? సూపర్ పవర్తో జిల్లా రాజకీయాలను,అధికారులను శాసించిన ఆయనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలా అంటే జిల్లాలోని ఏ ఒక్క అధికారీ ఇప్పుడు ఆయన చెప్పింది వినడం తప్ప కార్యాచరణలో పెట్టడం లేదు. ఆయనకు ఇప్పుడంత ‘సీన్’ లేదని తేలికగా తీసి పారేస్తున్నారు. మమ్మల్ని ఏమీ చేయలేరని, ఎన్నికల ఎఫెక్ట్తో ఐదారు నెలలు పాటు బయటికెళ్లిపోతు న్నామని, మళ్లీ వచ్చేలోగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదనే ధీమాకు వచ్చేశారు. ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుందన్నట్టుగా ఇప్పుడు జిల్లాలోని అధికారులకు అనుకూల పరిస్థితులొచ్చాయి. కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా తయారవడం, మంత్రి కి వ్యక్తిగతంగా తగ్గిన ప్రాబల్యంతో మళ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరికొన్ని రోజుల పాటు షాడో నేత అధికారం చెలాయించినా తమను ఏమీ చేయలేరని, సాధారణ ఎన్నికల ఎఫెక్ట్తో తామే బదిలీపై వెళ్లిపోతామని, ఐదారు నెలలు పక్క జిల్లాల్లో ఉండి, మళ్లీ జిల్లాకు వచ్చేలోగా ఈ ప్రభుత్వం ఉండదన్న ధీమాకు ఎంపీడీఓలు, తహశీల్దార్లు వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిందల్లా విని గాలికొదిలేస్తున్నారు. మునుపటిలా రిస్క్ కాదు కదా తేలిక పాటి పనులు చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. జిల్లా అధికారులు కూడా ముఖం చాటేస్తున్నారు.పదవిలో ఉన్న వారు చెప్పేవే కాస్తోకూస్తో చేస్తున్నారు. షాడో నేతకైతే చేయబోమన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. ఒకరకంగా ఆయనను పట్టించుకోవడమే మానేశారు. ఇన్నాళ్లూ సూప ర్ పవర్ చెలాయించిన ఆ నేతకు ప్రస్తుత పరిస్థితి మింగు డు పడడం లేదు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. చివరకు ఇన్నాళ్లూ పట్టించుకోని ఎమ్మెల్యేలపై ఆధారపడుతున్నారు. వారి ద్వారా పనులు చేయించుకునే పరిస్థితికి దిగజారారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement