-
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
దేవాదాయశాఖ స్థలంలో పేదల ఇళ్లు కోర్టు ఆదేశాలతో తొలగించే యత్నం అడ్డుకున్న స్థానికులు.. ఆత్మహత్యాయత్నం.. ఏప్రిల్ వరకు గడువిప్పించిన ఎమ్మెల్యే గోరంట్ల ఆవలోని వాంబే గృహాల్లో ఇళ్లు ఇస్తామని హామీ సాక్షి, రాజమహేంద్రవరం : దేవాదాయశాఖ స్థలంలో నిర్మించుకున్న ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు వైపు 37వ డివిజన్ పరిధిలోని వీరభద్రపురంలో టౌన్ సర్వే నంబర్ 919లో దువ్వూరి వెంకాయమ్మ సత్రం భూమి 526 చదరపు గజాలు ఉంది. ఈ భూమి పందిరి మహదేవుడు సత్రం ఆధీనంలో ఉంది. ఆ భూములను ఆక్రమించుకున్న 19 మంది 50 ఏళ్లుగా పెంకుటిళ్లు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ భూములు ఖాళీ చేయించేందుకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్లో పందరి మహదేవుడు సత్రం అధికారులు కేసు వేశారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఆ భూమిని ఖాళీ చేయాలని ఆక్రమణల తొలగింపు అధికారి ఇన్చార్జ్ డీసీ డీఎల్వీ రమేష్బాబు వారికి మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. ప్రతిసారీ రాజకీయ పార్టీల నేతలు జోక్యం చేసుకుంటుండడంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సోమవారం వారిని ఖాళీ చేయించేందుకు ఇన్చార్జ్ డీసీ రమేష్బాబు, పందిరి మహదేవుడు సత్రం ఈవో సుబ్రమణ్యం నేతృత్వంలో 50 మంది దేవాదాయ శాఖ సిబ్బంది వచ్చారు. మూడో పట్టణ పోలీస్స్టేషన్ నుంచి సీఐ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లు వచ్చారు. తాము ఇళ్లు ఖాళీ చేయబోమని అక్కడి వారు భీష్మించారురు. బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నించడంతో స్థానికుల్లో ఒకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయారు. అతడి ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సౌకర్యం తొలగించారు. మహిళలు ఇంట్లో వస్తువులు ఓ వైపు తీసుకొస్తుండగానే దేవాదాయ శాఖ అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. స్థానిక కార్పొరేటర్ పెనుగొండ విజయభారతి, ఇతర కార్పొరేటర్లు తంగెళ్ల బాబి, పాలవలస వీరభద్రం, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని బాధితులకు అండగా నిలిచారు. అయినా సిబ్బంది ఆక్రమణల తొలగింపు చేపట్టడంతో సమాచారం అందుకున్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఇతర అనుచరులతో ఘటనా స్థలానికి వచ్చారు. ఆదివారం ఈ విషయం ఈవో సుబ్రమణ్యంతో చర్చించినా తన మాట ఖాతరు చేయకుండా తొలగింపు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరికీ ఆవ రోడ్డులోని వాంబే గృహాలు కేటాయించనున్నామని, ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రకియ నిలిచిపోయిందన్నారు. మార్చి 25 తర్వాత వీరికి ఇళ్లు కేటాయించిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో ఆక్రమణలు తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు కూడా ఆగకుండా పేదలపై దేవాదాయ శాఖ సిబ్బంది ప్రతాపం చూపడం భావ్యం కాదన్నారు. ఎమెల్యే విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ వరకు గడువు ఇచ్చిన దేవాదాయ శాఖ ఇన్చార్జ్ డీసీ రమేష్బాబు సిబ్బందితో తిరిగి వెళ్లిపోయారు. ఏప్రిల్ మొదటి వారం వరకు గడువిచ్చామని, ఆ తర్వాత ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని రమేష్బాబు స్పష్టం చేశారు. -
ఆక్రమణకు తెగబడ్డ ‘తమ్ముళ్లు’
తూరంగి (కాకినాడ రూరల్) :దేవాదాయ భూముల ఆక్రమణకు తెలుగుతమ్ముళ్లు తెగబడ్డారు. ప్రజాప్రతినిధుల అండ చూసుకుని దేవాదాయ భూములను ఆక్రమించి లీజుకు బేరం పెట్టేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ మండలం తూరంగిలో తురంగేశ్వరస్వామి ఆలయానికి పగడాలపేట సమీపంలో సర్వేనంబరు 207/3లో 27.15 ఎకరాల భూమి ఉంది. ఇందులో పది ఎకరాల భూమిని ఏడాదికి రూ.60 వేలు ఇచ్చేందుకు చిర్ల సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తికి దేవాదాయ శాఖాధికారులు కౌలుకు ఇచ్చారు. ఈ భూములకు అనుకుని ఉన్న మరో ఐదెకరాల భూమిని మరో వ్యక్తి ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసుకున్నాడు. ఇది తెలిసినా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. ఇదే అలుసుగా తీసుకున్న గ్రామస్తులు మరో మూడెకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం ఆక్రమించి, పట్టాలివ్వాలని గత నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా భావించిన అధికార పార్టీకి చెందిన కొందరు ఖాళీగా ఉన్న ఆలయ భూములపై కన్నేశారు. దీంతో పగడాలపేటను ఆనుకుని ఉన్న ఐదెకరాల భూమిని ఆక్రమించి, ఓ వ్యక్తికి రొయ్యల చెరువులు తవ్వుకునేందుకు లక్ష రూపాయలకు లీజుకు ఇచ్చేశారు. దీనిలో గ్రామ పెద్దలకు రూ.30 వేలు ఇచ్చేందుకు, మిగిలిన రూ.70 వేలు స్థలాక్రమణలో భాగస్వామ్యం ఉన్న 20 మంది పెద్దలు పంచుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తురంగేశ్వరస్వామి ఆలయ భూమి ఐదెకరాలను లీజుకు ఇచ్చేశారు. లీజుకు తీసుకున్న వ్యక్తులు భూమిని రొయ్యల చెరువులుగా మార్చేందుకు ప్రయత్నించడంతో ఆదివారం తురంగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి గుత్తుల త్రిమూర్తులు.. ఉత్సవ కమిటీ సభ్యులతో వెళ్లి అడ్డుకున్నారు. దీంతో దేవాదాయ భూమిని ఆక్ర మణదారులుగా ఉన్న గరికిన వేమన, గరికిన అప్పన్న, ఇజ్రాయిల్, చోడిపల్లి కొత్తబాల, మోసా భయ్యన్నతో పాటు 20 మంది వ్యక్తులు అక్కడికి చేరుకుని అధికారులపై తిరగబడ్డారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఈఓ త్రిమూర్తులు ఆక్ర మణదారులపై ఇంద్రపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎ.మురళీకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దేవాదాయ భూమిలో చెరువు తవ్వకానికి ఉపయోగిస్తున్న పొక్లెయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ భూమిని ఆక్రమించి లీజుకు ఇచ్చినట్లు ఈఓ త్రిమూర్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వేమన, అప్పన్న, ఇజ్రాయిల్, కొత్తబాల, భయ్యన్నను పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లారు. తాము దేవాదాయ భూమిని వదిలేస్తామని, ఆ భూమిలోకి రామని ఆక్రమణదారులు రాతపూర్వకంగా ఇచ్చారని ఈఓ చెప్పారు. ఆక్రమణను అడ్డుకున్న వారిలో ఉత్సవ కమిటీ సభ్యులు డి.భానుమతిభగవాన్, నున్న దుర్గాప్రసాద్, మేడిశెట్టి శేషగిరి, కర్రి గణపతిరెడ్డి, తాతారావు తదితరులు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement