-
Andhra Pradesh: ఇంధన పొదుపులో ఏపీ సూపర్
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలిచిందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ వినీత కన్వాల్ ప్రశంసించారు. ‘ఇంధన సామర్థ్యం ద్వారా లాభదాయకత’పై బీఈఈ, రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), పారి శ్రామిక నిపుణులతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సు నిర్వహించింది. ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఆ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని సులభతరం చేసేందుకు పైలట్ ప్రోగ్రామ్గా వంద ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రా జెక్టుల గ్రేడింగ్ను ప్రారంభించినట్లు బీఈఈ డైరెక్టర్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్య క్రమాల అమల్లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ ఉందన్నారు. ఐవోటీతో పొదుపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు చేయడాన్ని బీఈఈ డైరెక్టర్ అభినందించారు. ఇది దేశంలోనే తొలిసారన్నారు. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించా లని సూచించారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల్లో ఇంధన పొదుపు కోసం ఐవోటీ ఆధారిత ప్రాజెక్టు లను ప్రవేశపెట్టడంలాంటి చర్యలను ఈ ప్రస్తా వించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను అమలు చేసే పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్ర విద్యుత్తుశాఖను అభ్యర్థించిన తొలి రాష్ట్రం ఏపీ అని గుర్తుచేశారు. ఒక్క పీఏటీ (పెర్ఫా ర్మెన్స్ అఛీవ్మెంట్ ట్రేడ్) పథకం ద్వారానే రాష్ట్రం లో 5,500 మిలియన్ యూనిట్ల (0.21 ఎంటీవోఈ) విద్యుత్తును ఆదాచేసినట్లు ఏపీఎస్ఈసీఎం అధికా రులు తెలిపారు. పీఏటీ రెండోదశలో 0.295 ఎంటీ వోఈ మేర ఇంధనాన్ని ఆదాచేసినట్లు వెల్లడించా రు. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ బి.రమేశ్ప్రసాద్, సీఐఐ ఏపీ కౌన్సిల్ చైర్మన్ డి.తిరుపతిరాజు, వైస్ చైర్మన్ నీరజ్ సర్దా, టాటా మోటార్స్ ప్రతినిధి విజయ్కుమార్ శింపి తదితరులు పాల్గొన్నారు. -
కంపెనీలకు ఇంధన పొదుపు అవార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధన పొదుపుపై ప్రధానంగా దృష్టిసారిస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోత్సాహక విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ.చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. గతేడాదితో పోలిస్తే కనీసం ఒక శాతం ఇంధన పొదుపు చేసిన పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు, అవార్డులను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫిక్కి ‘ టెక్నికల్ మీట్ ఆన్ ఇండస్ట్రియల్ వేస్ట్ హీట్ రికవరీ’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో చంద్ర శేఖర రెడ్డి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పరిశ్రమలు ఇంధన పొదుపును అమలు చేసే విధంగా గ్రీన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కోడ్ను ప్రవేశపెట్టన్నుట్లు తెలిపారు. నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి చోటు లభించడంపై పారిశ్రామిక రంగం సంతోషం వ్యక్తం చేసిందన్నారు. కనీసం 25 నుంచి 30 శాతం ఇంధన పొదుపు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు సూత్రాల కార్యక్రమాన్ని చేపడుతోందని, దీనివల్ల రాష్ట్ర ప్రజలతో పాటు ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని చంద్ర శేఖర్ తెలిపారు. సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చ డం, ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న వ్యవసాయ పంపుసెట్ల బదులుగా ఇంధనం ఆదా చేసేవి..సౌర పంపు సెట్లను అమర్చడం ఈ ఐదు సూత్రాల్లో ఉన్నాయి. వీధి దీపాల కోసం ఎల్ఈడీలను వాడటం, పరిశ్రమల్లో గ్రీన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కోడ్ను అమల్లోకి తేవడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలపై అవగాహన పెంచేందుకు సమర్ధమంతమైన వ్యూహాలను అమలు చేసే అంశాన్ని కూడా ఈ సూత్రాల్లో పొందుపర్చినట్లు చంద్రశేఖర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం, డిస్కమ్ల సహాయంతో ఈ అయిదు సూత్రాల పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని చంద్రశేఖర్ చెప్పారు. విద్యుత్ ఆదా చేసే వీధి దీపాల ఏర్పాటు ప్రాజెక్టును ముందు గా హిందూపురం, విజయనగరం, విశాఖపట్నం మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ థర్మల్ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులు వారి పరిజ్ఞానాన్ని, అనుభవాల్ని సదస్సులో పంచుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement