-
పొలిటికల్ కామెంట్: తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియంలో చదవాలా..?
-
9 నుంచి ‘మన బస్తీ.. మన బడి’ పనులు
సాక్షి,హైదరాబాద్: జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 9 నుంచి ‘మన బస్తీ – మన బడి’ పనులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం ఆయన మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి జిల్లాలో ‘మన బస్తీ – మన బడి ’పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం తో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘మన ఊరు –మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకోసం 11 మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి రూ.7,289.54 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేశారన్నారు. వీటికి ఎస్టిమేషన్లను కూడా సిద్ధం చేసినందున ఈ నెల 9 వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.. ప్రధానంగా ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్, పాఠశాల భవనాలకు రంగులు వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం తదితర మౌలిక సౌకర్యాలు కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనేలా వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టించి అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2022) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ‘మన బస్తీ – మన బడి’ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత డిప్యూటీ డీఈవోల పై ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించడంపై శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల వారిగా సిబ్బంది, ఉపాద్యాయుల ఖాళీలకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. అధికారులు అందజేసే నివేదికను మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్ క్రాస్ సొసైటీ స్కూల్లో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సమావేశం దృష్టికి తీసుకు రాగా, త్వరలో స్కూల్ ను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామాగ్రిని ప్రభుత్వం అందజేస్తామన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. (చదవండి: అర్జున్రెడ్డి, తరుణ్రెడ్డి.. వీళ్లిద్దరూ మామూళ్లోలు కాదండోయ్!) -
ఆత్మవిశ్వాసం కోసమే ఆంగ్లమాధ్యమ చదువులు
కన్యాశుల్కం నాటకంలో గురువు గిరీశం, శిష్యుడు వెంకటేశం పాత్రలు మన కింకా జ్ఞాపకం వుండే ఉంటాయి. శిష్యుడు వెంకటేశం తన తల్లిదండ్రులు అగ్నిహోత్రావధానులు, వెంకమ్మల ముందర ఇంగ్లిష్ పరిజ్ఞానం ప్రదర్శిం చటం కోసం గురుశిష్యులు ఇద్దరూ ‘ట్వింకిల్ టింక్విల్ లిటిల్ స్టార్‘ అని ఏదో ఇంగ్లిష్లో మాట్లాడుతున్నట్లుగా నాటకం ఆడటం... దాన్ని తల్లీ తండ్రీ అబ్బురంగా చూడటం ఇప్పటికీ ఈనాటి పెద్దల్లో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వందేళ్ల క్రితమే ఇంగ్లిష్ (దొరల) భాషకు ఎంత క్రేజ్ ఉందో చెప్పటానికే ఈ ప్రస్తావన తప్ప, తెలుగు భాషను తక్కువ చేసి చూడటానికి మాత్రం కాదు. మాతృ భాషల ఎదుగుదలకు ఇంగ్లిషు అవరోధంగా మారిందన్నా, మాతృ భాషలు సంకరంగా మారుతున్నాయన్నా, శతాబ్ది పైగా ఎన్ని భాషా ఉద్యమాలు జరిగినా కూడా... ఇంగ్లిష్ భాషా ప్రాబల్యం దినదిన ప్రవర్ధమానంగా తన ప్రభావం పెంచుకుం టూనే ఉంది. గ్లోబలైజేషన్ ప్రభావం ఆంగ్ల భాషా ప్రభావాన్ని పెంచిందే తప్ప తగ్గించలేదు సరిగదా... విదేశాల్లో ఉద్యోగాల అవకాశాల కోసం మన యువత లక్షలాదిగా ఎగబాకటం మన కళ్ళ ముందున్న సజీవ చిత్రాలే! కానీ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బడుగు బలహీన వర్గాల వారికి ఈ కాన్వెంట్ చదువులు నేటికీ అందని ద్రాక్ష పండ్లే. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న కాన్వెంట్స్ సైతం ఇంగ్లిష్ విద్యా బోధనకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. గత ప్రభుత్వం హేతుబద్ధంగా క్షేత్ర స్థాయిలో విద్యార్థుల భవిష్యత్కు భరోసా దిశగా విద్యా విధానాలు అమలుచేయకపోవడం వాస్తవం. కానీ ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియంతోపాటు తప్పని సరిగా ఒక తెలుగు సబ్జెక్టు అమలుపై కొందరు అనవసర రాద్దాంతం చేయటం విడ్డూరమే! ఇది బడుగు బలహీన వర్గాలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల చదువులకు దూరంచేయటం కాదా? ‘చదువుకోలేము! చదువు కొనలేమని’ దిగులుపడే తల్లిదండ్రులకు, విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లిష్ మీడియం బడుల నిర్వహణా నిర్ణయం నిజంగా ఒక గొప్ప సంస్కరణే అని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. దీంట్లో మాతృభాషకు అన్యాయం అనే మాటే లేదు, ఉన్నత చదువులు చదవాలనే విద్యార్థుల ఆలోచనలకు విఘాతమే లేదు, పైగా, చదవలేము, చదువు కొనలేమనే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనస్సులను ఆత్మన్యూనత నుండి ఆత్మవిశ్వాసంతో ఇది బలపరుస్తుంది. అందుకే నేటి ఏపీలో మాతృభాషకు విఘాతం కలుగనివ్వని ఇంగ్లిష్ మీడియం చదువుల బడులు ‘అందని మామిడి పండు’ కాదు ఈ నాటి ఈ చదువుల తల్లి, అందరికీ అందే మామిడి పండే’ అనేది ప్రతి ఒక్కరూ ఆహ్వానించే పరిణామమే! ఇది కచ్చితంగా ఆర్థికంగా వెనుకబడిన వారి పాలిట కల్పతరువే! విద్యా, వైద్యం, న్యాయం ప్రభుత్వాల అధీనంలో ఉంటేనే కదా ప్రజా క్షేమం పది కాలాల పాటు పరిఢవిల్లుతుందని పెద్దల మాట! అందులో మొదటిదైన చదువుకు సంబంధించి, ఏపీలో దాదాపు 45,000 పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 15,000కు పైగా పాఠశాలలు వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త సొబగులు దిద్దుకొని విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపటానికి స్వర్ణ వాద్యాలు సంరావిస్తూ సిద్ధమయ్యాయి. అలాగే రెండవ విడతలో మరో 15,000 ప్రభుత్వ పాఠశాలలు సిద్ధం కానున్నాయి. ఎటువంటి రాజకీయ సంకుచిత విమర్శలూ, హేళనలూ, ఎత్తిపొడుపు మాటలూ. అపసవ్య వార్తలు తమ పిల్లల అభివృద్ధిని కాంక్షించే తల్లిదండ్రుల మీద కనీసం ప్రభావం చూపలేదు సరి కదా.. ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తున్న అభివృద్ధి బాటవైపే తమ పిల్లలను మళ్లిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది! ఒక నూతన శకానికి ద్వారాలు తెరిచి, లక్షలాది విద్యార్థుల భవితవ్యానికి అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యాసంవత్సరంలో సీట్లు అయిపోయాయనే బోర్డులు కూడా కనిపిస్తున్నాయనే వార్తలు ఈ సందర్భంగా కొసమెరుపు! -అమరనాధ్ జాగర్లపూడి వ్యాసకర్త కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఫ్రీలాన్స్ రైటర్ మొబైల్ : 98495 45257 -
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ : ఏపీలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జీ.ఓ 84పై హైకోర్టు ఇచ్చిన స్టేను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకోవటం సర్వేలో వెల్లడైందని, ఇంగ్లీష్ మీడియంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ( తల్లిదండ్రుల ఓటు ఇంగ్లిష్ మీడియానికే ) త్వరలో పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్టేను తొలగించాలని విన్నవించారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం వాదనలను ఆలకించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. -
ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను యథాతథంగా కొనసాగిస్తూ ప్రతి మీడియం స్కూల్లోనూ తెలుగును తప్పనిసరి చేయాలని ఆదేశాలిచ్చింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement