-
Enumamula: ఎనుమాముల ఎండు మిర్చి సెన్సేషన్
సాక్షి, వరంగల్ జిల్లా : మార్కెట్లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ నడుస్తోంది. దిగుమతి తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతోంది. తాజాగా క్వింటాల్ మిర్చి ధర రూ.80 వేలకు పలికి రికార్డు నెలకొల్పింది. ఎర్రబంగారం ఎండు మిర్చి రికార్డు స్థాయి రేటు రాబట్టింది. తాజాగా ఆసియా ఫేమస్ అయిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చి అధిక రేటు పలికింది. క్వింటాల్కు ఏకంగా రూ. 80,100 ధర పలికింది. గంటన్నరలోనే 3వేల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా మార్కెట్ చరిత్రలోనే కాదు.. రికార్డ్ ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక గత సెప్టెంబర్లోనే ఎండు మిర్చి క్వింటాల్ రూ. 90వేల రేటు పలకడం గమనార్హం. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఇక్కడ పత్తి తర్వాత భారీగా వచ్చే పంట మిర్చి. దేశీ కొత్త మిర్చి రకానికి ఫుల్ గిరాకీ ఉంటోంది. -
రైతు మృతి.. మార్కెట్ యార్డులో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: వరంగల్లోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో విషాదం చోటు చేసుకుంది. పత్తిని అమ్మేందుకు మార్కెట్కు వచ్చిన రైతును లారీ ఢీకొట్టింది. దీంతో రైతు మృతిచెందాడు. పాలకుర్తికి చెందిన బానోతు రవి అనే రైతు పత్తిని విక్రయించేందుకు నిన్న సాయంత్రం మార్కెట్కు వచ్చాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న రైతు కాళ్లపై నుంచి మిర్చి లారీ దూసుకెళ్లింది. తోటి రైతులు అతడిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతి చెందడంతో మార్కెట్, ఎంజీఎం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్ట్
వరంగల్ అర్బన్: జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ యార్డును సందర్శించడానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ యార్డులో రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వచ్చిన లక్ష్మణ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని నిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఏనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
-
ఏనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ యార్డులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్కెట్ యార్డును సందర్శించి, పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మార్కెట్ లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించామంటూ గండ్ర వెంకటరమారెడ్డి సహా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వారిని మిల్స్ కాలనీ స్టేషన్కు తరలించారు. వారం రోజుల తర్వాత మార్కెట్ ప్రారంభం కావడంతో మంగళవారం ఎనమముల మార్కెట్ కు 80 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో తేజ్ రకానికి రూ. రెండు వేల ధర కూడా రాకపోవడం రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఓ వైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డ్ ఉంటేనే లోనికి రానిస్తున్నారు. ఫలితంగా మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే దళారులు మాత్రం మార్కెట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్చిని తగలబెట్టేందుకు రైతుల యత్నం ఏనుమాముల మార్కెట్ లో గిట్టు బాటు ధర లేదంటూ రైతులందరూ ఏకమై ఆందోళలకు దిగారు. మార్కెట్ యార్డ్లో అమ్మడానికి తీసుకువచ్చిన మిర్చిని కొంత మంది తగలబెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నరు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ రైతులు బిగ్గరగా నినాదాలు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement