-
భూగర్భ గనులను కాపాడాలి
మంచిర్యాల: భూగర్భ గనులను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూటెక్ గనికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్లోని సీఈఆర్ క్లబ్లో పునః ధ్రువీకరణ కింద ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జి.లక్ష్మణ్ హాజరయ్యారు. సభకు హాజరైన వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చాలామంది వక్తలో సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణిలో భూగర్భ గనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితకాలం దగ్గరపడ్డ గనుల్లోని నిక్షేపాలను అన్వేషించి వెలికితీత ద్వారా జీవిత కాలం పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనులతోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సింగరేణి గనుల వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని, ఇందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, శ్రీరాంపూర్ డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, కానీ సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు తరలించారని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆర్కే 6 గని పరిసరాల్లో సింగరేణి ప్రత్యేక శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నుంచి కే.సురేందర్రెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎస్కే బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఐఎన్టీయూసీ నుంచి జే శంకర్రావు, బీఎంఎస్ నాయకులు పేరం రమేశ్, హెచ్ఎమ్మెస్ నేత తిప్పారపు సారయ్య, సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్విరాన్మెంట్ జీఎం జేవీఎల్ గణపతి, ఏరియా ఎస్ఓటు జీఎం రఘుకుమార్, ఓసీపీ పీఓలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, ఏజెంట్లు రాముడు, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, ఏరియా ఎన్విరాన్మెంట్ హనుమాన్గౌడ్ పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిష్కరిస్తాం.. సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలను పరిశీలించి కంపెనీ పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏరియా పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తాం. సింగరేణి అభివృద్ధి చెందితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిసర గ్రామాల్లో చేసుకొనే వీలుంది. –బీ.సంజీవరెడ్డి, జీఎం, శ్రీరాంపూర్ ప్రభుత్వానికి నివేదిస్తాం ఈ సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రికార్డు చేయించడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సింగరేణితోనే ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సంస్థను కాపాడుకోవాలి. – సబావత్ మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్ -
యూరప్ తగలబడి పొతుందెందుకని? హరిత గృహ ప్రభావమా! భూతాపమా!
యూరప్ తగలబడి పొతుందెందుకని ? హైదరాబాద్ ఉష్ణ మండల ప్రాంతం లో ఉంది. భూమధ్య రేఖ కు రెండు వేల కిలోమీటర్ ల దూరం . అదే యూరప్ దేశాలు సమ శీతోష్ణ మండలం లో ఉన్నాయి. ఉదాహరణకు పోర్చుగల్ భూమధ్య రేఖ నుంచి 4500 కిలోమీటర్ ల దూరం లో ఉంది . హైదరాబాద్ లో వేసవి లో 42 ,43 డిగ్రీ ల ఉష్ణోగ్రత రికార్డు అవుతుంటుంది . మరి మనం శీతల దేశాలుగా పిలుచుకునే యూరప్ లో వేసవిలో ఎంత ఉష్ణోగ్రత ఉండాలి ? 30?.. పోనీ ఎక్కువంటే 35 కదా ? మొన్న పోర్చుగల్ లో పిహవో అనే చోట రికార్డు అయిన ఉష్ణోగ్రత ఎంతో తెలుసా ? 47 డిగ్రీ లు .! రామగుండం, రెంటచింతల లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉష్ణోగ్రత అరుదుగానే రికార్డు అవుతుంది . ఏదో ఎడారి లో ఉన్నట్టు మంచు దేశాలయిన యురోపియన్ దేశాల్లో ఆ ఉష్ణోగ్రతలు ఏంటి ? రైలు పట్టాలు దెబ్బతింటున్నాయి . రవాణా వ్యవస్థ దెబ్బ తింది. మంటలు! మంటలు! .. అడవులే కాదు. ఊళ్లే తగలబడి పోతున్నాయి . లండన్, కెంట్ , కన్వేల్ల్, తూర్పు లండన్ గ్రామాలు.. ఎక్కడ చూసినా తగలబడి పోతున్న దృశ్యాలు . స్కూళ్లకు సెలవులిచ్చేశారు . అత్యయిక పరిస్థితి విధించారు . ఎండకు, వేడి కి జనాలు చచ్చి పోతున్నారు . ఒక్క స్పెయిన్ పోర్చుగల్ దేశాల్లోనే ఇప్పటిదాకా వెయ్యి మంది మరణించారు . ఎందుకిలా ? హరిత మందిర ప్రభావం .. భూతాపం . ఇదేనా ? ఆలా అనే ఇప్పటికీ అనుకొంటున్నా . ఇదే కారణమైతే తూతూమంత్రపు చర్యలు కాకుండా ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు చేపట్టాలి . హరితమందిర ప్రభావం వల్ల అనేక రకాల అనర్ధాలు జరుగుతాయి . వర్షాలు పడవు . అంటే కరువు . పడితే ఒక రోజులో అతి భారీ కుంభ వృష్టి . అంటే ఒక పక్క వరదలు, మరో పక్క క్షామం . ఏ విధంగా చూసినా బారీనష్టాలు . కొండచరియలు విరిగిపడడం , క్లౌడ్ బరస్ట్ , టైపూన్ , హరికేన్ , ఫ్లాష్ ఫ్లడ్స్ ఇలా అనేక విపత్తులు . మరి గేట్ల తాత మాటేంటి ? రెండేళ్ల నాటి మాట . ‘ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లయ్యింది . దీని వల్ల అనేక అనర్ధాలు . రాబొయ్యేది నాలుగో పారిశ్రామిక యుగం . రోబో లు రాజ్యమేలుతాయి . పారిశ్రామిక వ్యవస్థ సంగతి వేరు . పరిశ్రమల్లో పని చేయడానికి ఎక్కువ మంది కావాలి . కానీ కృత్రిమ మేధ యుగం లో ఇప్పుడున్న దానిలో మూడో వంతు చాలు .. ఇదీ గేట్ల తాత బృందం ఆలోచన . కాబట్టి జనాభా ను ఎలాగైనా లేపేయాలి ‘.. ఇదండీ .. రెండేళ్ల క్రితం నేను విన్నది . మెయిన్ మీడియా లో రాదు . ఇలాంటివి ఒక వర్గం లో బాగా సర్క్యూలేట్ అవుతున్నాయి వామ్మో .. ఇదేంటబ్బా .... మరీ స్కెజో పేర్నియా వ్యాధి గ్రస్తుల్లా, మతి భ్రమణం చెంది ఏదేదో ఊహించుకొని చెప్పేస్తున్నారు అనుకొన్నా. వాక్ సీన్ లు వేసుకోండి అని చెప్పా . తీరుబడి గా చూస్తే వాక్ సీన్ ల వల్ల జరిగిన నష్టం, అంతా ఇంతా కాదు . లక్షల మంది ఆరోగ్యం నాశనం అవుతుంటే వ్యవస్థలన్నీ దొంగ నాటకాలాడడం చూసి చూసి .. అసలు నేను కలకంటున్నానా ? అని ఇప్పటికీ నమ్మలేక నమ్మలేక బతుకుతున్నా. గత కొన్ని రోజులుగా కొంతమంది మిత్రులు కొన్ని లింక్స్ పంపుతున్నారు . పుంఖానుపుంఖాలుగా లింక్స్ . డాకుమెంట్స్ . వీటి సారంశం ఏమిటంటే తాత బృందం కేవలం వాక్సిన్ లను నమ్ముకొంటే లాభం లేదని ఇప్పుడు పర్యావరణం రూట్ పట్టింది .. కేం ట్రైల్స్ .. సూర్యుడ్ని కప్పేయడం .. ఇంకా చాలా చాలా ఉంది లెండి . ‘సర్.. మీరు చెబితే నలుగురికీ తెలుస్తుంది . చెప్పండి . తాత కొత్త ప్లాన్.. అందరికీ తెలియాలి‘ అని మెసెంజర్ ద్వారా కొంత మంది మిత్రులు అడుగుతున్నారు . ‘అయ్యా !.. వాక్సీన్ల విషయం లో నాకు అయ్యింది చాలు . కుక్కపని చేసి తన్నులు తిన్న గాడిద బతుకయ్యింది . కరోనా యుగం ముగిసింది . వాక్సీన్ అయితే... వద్దు అంటే కనీసం నలుగురు వింటారు . తాత నిజంగానే పర్యావరణ విపత్తు సృష్టిస్తే నేను జనాల్ని ఎడ్యుకేట్ చేసినా సముద్రం లో నీటి బొట్టు .. జనాలు తెలుసుకున్నా చేసేది ఏముంటుంది ? ఎక్కడో కూర్చొని ఆయనో పొర లో ఏదో మార్పులు చేస్తే ఇక్కడ మనం చేసేది ఏముంటుంది ? అయినా ఇలాంటి వాటి పట్ల పెద్ద పెద్ద నాయకులు వ్యవస్థలు స్పందించాలి . నేను ఈ బురద లో కాలు పెట్టను‘ అని చెబుతూ వస్తున్నా. మొన్న ఒక పోస్ట్ పెట్టా. యూరప్ లో ఇదిగో ఇలాంటి విపత్తులు వస్తున్నాయి .. దీని వెనుక కారణం హరితమందిర ప్రభావమేనా లేక ఇంకేదైనా ఉందా ? అని. కనీసం జనాల్లో చర్చ మొదలైతే ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుస్తుంది అని నా ఆశ . జనాలకు ఓపిక తక్కువ . కేవలం ఒక లైన్ చదివి నిర్ణయానికి వచ్చే రకం . ఆరోగ్య కరమైన చర్చలకు అవకాశం లేదు . నిందలు.. ఆరోపణలు .. తిట్లు .. ఆవేశాలు .. .. బూతులు .. ఇవీ సోషల్ మీడియా లో రాజకీయ చర్చలు . రాజకీయాలే సర్వం అనుకొనే స్థాయి వారిది . నేను చెప్పింది వేరు . అసలు పర్యావరణ కుట్ర జరుగుతోంది అని కూడా చెప్పలేదు . ఇక్కడ జరిగింది క్లౌడ్ బరస్ట్ అవునా ?కదా? చెప్పలేదు . కానీ చదివే ఓపిక ఎవరికీ ? ప్రపంచ పర్యావరణం మారి పోతోంది . ఎందుకు ?. చర్చ జరగని .. ఇదీ నా పోస్ట్ ల సారం . నా స్టూడెంట్స్ .. పోలీస్ కమిషనర్ , ఇన్కమ్ టాక్స్ కమిషనర్ అయితే వెళ్లి ఒక సారి గ్రీటింగ్ చెప్పలేదు . చెప్పకూడదని కాదు . నా పని నాది . ఎప్పుడైనా సందర్భం వస్తే ఓకే. అంతే కానీ నా పనులు వదిలి పెట్టి వెళ్ళ. నేను .. నా స్కూల్ .. నా పిల్లలు .. క్లాసులు .. జిం .. ఇదే నా ప్రపంచం . ఏదో కరోనా యుగం లో ఫేస్బుక్ ద్వారా ఎడ్యుకేట్ చేయడం మొదలెట్టా . అది కొనసాగిస్తా . కానీ అక్కినేనికి మిక్కిలినేని తేడా తెలియదా? అని ఏదో సినిమా లో చెప్పినట్టు ఆరోరాల్ రీసెర్చ్ ప్రోగ్రాం కు ఇక్కడ జరిగిందో లేదో తెలియని క్లౌడ్ బరస్ట్ కు తేడా తెలియని జనాలకు జనాలకు చెప్పే ఓపిక/ అవసరం లేదు . వాక్ సీన్ ల గురించి చెప్పాల్సింది అంతా చెప్పేశా . ఇక పర్యావరణ్ కుట్ర నిజమో కాదో .. నేనే డిసైడ్ చేసుకోలేక ఉన్నా. ఇక నేను ఈ విషయం లో చెప్పేది ఏముంది ? ఒక వేళ . చెప్పినా చాలా మందికి అర్థం కాదు . అవన్నీ మీకు అనవసరం కదా .. పోనీలే ! మీరు మీ స్విమ్మింగ్ కొనసాగించండి . మీకు ఏ విధంగా విరోధి కాని / వైరం లేని ఆ మాటకు వస్తే మీ హితం కోరే వ్యక్తి పై ఏదో కాలక్షేపానికో / అహం దెబ్బ తినో బట్ట కాల్చి నెత్తిన వేయకండి . అది ధర్మంకాదు . ధర్మో రక్షతి రక్షితః ! - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
శభాష్ రమ్య.. నీ ప్రాజెక్ట్ అదిరింది!
సాక్షి,వీరఘట్టం(శ్రీకాకుళం): ఎక్కడ చూసినా ప్లాస్టిక్.. ఏది కొన్నా ప్లాస్టిక్. అంతరించిపోదని తెలిసినా, కీడు చేస్తుందని ప్రచారం చేసినా జనం దీన్ని వదలడం లేదు. కారణం సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం. సరి గ్గా ఈ ఆలోచనే వీరఘట్టం కేజీబీవీ విద్యార్థి ప్రాజెక్టును జాతీయ స్థాయికి పంపించింది. ప్లాస్టిక్కు బదులు బయో డీగ్రేడబుల్ కప్పులు వాడవచ్చని విద్యార్థి చేసిన ప్రదర్శన ఆమెను దేశ రాజధానికి పంపిస్తోంది. ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ వర్చువల్ ఎగ్జిబిషన్లో వీరఘట్టం కేజీబీవీ టెన్త్ విద్యార్థిని కె.రమ్య ప్రదర్శించిన గడ్డి కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయి సెమినార్కు ఎంపికైందని ఎస్ఓ రోజా తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెమినార్లో తమ విద్యార్థి పాల్గొంటుందని, ఇది తమకు గర్వకారణమని ఆమె తెలి పారు. ప్రాజెక్టు రూపొందించడంలో సహకరించిన గైడ్ టీచర్లు ఎల్.సునీత, కె.స్నేహలత, జి.సృజనలను అభినందించారు. ఏంటీ ప్రత్యేకత..? జిల్లా నుంచి 223 ప్రాజెక్టులు పోటీ పడితే ఈ ప్రాజెక్టు ఒక్కటే జాతీయ స్థాయి వరకు వెళ్లగలిగింది. కేజీబీవీ విద్యార్థిని రమ్య రూపొందించిన ప్రాజెక్టు పేరు బయో డీగ్రేడబుల్ కప్స్(గడ్డితో తయారు చేసే కప్పులు). ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ప ర్యావరణం కలుషితమవుతోంది. ముఖ్యంగా సిటీల్లో పానీపూరీ బడ్డీల వద్ద వీటి వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల ప్లాస్టిక్ కప్పుల బదులు బయోడీగ్రేడబుల్ కప్పులు వాడితే ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చునని రమ్య తన ప్రాజెక్టులో స్పష్టంగా చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కప్పుల తయారీ ఇలా.. విద్యార్థిని చెప్పిన వివరాల ప్రకారం.. ఈ బయోడీగ్రేడబుల్ కప్పులు కాలుష్య రహితం. వీటిని తయారు చేయడం చాలా సులభం. మనకు అందుబాటులో ఉండే ఎండుగడ్డిని కొంత తీసుకుని దాన్ని పౌడర్గా చేయాలి. ఈ పౌడర్ను తగినంత నీటిలో కలపి ఈ ద్రావణాన్ని ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. ద్రావణాన్ని వేడి చేశాక అందులో తగినంత కార్న్ఫ్లోర్, వెనిగర్ వేసి ముద్దగా తయారు చేయాలి. ఈ ముద్దను కప్పులుగా తయారు చేసి ఎండబెడితే బయోడీగ్రేడబుల్ కప్పులు తయారవుతాయి. ఈ కప్పుల్లో వేడి పదార్థాలు తిన్నా ఎలాంటి హాని ఉండదు. ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ఆనందంగా ఉంది నేను రూపొందించిన బయోడీగ్రేడబుల్ కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికవ్వ డం ఎంతో ఆనందంగా ఉంది. మా ఎస్ఓ మేడమ్, గైడ్ టీచర్ల సలహాలు, సూచనలతో ఈ ప్రాజెక్టు రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ కప్పులను సులువుగా తయారు చేసుకోవచ్చు. పానీపూరీ బడ్డీల వద్ద, మనం నిత్యం ఇంటిలో వాడే ప్లాస్టిక్ కప్పుల బదులు వీటిని వాడితే పర్యావరణాన్ని కాపాడినవాళ్లమవుతాం. ఢిల్లీలో త్వరలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెమినార్ పాల్గొనేందుకు మరింతగా సిద్ధమవుతున్నాను. – కె.రమ్య, పదో తరగతి విద్యార్థిని, కేజీబీవీ, వీరఘట్టం చదవండి: ఇల వైకుంఠపురంలో..! ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు -
కడప స్టీల్ప్లాంట్కు పర్యావరణ అనుమతులు
వైఎస్సార్ కడప: కడప స్టీల్ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులను ఇచ్చింది. దీంతో 3,591 ఎకరాల్లో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. కడప స్టీల్ ప్లాంట్.. ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
అమర్రాజాను ప్రత్యేకంగా టార్గెట్ చేశామన్నది అవాస్తవం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement