-
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు 7 రోజుల్లోగా సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారీఫ్ (చార్జీల పెంపు) ప్రతిపాదనలను 7 రోజుల్లోగా సమర్పించాలని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆదేశించింది. నవంబర్ 30న డిస్కంలు సమర్పించిన 2022–23 ఆర్థిక సంవత్సరాల వార్షికాదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ల్లో టారీఫ్ ప్రతిపాదనలు లేవని, వీటిని సమర్పించినట్లు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు డిస్కంల సీఎండీలకు ఈఆర్సీ గురువారం లేఖ రాసింది. వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022–23)కి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించిన నాటి నుంచి 120 రోజుల తర్వాతే రాష్ట్రంలో చార్జీల పెంపునకు అనుమతిస్తామని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతిపాదనలు ఎంత ఆలస్యం చేస్తే చార్జీల పెంపులో అంత ఆలస్యం జరగనుంది. గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించకపోతే ఏఆర్ఆర్లను ఈఆర్సీ తిరస్కరించే అవకాశాలున్నట్లు తెలిసింది. 120 రోజులు ఎందుకంటే?.. డిస్కంలు ఈఆర్సీకి ఏఆర్ఆర్తో పాటు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత నిబంధనల ప్రకారం వాటిని బహిర్గతం చేసి రాతపూర్వకంగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిం చాలి. డిస్కంలతో పాటు ఈఆర్సీ వెబ్సైట్లో వీటి ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. డిస్కంల టారిఫ్ పెంపు ప్రతిపాదనలు, వాటిపై వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, డిస్కంల ప్రతిస్పందనలపై ఈఆర్సీ అధ్యయనం జరిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ప్రక టిస్తుంది. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో 120 రోజుల సమయాన్ని ఇందుకు కేటాయిస్తూ కేంద్ర ప్రభు త్వం నిబంధనలను రూపొందించింది. అందుకే ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన ఏఆర్ఆర్లు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పి ంచాలని టారిఫ్ నిబంధనలు పేర్కొంటున్నాయి. వ్యూహాత్మకంగానే ఆలస్యం.. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజావ్యతిరేకత నుంచి ఉపశమనం పొందడానికే డిస్కంలు టారిఫ్ ప్రతి పాదనలను గడువులోగా సమర్పించకుండా వ్యూహాత్మకంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. చివరిసారిగా 2018–19కిసంబంధించిన ఏఆర్ఆర్లను ఈఆర్సీకి సమర్పించగా, అప్పట్లో చార్జీలు పెంచలేదు. 2019–20, 2020– 21 ఏఆర్ఆర్లను ఇవ్వలేదు. 2021–22 ఏఆర్ఆర్లను గడువు తీరాక సమర్పించాయి. 2022–23 ఏఆర్ఆర్లను సమర్పించినా, టారిఫ్ ప్రతిపాదనలను వాయిదా వేసుకున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి చార్జీలు పెంచాలని భావించినా, 120 రోజుల నిబంధన లో ఈఆర్సీ రాజీపడకపోవడంతో డిస్కంలకు ఎదురు దెబ్బతగిలింది. -
దొడ్డిదారిన బాదేయండి!
2013-14 సర్దుబాటు చార్జీలు కొత్త చార్జీల్లో కలిపేయండి తన ప్రకటనకు, ఈఆర్సీ ఆదేశాలకు భిన్నంగా సీఎం సూచన! రూ. 1,250 కోట్ల వసూలుకు డిస్కంలు సిద్ధం సాక్షి, హైదరాబాద్: 2013-14 ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చార్జీలను వసూలు చేయం. - విద్యుత్ చార్జీల పెంపు సందర్భంగా గత ఏడాది ఏప్రిల్లో సీఎం కిరణ్ 2013-14 సర్దుబాటు చార్జీల వసూలు రద్దు. - ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కానీ ముఖ్యమంత్రి తన ప్రకటనకే విరుద్ధంగా సూచనలిచ్చారు. ఈఆర్సీ ఆదేశాలను ధిక్కరించి దొడ్డిదారిన 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా పెంచనున్న రెగ్యులర్ చార్జీల్లోనే 2013-14 సర్దుబాటు చార్జీలను కూడా కలిపేయూలని సీఎం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 2014-15కు ఏకంగా రూ. 5 వేల మేరకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. ముఖ్యమంత్రి తన ప్రకటనకు, ఈఆర్సీ ఆదేశాలకు కట్టుబడితే ప్రజలకు వచ్చే ఏప్రిల్ నుంచి పొంచి ఉన్న భారం రూ. 1,250 కోట్ల మేరకు తగ్గేది. ఇంధన సరఫరాలో వ్యత్యాసాల వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చులు మారుతూ ఉంటాయి. తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ తగ్గి.. బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరిగితే విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఆ మేరకు పెరుగుతుంది. దేశీయ బొగ్గు అందుబాటులో లేని కారణంగా అధిక ధరకు విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నందువల్ల కూడా విద్యుత్ ఉత్పత్తికి అదనపు వ్యయం అవుతుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి అదనంగా వెచ్చించిన మొత్తాన్ని ప్రజల నుంచే ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఎస్ఏ) పేరిట వసూలు చేస్తారు. 2013-14లో ప్రభుత్వం రూ. 5,500 కోట్ల మేరకు రెగ్యులర్ చార్జీలను పెంచింది. ఆ సమయంలో ఈ సంవత్సరానికి సర్దుబాటు చార్జీలను వసూలు చేయబోమని సీఎం హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈఆర్సీ కూడా సర్దుబాటు చార్జీలను రద్దు చేసింది. కాగా రెండురోజుల క్రితం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో 2013-14 నాటి సర్దుబాటు చార్జీల గురించి డిస్కంలు ప్రస్తావించారుు. సుమారు రూ. 1,250 కోట్ల మేరకు వసూలు చేయాల్సి ఉందని, అరుుతే రద్దు చేస్తున్నట్టు ప్రకటించినందున సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించాలని కోరాయి. ఇందుకు సీఎం ససేమిరా అన్నారు. అంతేకాదు రెగ్యులర్ చార్జీలతో వీటిని కలిపేసి ఆ రకంగా వసూలు చేసుకోవాల్సిందిగా సూచించినట్టు ఇంధనశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలనే డిస్కంలు బుధవారం ఈఆర్సీకి సమర్పించనున్నాయి. 2013-14 సర్దుబాటు చార్జీల రద్దుకు ఆదేశించిన ఈఆర్సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది. నేడు పెంపు ప్రతిపాదనలు! విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల సమర్పణ బుధవారానికి వారుుదా పడింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం ఏపీఈఆర్సీకి సమర్పించాలని డిస్కంలు తొలుత భావించాయి. అయితే ఇదేరోజు రాష్ట్ర కేబినెట్ కూడా భేటీ కావడం ఇందుకు అడ్డంకిగా మారింది. 2013-14కు చార్జీల పెంపు సమయంలో మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. కేబినెట్కు సమాచారం లేకుండా చార్జీలను ఎలా పెంచుతారని గత ఏడాది వారు సీఎంను నిలదీశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తాజాగా సుమారు రూ.5 వేల కోట్ల మేరకు ప్రజలపై భారం వేసే విధంగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం సమర్పించేందుకు ప్రభుత్వం జంకినట్టు సమాచారం. కేబినెట్ సమావేశం రోజే భారీయెత్తున చార్జీలు పెంచుతూ ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పిస్తే, టీవీల ద్వారా విషయం బయటకు వెల్లడై కేబినెట్లో తీవ్ర నిరసన ఎదుర్కొనక తప్పదని ముఖ్యమంత్రి భావించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపాదనల సమర్పణ బుధవారానికి వాయిదా పడినట్టు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement