-
'నగ్న వీడియో' కేసు: యాంకర్ కు రూ.370 కోట్లు
నాష్ విల్లే: మారియట్ హోటల్ గదిలో తాను దుస్తులు మార్చుకుంటుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంపై న్యాయపోరాటానికి దిగిన టీవీ చానెల్ యాంకర్ ఎరిన్ ఆండ్రూస్ కు గొప్ప ఊరటలభించింది. అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ చానెల్ యాంకరైన ఎరిన్ ను వీడియో తీయడమేకాక, సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేసి ఆమెను క్షోభకు గురిచేశారంటూ ప్రతివాదులపై మండిపడ్డ కోర్లు.. నష్టపరిహారంగా ఎరిన్ కు 55 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.370 కోట్లు) చెల్లించాలని తీర్పుచెప్పింది. సోమవారం తల్లిదండ్రులతో కలిసి కోర్టుకు హాజరైన ఎరిన్ తీర్పు అనంతరం కాస్త ఊరటచెందినట్లు కనిపించారు. కోర్టు ఆవరణలో వేచిఉన్న తన అభిమానులకు ఆటోగ్రాఫులిచ్చారు. ఈ ఘటనతో నేను అవమాన భారంతో కుంగిపోయాననీ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని విచారణ సందర్భంగా కోర్టు జ్యూరీ ముందు ఎరిన్ తన వాంగ్మూలాన్నిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. 2008లో ఈఎస్పీఎన్ చానెల్కు పనిచేస్తున్నప్పుడు ఓ ఫుట్బాల్ మ్యాచ్ను కవర్ చేయడం కోసం ఎరిన్ అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ సమీపంలోని మారియట్ నేష్విల్లే హోటల్లో బసచేసింది. పక్క గదిలోనే బసచేసిన మైకేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి ఎరిన్ గదిలోకి రంధ్రం చేసి..ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. ఈ వీడియో తర్వాత ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడంతో పబ్లిసిటీ కోసం ఎరినే స్వయంగా ఈపని చేసిందంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై ఎరిన్ కోర్టుకెక్కడంతో అసలు విషయం బయటపడింది. ఎరిన్ కు చెల్లించాల్సిన జరిమానాను ప్రధాన దోషి అయిన మైకేల్ డేవిడ్, రెండో దోషి మారియట్ హోటల్ గ్రూపులు చెరిసగం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కాగా, హోటల్ నిర్వహణను రెండు కంపెనీలు చూస్తున్నందున ఆ రెండూ ఎంతెంత శాతం చెల్లించాలనే నిర్ణయాన్ని వారికే వదిస్తున్నట్లు కోర్లు చెప్పింది. ఎట్టకేలకు కేసు గెలవడంతో ఏళ్లుగా తాను అనుభవిస్తున్న క్షోభ నుంచి ఎరిన్ విముక్తురాలైనట్లైంది. -
న్యూడ్ వీడియోపై స్పోర్ట్స్ యాంకర్ కంటతడి!
నేష్విల్లే: తాను దుస్తులు మార్చుకుంటుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టాడని తెలిసినప్పుడు తాను దిగ్భ్రమ చెందానని, తీవ్ర అవమాన భారంతో కుంగిపోయానని అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్ ఈరిన్ ఆండ్ర్సూ కన్నీటి పర్యంతమవుతూ కోర్టులో తెలిపింది. తన నగ్న వీడియోను ఇంటర్నెట్లో పెట్టిన వ్యవహారంలో మారియట్ నేష్విల్లే హోటల్పై ఆమె 75మిలియన్ డాలర్ల (రూ. 511 కోట్ల) పరువు నష్టం దావా వేసింది. ఈ కేసులో సోమవారం ఆండ్ర్సూ తన వాంగ్మూలాన్ని కోర్టు జ్యూరీకి నివేదించింది. ఘటన జరిగిన నాటినుంచి తాను నిద్రలేని రాత్రులు గడిపానని, దీనంగా రోదిస్తూ కుంగుబాటుకు గురయ్యానని ఆమె తెలిపింది. 2008లో వాండర్బిల్ట్ ఫుట్బాల్ క్రీడలు కవర్ చేసేందుకు స్పోర్ట్స్ యాంకర్ అయిన ఈరిన్ ఆండ్ర్సూ అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న మారియట్ నేష్విల్లే హోటల్ లో దిగింది. అయితే ఆమె గది పక్కనే దిగిన మైఖేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి ఆమె రూమ్లోకి రంధ్రం చేసి.. ఆమె దుస్తులు మారుస్తుండగా వీడియో తీసి.. ఇంటర్నెట్లో పెట్టాడు. గతంలో 'డ్యాన్సింగ్ విత్ స్టార్స్' అనే టెలివిజన్ షోలో కూడా కనిపించిన ఆండ్ర్సూ ఈ వ్యవహారంలో ఆ హోటల్ను కోర్టుకు ఈడ్చింది. ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందనే విషయం దర్యాప్తులో వెలుగులోకి రాకముందే.. తానే స్వయంగా ఈ వీడియో తీసి.. పబ్లిసిటీ కోసం ఇంటర్నెట్లో పెట్టానని దినపత్రికలు రాశాయని ఆమె కోర్టుకు తెలిపింది. హోటల్ సిబ్బంది తన గది నంబర్ను వెల్లడించడం వల్లే తన గది పక్కన రూమ్ తీసుకొని దుండగుడు ఈ పనికి పాల్పడ్డాడని పేర్కొంది. తన గది పక్కనే రూమ్ కావాలని ఓ వ్యక్తి తమను కోరినట్టు మారియట్ సిబ్బంది తనకు ముందే చెప్పి ఉంటే తాను వెంటనే పోలీసులకు ఫోన్ చేసేదానినని, దీంతో ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆమె తెలిపింది. అయితే హోటల్ తరఫు లాయర్ మాత్రం ఈ వ్యవహారంలో నేరమంతా నిందితుడు డేవిడ్ బ్యారెట్దేనని, హోటల్ది ఇందులో ఏమాత్రం తప్పిదం లేదని వాదించాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement