-
రజనీ చాయలు ఉండొచ్చు
నానటనలో సూపర్స్టార్ రజనీకాంత్ చాయలు ఉండవచ్చని యువ నటుడు శివకార్తికేయన్ అంటున్నారు. వరుత్త పడాద వాలిబర సంఘం, ఎదిర్ నీశ్చల్, మాన్ కరాటేవంటి వరుస విజయాలతో హేట్రిక్ కొట్టిన ఈయన తాజాగా పోలీసు గెటప్లో కాకిసట్టై అంటూ తెరపైకి రానున్నారు. తన ఉండర్ ఫిలింస్ బ్యానర్పై నిర్మిం చిన ఈ చిత్రానికి ఎదుర్నీశ్చల్ చిత్రం ఫేమ్ దురై సెంథి ల్కుమార్ దర్శకుడు. వరుత్తపడాద వాలిభర సంఘం చిత్రం తరువాత శ్రీ దివ్య మరోసారి శివకార్తికేయన్తో జతకట్టిన ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ పి.మదన్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటుడు శివకార్తికేయన్ మాట్లాడు తూ తనగత చిత్రాలు కాస్త భిన్నంగా, కొత్తగా, వాణిజ్య విలువలను పెంచుతూ కాక్కిసట్టై చిత్రాన్ని చేశామని తెలిపారు. తన తండ్రి నిజాయితీ గల పోలీసు అధికారి అని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను పోలీసు అధికారి కావాలని ఆశించానన్నారు. అనివార్య కారణాల వలన ఆ కోరిక నెరవేరలేదని ఇప్పుడా ఆశను ఈ చిత్రం లో పోలీసు అధికారిగా నటించి తీర్చుకున్న ట్లు తెలిపారు. ఒక సామాన్యుడు పోలీసు అధికారిగా ఏమి చే శాడన్నది కాక్కిసట్టై చిత్ర ఇతివృత్తంగా పేర్కొన్నారు. చిత్రంలో యాక్షన్, లవ్, కామెడీ అన్ని తగు పాళ్లలో ఉంటాయన్నారు. తన పాత్రను ఎక్కడ ఓవర్ బిల్డప్ లేకుండా దర్శక, నిర్మాతలు సమాలోచనలు చేసి తీర్చిదిద్దారన్నారు. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంలో మాదిరిగానే ఈ చిత్రంలోను హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందన్నారు. అదే విధంగా కొన్ని సన్నివేశాల్లో తన నటనలో సూపర్స్టార్ రజనీకాంత్ స్టైల్స్ కనిపిస్తున్నాయని, ఆయన్ని అనుకరిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారన్నారు. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయన చిత్రాలు చూస్తూ ఎదిగిన వాడిని. అందువలన ఆయన నటనా చాయలు ఉండవచ్చుగానీ అనుకరించ డం లేదని వివరించారు. ఈ సమావేశంలో దర్శకుడు దురై సెంథిల్కుమార్, పి.మదన్ తదితరులు పాల్గొన్నారు. -
నయనతార స్పెషల్ సాంగ్తో...
సినిమాల్లోని ప్రత్యేకగీతాల్లో హీరోయిన్లు నర్తించడం సర్వసాధారణం. కానీ.. ఓ స్టార్హీరో, ఓ స్టార్హీరోయిన్ కలిసి సంబంధంలేని సినిమాలో ప్రత్యేకగీతంలో చేయడం నిజంగా విశేషమే. అప్పుడెప్పుడో వెంకటేశ్, శ్రీయ కలిసి తరుణ్ ‘సోగ్గాడు’ చిత్రంలో ఓ పాట చేశారు. తర్వాత మళ్లీ ఆ దాఖలాలు కనిపించలేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ఫీట్ రిపీట్ అయ్యింది. అయితే... ఈసారి అడుగు కదిపిన నాయకా నాయికలు ఎవరనుకుంటున్నారు? ధనుష్, నయనతార. ఇంతకీ వీరిద్దరూ కలిసి నర్తించిన సినిమా ఏదంటే... శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ జంటగా ఆర్.ఎస్.దురై సెంథిల్కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఎదిర్ నీచెల్’. దనుష్ ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. ధనుష్ మాట కాదనలేకే... ఈ సినిమాలో నయనతార తనతో పాటు ప్రత్యేకగీతంలో నర్తించారు. అదీ విషయం. ఈ చిత్రం ‘నా లవ్స్టోరి మొదలైంది’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. రామాంజనేయులు.జె ఈ అనువాద చిత్రానికి నిర్మాత. యువతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘తెలుగు నేటివిటీకి దగ్గరగా సాగే ప్రేమకథ ఇది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. కొన్ని సన్నివేశాలైతే... మనసుకు హత్తుకుంటాయి. అనిరుధ్ సంగీతం, నయనతార స్పెషల్సాంగ్ అదనపు ఆకర్షణలు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
తప్పక చదవండి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement