-
రూ.15 లక్షలకు పైసాతగ్గినా భూములివ్వం
స్పష్టం చేసిన కన్నేపల్లి రైతులు ఎకరాకు రూ.3.2 లక్షలు ఇస్తామన్న ఆర్డీవో రసాభాసగా గ్రామసభ పూర్తయిన 188 ఎకరాల సర్వే పంప్హౌస్ దారిలో ముల్ల కంచె వేసి నిర్వాసితులు కాళేశ్వరం : పంప్హౌస్ నిర్మాణానికి ఇచ్చే భూములకు ఎకరాకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇందుకు ఒక్క రూపాయి తగ్గినా ఇంచు భూమి కూడా ఇవ్వమని కన్నేపల్లి రైతులు స్పష్టం చేశారు. పంప్హౌస్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 48 ఎకరాలు సేకరించిన అధికారులు మరో 188 ఎకరాలకు సేకరణకు, పట్టా భూములు, కాస్తు, అసైన్డ్ వివరాల కోసం సర్వే చేశారు. ఈ సరే ముగియడంతో గురువారం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. మంథని ఆర్డీవో శ్రీనివాస్ భూసేకరణపై అభ్యంతరాలు తెలుసుకున్నారు. పంప్హౌస్ కోసం ఎవరెవరి భూమి ఎంత సేకరిస్తున్నారో చదివి వినిపించారు. అనంతరం మహదేవపూర్ మండలంలో ప్రభుత్వం స్టాంప్ఫీజు ప్రకారం ఎకరం భూమి విలువ రూ.లక్ష ఉందని తెలిపారు. దీని ప్రకారం భూమి కోల్పోయే రైతులకు ఎకరాకు ప్రభుత్వం రూ.3.2 లక్షలు ఇస్తుందని ప్రకటించారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. భూములకు ధర ప్రకటించకుండా సర్వేలు చేసి కన్నేపల్లి గ్రామాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట సేకరించిన 48 ఎకరాలకు డబ్బులు ఇచ్చి, తరువాత ధర ఎంత పెంచితే అంత ఇస్తామన్న అధికారులు, ఒక్కసారిగా ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తేనే పంప్హౌస్ నిర్మాణానికి సహకరిస్తామని తెగేసి చెప్పారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంచేసినా వారు శాంతించలేదు. దీంతో ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. సమావేశంలో సర్పంచ్ లోకుల పోశక్క, ఉపసర్పంచ్ మల్లారెడ్డి, తహసీల్దార్ జయంత్, ఇరిగేషన్ ఈఈ ఓంకార్సింగ్, డీఈఈ సూర్యప్రకాశ్, ప్రకాశ్, ఏఈ వెంకట్, ఎసై ్స ఉదయ్కుమార్, పోలీసులు పాల్గొన్నారు. పంప్హౌస్ దారిలో ముళ్లకంప వేసి నిరసన తగిన పరిహారం ఇవ్వడంలేదని నిర్వాసితులు పంప్హౌస్ రోడ్డుకు అడ్డుగా గొయ్య తవ్వి, ముళ్లకంప వేసి నిరసన తెలిపారు. ఏఎసై ్స ముకీద్ నిర్వాసితులకు నచ్చజెప్పినా వినలేదు. తమకు న్యాయం జరిగే వరకూ పనులు జరుగనివ్వమని స్పష్టం చేశారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తమకు ఇచ్చిన మాట వట్టిదేనా అని ప్రశ్నించారు. 20 రోజుల క్రితం ఎకరానికి రూ5.5 లక్షలకుపైగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కలెక్టర్కు నివేదిస్తా – శ్రీనివాస్, ఆర్డీవో కన్నేపల్లిలో 188 ఎకరాల సేకరణకు సర్వే పూర్తిచేశాం. భూములపై అభ్యంతరాలను నివృత్తి చేశాం. ప్రభుత్వం లావోణి, పట్టా భూములకు ఒకే రకమైన పరిహారం ఇవ్వదు. మహదేవపూర్ మండలంలో స్టాంప్ఫీజు ప్రకారం ఎకరానికి రూ.లక్ష ధర ఉంది. ఈవిధంగానే ఎకరానికి రూ.3.2 లక్షలు ఇవ్వనున్నాం. నిర్వాసితులుతు మాత్రం రూ.15లక్షలు కావాలని కోరుతున్నారు. కొంత మంది మేడిగడ్డ, సూరారం రైతులు ఏవిధంగా పరిహారం ఇస్తే అలాగే మాకు ఇవ్వలన్నరు. ఈవిషయాలన్నీ కలెక్టర్కు నివేదిస్తాం. -
ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలి
మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇళ్లు కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజలను మానవతాద క్పథంతో ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల పునరావాస కాలనీల మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మొత్తం భూములు కోల్పోయి ఇళ్లు మాత్రమే మిగిలిన వారికి తగిన న్యాయం చేయాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టులో సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలకు 15 రోజులు గడువు ఇచ్చి పునరావాస కాలనీలకు తరలించాలని సూచించారు. చెగ్యాం గ్రామంలో 34 ఇళ్ల సమస్య ఉందని, వారికి రీసర్వే ప్రకారం పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, పెద్దపల్లి, కరీంనగర్ ఆర్డీవోలు పి.అశోక్కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. తరలివచ్చిన ముంపు గ్రామాల ప్రజలు ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెగ్యాం, ముక్కట్రావుపేట, పాశిగాం, కోటిలింగాల ముంపు గ్రామాల ప్రజలు మంగళవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జేసీ శ్రీదేవసేన, జిల్లా అధికారులు నిర్వాసితులతో సమీక్ష నిర్వహించారు. ముంపు గ్రామాలకు చెందిన పలువురు బాధితులు మాట్లాడుతూ తమకు పరిహారం చెల్లించడంలో అన్యాయం జరిగిందని, పరిహారాన్ని పెంచి ఇవ్వాలని కోరారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకుని ప్రభుత్వం చట్టం ప్రకారం తన పని తాను చేసుకపోతుందని, అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్దామని, అందుకయ్యే ఖర్చులను సైతం తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement