-
ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?
డిసెంబర్ 7వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇలా విడుదల చేస్తారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించినది అని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి చట్టంలోని అంశాలు, రూల్సు, అవసరమైన ఫారాలు, వివరణలు, వివిధ రిఫరెన్సులు, సులువుగా అర్థమయ్యే పది ఉదాహరణలతో ఈ సర్క్యులర్ వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇందులో అంశాలు మీకోసం క్రోడీకరించి ఒకే చోట విశదీకరించారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమి ఉంటాయి అంటే.. ► జీతం అంటే ఏమిటి.. పెర్క్స్ అంటే ఏమిటి, జీతంలో కలిసే ఇతర అంశాల నిర్వచనాలు ► శ్లాబులు, రేట్లు, రిబేట్లు మొదలైనవి ► టీడీఎస్ ఎలా లెక్కించాలి ► ఇద్దరు యజమానులుంటే ఎలా చేయాలి ► ఎరియర్స్ జీతం, అడ్వాన్స్ జీతం లెక్కింపు ► జీతం మీద ఆదాయం కాకుండా ఇతర ఏదైనా ఆదాయం ఎలా తెలియజేయాలి ► ఇంటి లోన్ మీద వడ్డీ, షరతులు ► విదేశాల నుంచి వచ్చే జీతం ► టీడీఎస్ రేట్లు, ఎలా రికవరీ చేయాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, రిటర్నులు ఎలా దాఖలు చేయాలి, టీడీఎస్ సర్టిఫికెట్ ఫారం 16 ఎలా జారీ చేయాలి, ఎప్పుడు దాఖలు చేయాలి ► పైవన్నీ సకాలంలో చేయకపోతే, వడ్డీ, పెనాల్టీల వివరాలు ► ఏయే మినహాయింపులు ఉన్నాయి ► ఏయే కాగితాలు, రుజువులు ఇవ్వాలి. ఇలా ఎన్నో.. ► ఫారాలు 12బీఏ, 12బీబీ, 16.. ఇతర రిటర్నులు .. 10బీఏ.. ఇలా పది ఉన్నాయి ► సంబంధిత సర్క్యులర్లు, రిఫరెన్సులు, పద్ధతులు, నోటిఫికేషన్లు ► డ్రాయింగ్ ఆఫీసర్లు చేయాల్సిన విధులు ► పలు ఉదాహరణలు. ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, ఏయే సందర్భాలుంటాయి, ఆ సందర్భాలను.. ఆ కేసులను తీసుకుని.. నిజమైన కేస్ స్టడీలాగా రూపొందించి ఉదాహరణలను తయారు చేశారు. అవి చదువుతుంటే మీ కేసునే తీసుకుని తయారు చేశారా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక సజీవ కేసు.. ఒక నిజమైన లెక్కింపు.. ఒక ప్రాక్టికల్ ప్రోబ్లెమ్కి రెడీమేడ్ సొల్యూషన్.. రెడీ రిఫరెన్స్.. రెడీ రెకనార్ . చదవండి.. చదివించండి. అర్థం చేసుకుంటే మీరే నిపుణులు. -
పెట్టుబడికి స్థలమే భేష్!
- ధర విషయంలో జాగ్రత్త అవసరం - లే అవుట్ కాకుంటే... రక్షణ చర్యలూ ఉండాలి సాక్షి, హైదరాబాద్: ఉండటానికైతే ఇల్లో లేకుంటే ఫ్లాటో కొనటం మంచిదే. కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటే...? అందుకు రియల్ ఎస్టేట్ను ఎంచుకుంటే...? ఈ ప్రశ్నలు వచ్చినపుడు పెట్టుబడులకైతే స్థలమే చక్కని మార్గమనేది నిపుణుల సూచన. దీర్ఘకాలం వేచి చూడగలిగితే దీనిపై అధిక రాబడిని అందుకోవచ్చన్నది వారి మాట. ఈ విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైందని కూడా వారు చెబుతున్నారు. నిజానికి దీర్ఘకాలిక పన్ను లాభాలకోసం నివాస సముదాయాల్లో పెట్టుబడి పెట్టడం అందరికీ తెలిసిందే. కాకపోతే దీనితో పోల్చినపుడు స్థలాలపై పెట్టుబడే ఎక్కువ రాబడినిస్తుందనేది ఇప్పటిదాకా పలుమార్లు నిరూపితమైందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిపుడు దేశంలో అందుబాటు ఇళ్ల నిర్మాణాలపై దృష్టిసారించాయి. ప్రత్యేక పథకాలతో ముందుకొస్తున్నాయి కూడా. కాబట్టి స్థలాలకు గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదని, ఎవరిదగ్గరైనా డబ్బులుండి, పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉంటే స్థలానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని వారు చెబుతున్నారు. స్థలమెక్కడ? నిపుణుల సూచనల ప్రకారం... ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక, ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలువ రెండుమూడు రెట్లు పెరిగే అవకాశం గల ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే ఉత్తమం. హెచ్ఎండీఏ లాంటి స్థానిక సంస్థలు తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి... వీలుంటే ఓ సారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయేమో ఓసారి ఆరా తీయండి. బృహత్ ప్రణాళిక ప్రకారం మీరు కొనే ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉంటే ఉత్తమం. దేని పరిధిలోకి వస్తుంది? మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుందా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని కనుక్కోండి. హెచ్ఎండీఏ తాజా బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల చదరపు కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియజేస్తూ మ్యాప్లు కూడా విడుదల చేశారు. అయితే ఈ విషయంపై ఒకోసారి హెచ్ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి. ధర ఎంత? మాంద్యం తర్వాత మార్కెట్లో 30 శాతం స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు? బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులుంటే అడిగి తీసుకోండి. వాటిని లాయర్తో పరిశీలింపజేయండి. స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. కొన్ని ప్రైవేటు రియల్టీ సంస్థలూ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుని రుణాలిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. రిజిస్ట్రేషన్ మీ పేరిటే ఉండాలి.. మీరు సొమ్మంతా కట్టేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఏదేనీ ఓ లే-అవుట్లో స్థలం కొంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టుకోండి. అపరిచితులు ఆక్రమించకుండా ఉండాలంటే మాత్రం మీరు క్రమం తప్పకుండా మీ స్థలంపై దృష్టి సారించాలి. -
ఇప్పుడు ఏ షేర్లు బెటర్?
గత సోమవారం... సెన్సెక్స్ ఏకంగా 1600 పైచిలుకు పాయింట్లు నష్టపోయింది. రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద చూస్తుండగానే గాల్లో కలిసిపోయింది. ఆ మర్నాడు 300 పైచిలుకు పాయింట్లు పెరిగినప్పటికీ... బుధవారం మళ్లీ పెరిగిందంతా పడిపోయింది. మళ్లీ వారాంతంలో 500 పాయింట్లపైన పెరిగి కాస్త ఊరటనిచ్చింది. సరే! ఇదంతా బాగానే ఉంది. మరి ఇలా దారుణంగా పతనమవుతూ... అంతలోనే పెరుగుతూ... అసలు ఏమవుతుందో తెలియని అనిశ్చితిలో మార్కెట్లుంటే సామాన్య మదుపరుల సంగతేంటి? ఈ అయోమయంలో అసలు స్టాక్మార్కెట్లో పెట్టుబడులు సురక్షితమేనా... కాదా? ఒకవేళ మార్కెట్ ఎటు నుంచి ఎటు తిరిగినా తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి షేర్లు ఎంచుకోవాలి? ఆ షేర్లు ఎంచుకోవటానికి ఏఏ అంశాలు చూడాలి? వీటన్నిటిపై పలువురు మార్కెట్ నిపుణులను ‘సాక్షి’ ప్రాఫిట్ ప్రతినిధులు సంప్రదించారు. వారిచ్చిన సూచనల మేరకు అందిస్తున్న ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం... - ఈ పతనంలో లాభాన్నిచ్చేవీ ఉంటాయి - కొనే ముందు ఐదంశాలు తప్పక చూడాలి - మరింత పడిపోకుండా ఉండేవి గమనించాలి - ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ నిపుణుల సూచనలు (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) గతవారంతో పోలిస్తే మార్కెట్లిపుడు కాస్త తగ్గే ఉన్నాయి. అందుకని చక్కని లాభం ఇచ్చే అవకాశమున్న షేర్లవంక చూస్తే ఇబ్బంది లేదు. నిజానికి మార్కెట్లు బాగా పడిపోతున్నపుడు కొనే అవకాశాన్ని చాలామంది కోల్పోతూనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్లు ఎంతవరకూ పడతాయన్నది తెలియకపోవటం... ఇంకా పడతాయేమోనని ఎదురుచూడటం సహజం. అయితే ఇలా పడి... పెరిగిన తరవాత కూడా చాలా షేర్లు అంతకు ముందటి ధరలతో పోలిస్తే చౌకగానే దొరుకుతాయన్నది గ్రహించాలి. మనం చేయాల్సిందల్లా వీటిలో బాగా పెరిగే అవకాశమున్న వాటిని గుర్తించటమే!! మరి గుర్తించేదెలా..? ఆత్మస్థయిర్యం అవసరం... మార్కెట్లు బాగా పడుతున్నపుడు ఏ షేరైనా కొనాలంటే చాలా ధైర్యం కావాలి. సెన్సెక్స్ సోమవారం 1,600 పాయింట్లపైగా... బుధవారం మరో 400 పాయింట్లపైగా పడింది. అలాంటపుడు షేర్లు కొనాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇంకా పడుతుందేమోననే భయాన్ని జయించాలి కనక. ఇక వారాంతంలో కొంత పెరిగి... ప్రస్తుతానికి మార్కెట్లు సెటిలైనట్లే కనిపిస్తున్నాయి. మార్కెట్లు స్థిరపడినా, స్థిరపడకపోయినా కూడా పెట్టిన పెట్టుబడికి ఇబ్బంది లేని, దీర్ఘకాలంలో లాభాలిచ్చే షేర్లను ఎంచుకోవటమే ఈ సమయంలో మంచిదన్నది నిపుణుల సూచన. నిజానికి మార్కెట్లు బాగా పడ్డాక మంచి షేర్లను ఎంచుకోవాలంటే పలు మార్గాలున్నాయి. నిజానికి తాజా పతనం... మళ్లీ ఎగియటం వంటి సందర్భాల్లో ఇంతకుముందు ఫేవరెట్లుగా ఉన్నవే మళ్లీ పెరుగుతాయి. వీటిని కొనటం సురక్షితమే. కాకపోతే రిస్క్-రివార్డ్ నిష్పత్తిని చూడాలి. బాగా తగ్గి, తక్కువ ధరలో ఉన్నవి కొంటే... ఒకవేళ మళ్లీ మార్కెట్ పడినా వీటి పతనం మాత్రం తక్కువే ఉంటుందన్నది గమనించాలి. వీటిని గుర్తించడానికి చూడాల్సిన అంశాలివీ... 1. వాల్యుయేషన్లు విలువ పరంగా బాగా తగ్గి ఉన్నవాటిని ఎంచుకోవటం మంచిదే. ఎందుకంటే తాజా పతనం తరవాత ఫ్రంట్లైన్, మిడ్క్యాప్ షేర్లలో చాలావరకూ ఆకర్షణీయమైన విలువల్లో దొరుకుతున్నాయి. ఇవి వాటి దీర్ఘకాలిక సగటుకన్నా తక్కువగా కూడా ఉన్నాయి. బహుశా! కొన్ని కనిష్ట స్థాయిల వద్దే ఉన్నాయని భావించవచ్చు. వీటిలో భవిష్యత్తులో పటిష్ఠమైన వృద్ధి కనబరిచేవి పెట్టుబడికి చక్కని అవకాశమున్న స్టాక్స్గా భావించవచ్చు. 2. నగదు నిల్వలు.. పెట్టుబడుల స్థాయి కంపెనీ తాలూకు నగదు నిల్వలు, పెట్టుబడులు చక్కని సూచికగా పనికొస్తాయి. ఎందుకంటే మార్కెట్లు నిట్టనిలువునా పడినపుడు చాలా కంపెనీల షేర్లు వాటి దగ్గరుండే నగదు, అవి పెట్టిన పెట్టుబడుల విలువకు సమాన స్థాయికి పడిపోతాయి. కొన్ని అంతకన్నా తగ్గుతాయి కూడా. దానర్థం అవి చేసే వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్ పరిగణనలోకి తీసుకోలేదన్న మాట. ఇలా నగదు రిజర్వులు, వాటి పెట్టుబడుల హోల్డింగ్స్ మొత్తం విలువకు దగ్గర్లో దాని షేరు విలువ కూడా ఉన్నట్లయితే... అలాంటి వాటిలోకి స్మార్ట్ మనీ ప్రవహిస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇలాంటివి చక్కని రివార్డ్నిస్తాయని చెప్పొచ్చు. 3. డివిడెండ్ ఈల్డ్ కంపెనీలు డివిడెండ్ ఇవ్వటం సర్వసాధారణం. అయితే ఈ డివిడెండ్ ఎంతనేది కాకుండా డివిడెండ్ ఈల్డ్ ఎంతనేది చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఎక్స్- కంపెనీ షేరు ధర దాదాపు 2,000 దగ్గర ఉందనుకుందాం. దాని ముఖ విలువ రూ. 10. ఏ కంపెనీ అయినా డివిడెండ్ను దాని ముఖవిలువపైనే ప్రకటిస్తుందని గుర్తుంచుకోవాలి. సదరు కంపెనీ 200% డివిడెండ్ను ప్రకటించిందనుకోండి. షేరుకు రూ.20 డివిడెండ్ వస్తుంది. అయితే రూ.2,000 వద్ద షేరు కొన్న వ్యక్తికి ఆ రూ. 20 డివిడెండ్ ఎంత శాతం? కేవలం 1%. అదే ఈల్డ్ అన్నమాట. వై- కంపెనీ షేరు ముఖ విలువ కూడా పది రూపాయలే. అది రూ.200 వద్ద ట్రేడవుతోందని అనుకుందాం. సదరు కంపెనీ గనక 100 శాతం డివిడెండ్ ఇస్తే షేరుకు రూ.10 వస్తుంది. రూ. 200 పెట్టి కొన్న వ్యక్తికి రూ.10 అంటే... దాదాపు 5 శాతం ఈల్డ్ (రాబడి) వచ్చినట్టన్న మాట. ఈ లెక్కన చూసినపుడు 200 శాతం డి విడెండ్ ఇచ్చిన ఎక్స్ కంపెనీకన్నా 100 శాతం డివిడెండ్ ఇచ్చిన వై కంపెనీయే బెటరని భావించాలి. నిజానికి కొన్ని కంపెనీల డివిడెండ్ ఈల్డ్ 6 నుంచి 10 శాతం మధ్యన కూడా ఉంటుంది. ఇవి క్రమంతప్పకుండా డివిడెండ్ ఇస్తాయి కూడా. బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ రాబడి రావటంతో పాటు, దీర్ఘకాలంలో షేరు ధర పెరుగుతుంది కనక వీటిద్వారా ఆ రకంగానూ లాభపడవచ్చు. 4. ఈ అనిశ్చితి వల్ల లాభమెవరికి? భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశమున్న షేర్లవైపే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చూస్తుంటారు. ఫండమెంటల్స్ బలంగా ఉండటంతో పాటు భవిష్యత్తు పరిణామాలు అనుకూలంగా ఉన్న షేర్లవైపు ఇలాంటి పతనంలో అంతా చూస్తారు. బ్రోకింగ్ సంస్థ ‘నొముర’ మాటల్లో చెప్పాలంటే... ఇలాంటి పతనాల సమయంలో అలాంటి షేర్లను గుర్తించటానికి ప్రస్తుత పరిణామాలను జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కమోడిటీ ధరలు బాగా తగ్గి ఉన్నాయి కనక... రూపాయి కూడా పతనమైంది కనక... ఈ రెండు పరిణామాల వల్ల లాభం కలిగే కంపెనీలను గుర్తిస్తే భవిష్యత్తులో వాటి ధర పెరిగి చక్కని రివార్డు వచ్చే అవకాశముంది. 5. రిలేటివ్ స్ట్రెంగ్త్... ఇక చివరిగా చూడాల్సిన షేర్ల విషయానికొస్తే... ఇంతటి మార్కెట్ పతనంలో కూడా బాగా పడిపోకుండా నిలదొక్కుకుని ఉన్నవేంటో చూడాలి. ట్రెండ్కు వ్యతిరేకంగా పెరిగిన షేర్లను గమనించాలి. సాధారణంగా ఈ షేర్లను డిఫెన్సివ్ షేర్లుగా పేర్కొంటుంటారు. ఇలాంటి షేర్లు ఒకవేళ అనిశ్చితి కొనసాగినప్పటికీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిందొకటుంది. కొన్ని చిన్న కంపెనీల షేర్లు చాలావరకూ ప్రమోటర్లు, వారి కనుసన్నల్లో ఉండే బ్రోకర్ల చేతిలోనే ఉంటాయి. అతికొద్ది షేర్లు మాత్రం సాధారణ ఇన్వెస్టర్ల దగ్గరుంటాయి. అలాంటి షేర్లు ఇంతటి పతనంలో కూడా ఎవ్వరూ అమ్మరు కనక పడవు. అలా పడలేదు కాబట్టి అవి మంచి షేర్లనుకోవటం మొదటికే మోసం. అందుకే ఏ షేర్లను ఎంచుకున్నా... అవి ఫ్రంట్లైన్, భారీ పరిమాణంలో లావాదేవీలు జరిగే మంచి మిడ్క్యాప్ షేర్లయి ఉండాలనేది నిపుణులు చెబుతున్న ప్రధాన నియమం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement