-
వ్యర్థాలతో అనర్థాలు.. చెత్తలోకి కాలం చెల్లిన మందులు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన మందులు.. ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయి. వీటిని సక్రమంగా నిర్వీర్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. చాలామంది రిటెయిలర్లు ఎక్స్పెయిర్ అయిన మందుల్ని చెత్తలో వేస్తున్నారు. మందుల షాపులతో పాటు ఇళ్లల్లోంచి కూడా రకరకాల మాత్రలు, సిరప్లు, ఆయింట్మెంట్లు మునిసిపాలిటీ చెత్త డబ్బాలు లేదా మురుగు కాలువల్లో పడేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి వెలువడే ఫ్లూయిడ్స్ను.. ఎలాంటి సీవరేజీ ట్రీట్మెంట్ చేయకుండానే డ్రైనేజీలోకి వదులుతున్నారు. 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిర్వీర్యం చేయాల్సిన మందులు డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతే అనేక దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. వాతావరణం, జలాలు కలుషితమవడంతో అనారోగ్యాలు ప్రబలుతున్నాయి. హెపటైటిస్ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. మందులు కుళ్లిపోతే వచ్చే సమస్యలు యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోవడం వల్ల ఆ వ్యర్థాల నుంచి కొత్తరకం బ్యాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బ్యాక్టీరియా వల్ల కొత్తరకం జబ్బులు సోకుతున్నాయి. సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా ఈ జబ్బులు పూర్తిగా తగ్గడంలేదు. మందులు చెత్త కుప్పల్లో కుళ్లిపోవడం వల్ల వాయుకాలుష్యం తీవ్రమవుతోంది. గాలి ద్వారా వ్యాప్తిచెందే జబ్బుల ప్రభావం పెరుగుతోంది. భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి. ఈ నీటిని తాగడం వల్ల మనుషులతోపాటు జంతువులకు కూడా మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్–బి వంటి జబ్బులు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో రంగుల డబ్బాలు కాలం చెల్లిన మందులే కాదు.. ఆస్పత్రుల్లో ఉత్పన్నమయ్యే వివిధ రకాల బయో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలున్నాయి. వీటిని సేకరించడానికి కూడా ప్రత్యేక రంగులను నిర్ణయించారు. ఆయా వ్యర్థాలను నిర్దేశించిన రంగు ఉన్న డబ్బాల్లోనే వేయాలి. హ్యూమన్ అనాటమిక్ వేస్ట్: రోగినుంచి వచ్చిన బాడీ ఫ్లూయిడ్స్, డ్రెస్సింగ్ వేస్ట్, బ్యాగ్లు, రక్తంతో ఉన్న వేస్ట్, ఎక్స్పెయిరీ మందులు వంటివి. వీటిని పసుపు రంగు డబ్బాల్లో మాత్రమే వేయాలి. అనంతరం వీటిని అత్యధిక ఉష్ణోగ్రతలో నిర్వీర్యం చేయాలి. కంటామినేటెడ్ వేస్ట్: రోగి శరీరంలో అమర్చి ఆ తర్వాత పడేయాల్సిన ట్యూబ్లు, యూరినల్ బ్యాగ్స్, సిరంజిలు, నీడిల్స్ వంటివి. వీటిని ఎరుపురంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్ లేదా మైక్రోవేవింగ్ హైడ్రోక్లావింగ్ పద్ధతుల్లోనే నిర్వీర్యం చేయాలి. ఇందులో కొన్ని రీసైక్లింగ్ చేసినవి రోడ్డు నిర్మాణంలో వాడతారు. వీటిని లైసెన్సు ఉన్న కాంట్రాక్టరుకే ఇచ్చి రీ సైక్లింగ్ చేయాలి. పదునైన పరికరాలు: నీడిల్స్, సిరంజిలు, నీడిల్ కట్టర్లు, బర్నర్లు, బ్లేడ్లు ఇలా ఏవైనా విషపూరితమైనవి, పదునైనవి. వీటిని లీకేజీలేని తెలుపు రంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్ లేదా డ్రైహీట్ స్టెరిలైజేషన్ పద్ధతిలో కాల్చేయాలి. కాలుష్య నియంత్రణ మండలి గుర్తింపు ఉన్న సంస్థ ద్వారా నిర్వీర్యం చేయాలి. గ్లాస్వేర్ వేస్ట్: విషపూరిత గాజు వస్తువులు, మందుల వయెల్స్, మెడిసిన్ వయెల్స్ వంటివి. వీటిని నీలం రంగు డబ్బాలో మాత్రమే సేకరించాలి. వీటిని తిరిగి ఉపయోగించాలంటే డిటర్జంట్ లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేయాలి. బయో వ్యర్థాల నిర్వీర్యానికి కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ►బయో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు విధిగా జీపీఎస్ ఉండాలి. ►ఏ ఆస్పత్రిలో ఎంత బయో వ్యర్థాలు సేకరించిందీ కాంట్రాక్ట్ సంస్థ విధిగా వెబ్సైట్లో ఉంచాలి. ►వ్యర్థాలను సేకరించే పనివారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. ►వారికి గ్లౌజులు, ఎన్–95 మాస్కులు ఉండేలా చూసుకోవాలి. ►ఆయా వ్యర్థాలను తీసుకెళ్లే సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల పర్యవేక్షణ ఉండాలి ►వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలి. ►సేకరించిన వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్యం చేయాలి. కొత్త పాలసీ తీసుకొస్తాం ఎక్స్పెయిరీ మందులు చెత్తడబ్బాల్లోకి వెళ్లకుండా ఖచ్చితమైన నిర్వీర్య ప్రక్రియ చేపట్టేలా కొత్త పాలసీ తీసుకొస్తాం. దీనిపై వివిధ మాన్యుఫాక్చరింగ్, హోల్సేల్, రీటెయిలర్లతో మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం. – రవిశంకర్నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
కాలంచెల్లిన ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ల పంపిణీ
తొండంగి (తుని): స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో కాలం చెల్లిన ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు పంపిణీ చేశారని ఎ.కొత్తపల్లి గ్రామస్తులు ఆదివారం రాత్రి వాపోయారు. గ్రామంలో గొల్లపేట అంగన్వాడీ సెంటర్లో శనివారం అంగన్వాడీ కార్యకర్త కేంద్రంలో మహిళలకు ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అయితే ఈ ప్యాకెట్లను పరిశీలించగా 2016లో తయారయ్యాయి. రెండు సంవత్సరాలు కాలపరిమితి దాటి తర్వాత వీటిని పంపిణీ చేస్తున్నట్టు కాలిబోయిన ఏడు కొండలు, తాటిపర్తి ప్రసాద్, కడారి శ్రీనులు గమనించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పంపిణీ చేసిన ప్యాకెట్లను మహిళలు వినియోగించకుండా సేకరించామన్నారు. కాలం చెల్లిన ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు పసిపిల్లలకు, మహిళలకు పంపిణీ చేయడం వైద్యారోగ్య సిబ్బంది, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసువాలని కోరుతున్నారు. -
డాక్టర్కు మెమో.. ఇద్దరు నర్సులపై వేటు
⇒ గాంధీలో గడువు ముగిసిన మందుల కలకలం ⇒ విచారణకు కమిటీ సాక్షి, హైదరాబాద్: పురుగుల అవశేషాలు ఉన్న సెలైన్ ఎక్కించడంతో చిన్నారి సాయి ప్రవళిక మృతి చెందిన ఘటన ఇంకా మరువక ముందే సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఉదంతం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడతూ వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది చిన్నారులకు గడువు ముగిసిన ఇంజక్షన్ ఇవ్వడంతో శనివారం రాత్రి వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు అప్రమత్తమై విరుగుడు మందు ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమగ్ర విచారణ కోసం నిజామాబాద్ పిడియాట్రిక్ హెచ్వోడీ డాక్టర్ జార్జ్, నిలోఫర్ పిడియాట్రిక్ ప్రొఫెసర్ అలిమేలుతో కమిటీ వేసింది. రెండు రోజుల్లో తుది నివేదిక అందజేయాలని ఆదేశించింది. శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్ నవీన్సింగ్కి మెమో జారీ చేయగా, స్టాఫ్ నర్సులు శోభ, సునితపై అంతర్గత కమిటీ నివేదిక మేరకు సస్పెన్షన్ వేటు వేసింది. డీఎంఈ రమణి ఆదివారం ఆస్పత్రికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకరికే అనుమతి... శనివారం రాత్రి పిల్లలకు సెప్ట్రియాక్సోన్, ఎమాక్సెస్యాంక్లేవ్, వాంకోమైసిన్ యాంటీబయోటిక్ ఇంజక్షన్లు ఇచ్చామని, అరగంట తర్వాత వారికి చలి జ్వరం వచ్చిందని రమణి తెలిపారు. ఈ మూడు మందులను డ్రగ్ కంట్రోల్ బోర్డుకు పంపామని, గడువు తీరిన మందుగా మీడియాలో ప్రసారమైన మాక్స్ సెల్ఫ్ ఇంజక్షన్ పిల్లలకు వాడరని, గర్భిణులకు ఉపయోగించేదని తెలిపారు. ఇంజక్షన్ బాటిల్పై ప్రభుత్వ ముద్ర లేదని, దీన్నిబట్టి ఎవరో కావాలనే ఆస్పత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కోణంలో విచారణ చేపట్టామని, పోలీసులు, నిఘా వర్గాల సాయం కూడా కోరామన్నారు. తాజా ఘటన నేప థ్యంలో రోగికి సహాయకులుగా ఇకపై ఒకరినే అనుమతిస్తామని చెప్పారు. గాంధీ సూపరింటెండెంట్గా డాక్టర్ శ్రవణ్కుమార్ను నియమించనున్నామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement