-
స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొంటున్న జనం, ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డ్లు!
న్యూఢిల్లీ: భారత్ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్లను సృష్టిస్తుంది. తక్కువ కాస్ట్.. ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లు అందుబాటులోకి రావడంతో కొనుగోలు దారులు ఎగబడిమరి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021– 22) మొబైల్ ఫోన్ ఎగుమతులు రూ. 43,500 కోట్ల స్థాయిని అధిగమించవచ్చని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వెల్లడించింది. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీము దీనికి తోడ్పడగలదని పేర్కొంది. భారత్ నుంచి మొబైల్స్ ఎగుమతులు ఈ నెల తొలివారాని కల్లా 5.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 42,000 కోట్లు) చేరాయని ఐసీఈఏ వివరించింది. 2020–21 ఆఖరు నాటికి నమోదైన 3.16 బిలియన్ డాలర్లతో పోలిస్తే (దాదాపు రూ. 24,000 కోట్లు) ఇది 75 శాతం అధికమని పేర్కొంది. ‘మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి మొబైల్ ఫోన్ల ఎగుమతులు దాదాపు రూ. 43,500 కోట్ల స్థాయిని దాటగలవు‘ అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్లు, చిప్ల కొరత వంటి ఎన్నో సవాళ్లతో కుదేలైన పరిశ్రమ తిరిగి పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎక్కువగా దక్షిణాసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం.. తూర్పు యూరప్లోని కొన్ని దేశాలకు భారత్ నుంచి మొబైల్స్ ఎగుమతయ్యేవని మహీంద్రూ వివరించారు. అయితే, ప్రస్తుతం కంపెనీలు యూరప్, ఆసియాలోని సంపన్న మార్కెట్లను కూడా లక్ష్యంగా పెట్టుకుంటున్నాయని తెలిపారు. ‘ఈ మార్కెట్లకు ఎగుమతి చేయాలంటే అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. భారత్లోని తయారీ కేంద్రాలు ఇందుకు అనుగుణంగానే ఉంటున్నాయి‘ అని మహీంద్రు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ స్కీము కోసం అయిదు అంతర్జాతీయ కంపెనీలు (శాంసంగ్, ఫాక్స్కాన్ హోన్ హాయ్, రైజింగ్ స్టార్, విస్ట్రాన్, పెగాట్రాన్తో పాటు దేశీ సంస్థలు లావా, భాగ్వతి (మైక్రోమ్యాక్స్), ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, యూటీఎల్ నియోలింక్స్, ఆప్టీమస్ ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఎంపికయ్యాయి. -
పెరిగిన దేశీ తయారీ స్మార్ట్ఫోన్ల ఎగుమతులు
బెంగళూరు: ప్రతిష్టాత్మక ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 19.9 శాతంగా ఉన్న స్థానికంగా తయారైన స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రెండో త్రైమాసికంలో 24.8 శాతానికి పెరిగాయి. అంటే మొత్తం స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో 24.8 శాతం ఇండియాలో తయారైనవి లేదా అసెంబుల్ అయినవి వున్నాయి. సైబర్మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం మొత్తం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శాంసంగ్, స్పైస్ కంపెనీలకు ఇప్పటికే దేశంలో ప్లాంట్లు ఉన్నాయి. హెచ్టీసీ, జియోనీ వంటి కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement