-
ఏలియన్స్ సంచారం.. క్లారిటీ ఇచ్చిన వైట్హౌజ్
వాషింగ్టన్: ఒకవైపు గగనతలంలో చైనా నిఘా బెలూన్ల కూల్చేసిన అమెరికా.. అదే సమయంలో గుర్తుతెలియని వస్తువులనూ నేల కూల్చినట్లు ప్రకటించి యావత్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. పైగా గ్రహాంతర వాసుల చర్య, ఏలియన్ల పనే అనే కోణాలను కొట్టిపారేయలేమంటూ ఆ దేశానికే చెందిన ఓ అధికారి(మాజీ) వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది కూడా. ఈ తరుణంలో.. వైట్హౌజ్ స్పందించింది. ఏలియన్లు, గ్రహాంతర వాసులు, యూఎఫ్వోల వాదనను కొట్టిపారేసింది. కూలిన వస్తువులకు.. ఏలియన్లు, గ్రహాంతరజీవుల కదలికలకు సంబంధం లేదని వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు. ‘‘తాజా కూల్చివేతలపై వైట్హౌజ్ నుంచి వెలువడుతున్న సుస్పష్టమైన ప్రకటన ఇది. ప్రపంచ దేశాల్లో.. ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందరో ఆరాలు తీస్తున్నారు. కానీ, ఇది గ్రహాంతర వాసుల చర్య అనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇది మాత్రం క్లియర్ అని ప్రకటించారామె. పైగా ఆ సమయంలో.. ఏలియన్ సినిమాల పేర్లను ప్రస్తావించి ప్రెస్మీట్లో నవ్వులు పూయించారు కూడా. ఇక స్పై బెలూన్ల కూల్చివేత తర్వాత.. ఉత్తర అమెరికా ఎయిర్స్పేస్లో రెండు, కెనడా ఎయిర్స్పేస్లో ఒకటి.. గుర్తుతెలియని వస్తువులను యుద్ధవిమానాలతో నేలకూల్చేసింది అమెరికా సైన్యం. కానీ, అవి ఏంటన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఏలియన్లు, గ్రహాంతరవాసుల వాదన తెర మీదకు వచ్చింది. నేలకూల్చిన ఆ వస్తువులు కమ్యూనికేషన్కు సంబంధించి పరికరాలు కావని, అవి ప్రజలకు హాని కలిగించేవిగా కూడా లేవనే విషయం స్పష్టమైంది వైట్హౌజ్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ అవేంటో గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించారు. అయితే.. నేల కూల్చిన వస్తువుల శిథిలాలను ఇంకా తాము సేకరించలేదని యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ ఇదివరకే స్పష్టం చేశారు. అసలు అవి ఏంటి? వాటి స్వభావం.. ఇతర విషయాలను వాటిని సేకరించిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని పేర్కొన్నారాయన. -
ఆకాశంలో ఏమిటీ విచిత్రం?
న్యూయార్క్: శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే ఉంటున్నాయి. ఆకాశంలో అరుదుగా కొన్ని దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అయితే ఇవి ఏంటి అన్నది అంతుపట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి రాత్రివేళ గుండ్రని లోతు పళ్లెం ఆకారంలో, మరోసారి ఓ కాంతి సమూహంతో కూడిన దృశ్యం రంగులు, వేగం మారుతూ కనిపిస్తుంది. ఇంకోసారి ఎవరో నడచి వస్తున్నట్టుగా భ్రమ పడతాం. ఇలాంటి దృశ్యాలు చూసినపుడు ఒక్కోసారి వింతగాను, మరోసారి భయంగాను అనిపిస్తుంది. ఇలాంటి ఆకారాలను గుర్తించలేని ఎగిరే వస్తువులు (యూఎఫ్ఓ) గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈ చిత్రంలోని దృశ్యాన్ని గమనించండి. ఓ జింకపై ఏదో ఆకారం దిగుతున్నట్టుగా కనిపిస్తోంది కదూ! అమెరికాలోని మిసిసిపి కి చెందిన ఒక దంపతులు అడవిలో జింకలను రాత్రి వేళ చిత్రీకరించే ప్రయత్నంలో వారి కెమెరాలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే ఆ ఆకారం ఏంటన్నది మిస్టరీగానే మిగిలింది. ఇదే కాదు ఇలాంటి సంఘటనలు, ఫొటోలు అంతుపట్టని విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి మచ్చకు కొన్ని. అమెరికాలోని నార్త్ కరోలినాలో రంగురంగుల కాంతులు ఆవిష్కృతమయ్యాయి. టెక్సాస్లో రెడ్ లైట్లను ఎవరో క్రమపద్ధతిలో మారుస్తుంటారని అధికారులు విశ్వసిస్తారు. ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఏవో వింత దీపాలు ప్రత్యక్షమయ్యాయి. నదులు, సరస్సులపై ఎవో అద్భుత కాంతులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. రష్యాలో ఈ మద్య కొందరు ఆందోళనకారులు ప్రదర్శనను నిర్వహించారు. ఆ ప్రదర్శన చిత్రాల్లో ఏవో వింత వింత వస్తువులు కనిపించాయి. ఆందోళనకారుల పైన ఎవరో నిలుచున్నట్టు, వారే ఉద్యమకారులను నడపిపిస్తున్నట్టు అనిపించింది. అమెరికాలోని విండీ సిటీ లో ఒక పెద్ద సరస్సుపైన ఏవో వింత కాంతులు కెమెరాలో కనిపించాయి. ఇవన్నీ ఏవో గ్రహంతర వాసులా లేక ఇతర గ్రహాల నుంచి మనకు తెలియని ఏవో సందేశాలు మోసుకొస్తున్న దూతలా లేక కళ్ల ముందు కలిగిన భ్రమా అన్నది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పలేకపోతున్నారు. ఈ యుఫోల (యుఎఫ్ ఓలు) పై అమెరికా విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తోంది. అంతే కాదు దీని చుట్టూ అనేక సినిమాలు కూడా తయారయ్యాయి. హాలీవుడ్ సినిమాలైన ఈటీ, క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్, ది ఇండిపెండెన్స్ డే ల కథా వస్తువు గ్రహాంతర వాసులే. మన దేశంలోనూ క్రిష్, కోయి మిల్ గయా వంటి హిందీ సినిమాలు ఈ అంశంపైనే తయారయ్యాయి. మొత్తం మీద అమెరికాలో ఇప్పుడు ఈ వింత ఆకారాలపైన విస్తృత చర్చ జరుగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement