-
షూటింగ్లో ఏం కనిపించేది కాదు.. ప్రాణం పోయినంత పనైంది: అక్షయ్ కుమార్
Akshay Kumar About Stone Eye Lens In Bachchhan Pandey: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు ప్రాణం పెట్టి నటిస్తాడు. సన్నివేశం బాగా వచ్చేందుకు రియల్ స్టంట్స్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన్ను యాక్షన్ హీరో అని ముద్దుగా పిలుచుకుంటుంది బీటౌన్. 'సూర్యవంశీ', 'ఆత్రంగి రే' చిత్రాలతో అదరగొట్టిన అక్కీ ఇటీవల 'బచ్చన్ పాండే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళంలోని 'జిగర్తాండ' మూవీకి రీమేక్. ఇందులో ప్రజల్ని చంపే క్రూరమైన, కనికరం లేని గ్యాంగ్స్టర్ పాత్రతో అక్షయ్ కుమార్ అలరించాడు. ఆ పాత్రకి తగినట్లుగా అక్కీ వేషధారణ కూడా ఉంటుంది. మనసులేని బండరాయి వంటి మనిషిగా ఒక కన్నుకు 'స్టోన్ ఐ లెన్స్'తో క్రూరంగా అక్కీని చూపించారు. అయితే ఆ 'స్టోన్ ఐ లెన్స్' పెట్టుకోవడం అక్షయ్ను తీవ్ర ఇబ్బందికి గురి చేసిందట. ఇటీవల ఢిల్లీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'స్టోన్ ఐ లెన్స్'తో ఎలా ఇబ్బంది పడ్డాడో చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్. 'ఇది చాలా పెద్ద లెన్స్. నాకు నేను సొంతగా అమర్చుకోలేకపోయేవాన్ని. షూటింగ్ మొదటి రోజు ఆ లెన్స్ సెట్ చేసుకోవడానికి 15 నిమిషాలు పట్టింది. తర్వాత రోజు నుంచి 2-3 నిమిషాలు పట్టింది. కానీ ఆ లెన్స్ పెట్టుకున్నప్పుడు షూటింగ్లో నాకు ఏం కనిపించేది కాదు. నా చూపు అస్పష్టంగా ఉండేది. ప్రాణం పోయినంత పనైంది. సినిమా చిత్రీకరణ మొత్తం అలానే జరిగింది.' అని తెలిపాడు. 'బచ్చన్ పాండే' మార్చి 18న విడుదలై రూ. 13.25 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ను ప్రారంభించింది. రెండో రోజున రూ. 12 కోట్లు వసూలు చేసింది. సాజిద్ నడియద్వాలా నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి పర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించారు. -
కంటి లెన్స్ ధరలు తగ్గుతాయ్!
ధరలకు కళ్లెం వేయనున్న ఎన్పీపీఏ సాక్షి, అమరావతి: స్టెంట్ల ధరలను అదుపు లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) మరో కీలక అడుగు వెయ్య బోతోంది. కంటి లెన్స్లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరలపై కూడా నియంత్రణ విధించ నున్నట్లు ఫార్మాస్యూటికల్ వర్గాలు తెలిపా యి. వీటితోపాటు వెన్నుపూసకు వేసే స్క్రూలు, రాడ్లు, తుంటి∙ఎముకలో వేసే స్క్రూలు, మోకాలి కింద ఎముకలకు వేసే స్క్రూలు, రాడ్ల ధరలకు కళ్లెం వేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మోకాలి చిప్పల మార్పిడి ఖరీదైన వ్యవహారంగా మారిపో యింది. ఒక్క మోకాలి చిప్పను మార్చాలంటే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. మోకాలి చిప్ప మార్పిడి అనేది సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది. స్టెంట్ల ధరలు తగ్గినా బాదుడేనా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కంటికి లెన్స్లు వేయించుకుంటున్న వారిసంఖ్య ప్రతిఏటా లక్షల్లోనే ఉంటోంది. ఒక కంటికి లెన్స్ వేయించుకుంటే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ వసూలు చేస్తున్నారు. విదేశీ లెన్స్లని, దిగుమతి చేసుకున్నవని, బ్రాండెడ్ లెన్స్లని.. ఇలా రకరకాల కారణాలతో రోగుల జేబులను గుల్ల చేస్తున్నారు. రూ.2 లక్షల దాకా ఉన్న స్టెంట్ ధరను రూ.30 వేలకు నియంత్రించినట్టే, కంటి లెన్స్ల ధర కూడా రూ.4 వేల నుంచి రూ.5 వేల లోపు ఉండేలా చర్యలు తీసుకోవా లని భావిస్తున్నట్టు ఫార్మాస్యూటికల్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్పీపీఏ త్వరలో సమావేశమై, ధరల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. డ్రగ్ ఎల్యూటెడ్ స్టెంట్లను కూడా ఒక్కొక్కటి రూ.30 వేలకు మించి అమ్మకూడదని ఎన్పీపీఏ స్పష్టం చేసింది. అయినా సరే కార్పొరేట్ ఆస్పత్రులు రూ.2 లక్షల దాకా చార్జి చేస్తున్నాయి. ఈ దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని రోగులు కోరుతున్నారు. కచ్చితమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి ‘‘స్టెంట్ల ధరలను తగ్గించినా కార్పొరేట్ హాస్పిటళ్లు పాత ధరలనే వసూలు చేస్తుండడంతో రోగులు నష్టపో తున్నారు. ఆస్పత్రులు వసూలు చేస్తున్న ధరలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం కచ్చితమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకుంటే స్టెంట్లు, లెన్స్లు, స్క్రూలు, రాడ్ల ధరలను తగ్గించినా రోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ – డా.సాంబశివారెడ్డి,న్యూరోసర్జన్, సిటీ న్యూరో సెంటర్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
పెద్దంపేటలో ఈతవనం దహనం
‘జ్యోతిష్మతి’ విద్యార్థులతో వెబినార్
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఏఎంసీలో ధాన్యం చోరీ
మద్యం మత్తులో భార్యపై దాడి
పోలీసుల అదుపులో లక్కీ డ్రా నిర్వాహకులు
అట్టహాసంగా లయన్స్క్లబ్ మల్టికాన్
ప్రాణం తీసిన పాతకక్షలు
బీపీని నియంత్రిస్తేనే ఆరోగ్యం
తప్పక చదవండి
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
- రుణమాఫీపై నేడు నిర్ణయం
Advertisement