-
ఫలక్ నుమా రైలు ప్రమాదంపై పోలీసుల విచారణ వేగవంతం
-
ఫలక్నుమా రైలు ప్రమాదానికి అదే కారణమా.. రైల్వే అధికారులు ఏం చెప్పారంటే!
సాక్షి,యాదాద్రి/బీబీనగర్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఎస్–4లో షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయపల్లి– పగిడిపల్లి మధ్యన శుక్రవారం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలుకు జరిగిన అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు శనివారం ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు. రైల్వే శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ విభాగం సిబ్బంది బోగీలకు కింది భాగంలో గల బ్యాటరీలను క్షుణంగా పరిశీలించారు. బ్యాటరీల ద్వారా షార్ట్సర్క్యూట్ తలెత్తివుండవచ్చని అనుమానిస్తున్నారు. సిగరెట్ తాగి ప్రయాణికులు ఎవరైనా టాయిలెట్లలో పడివేయడంతో అగ్గి రాజుకుందా అన్న కోణంలో విచారణ చేయగా అలాంటి ఆనవాళ్లు లేనట్లు అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేశారు. 32విభాగాల అధికారుల విచారణ ఘటనపై 32 విభాగాలకు చెందిన రైల్వే, రాష్ట్ర పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఉంచిన కాలిపోయిన బోగీలను శనివారం సుమారు 50 మంది అధికారులు పరిశీలించారు. ఎస్–4 బోగీతో పాటు కాలిపోయిన అన్ని బోగీల బ్యాటరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజర్వేçషన్ బోగీల్లో సెల్ఫోన్ చార్జింగ్ సాకెట్లలో ఏమైనా స్పార్క్ వచ్చిందా, లేక రైలు చక్రాల కింద నిప్పు రవ్వలు లేచి బోగీ అంటుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, కాలిపోయిన బోగీల్లో అధికారులకు బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. అవి కాలిపోయి నల్లగా మారాయి. అలాగే లాప్టాప్, సెల్ఫోన్లు, సెల్ఫోన్ చార్జర్లు కాలిపోయి కన్పించాయి. -
ఫలక్నుమా ప్రమాదానికి కారణం అదే.. ఫోరెన్సిక్ నిపుణుల గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో శుక్రవారం ఉదయం మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ఇక ప్రయాణికులంతా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు.. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాద ఘటనపై క్లూస్ టీం దర్యాప్తు ముగిసింది. ప్రమాదంపై క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కాలిపోయిన బోగీలను ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించింది. ఎస్-4 బోగోలోని బాత్రూమ్ వద్ద పొగలు వ్యాపించినట్టు నిర్ధారణ చేశారు. ఎస్-4 బోగీలోని మంటలు ఇతర బోగీలకు వ్యాపించినట్టు తెలిపారు. బోగీలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్ నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. క్లూస్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘మోదీజీ.. గవర్నర్ తమిళిసైకు ఆ విషయం చెబితే బాగుండేది’ -
ఫలక్నుమా ప్రమాదానికి కారణం ఇదే!
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు శనివారం బీబీ నగర్కు చేరుకున్న క్లూస్ టీం.. దగ్ధమైన బోగీలను పరిశీలించింది. సమగ్ర దర్యాప్తునకు 12 మంది అధికారులతో కూడిన బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే పంపించగా .. ఈ టీం ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇదిలా ఉంటే.. ఎస్-4 కోచ్ బాత్రూమ్లో ముందుగా మంటలు చెలరేగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అయితే దర్యాప్తు పూర్తి అయ్యాకే ప్రమాదం వెనక కారణాలపై స్పష్టత ఇస్తామని క్లూస్ టీం అంటోంది. హౌరా నుంచి సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. శుక్రవారం ఉదయం నల్లగొండ దాటి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో.. రెండు బోగీల నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. అది గమనించి కొందరు ప్రయాణికులు కేకలు వేయడంతో.. రైలు నిలిచిపోయింది. ఇక ప్రయాణికులంతా దిగిపోయి పెను ప్రమాదం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా, రైలు నిర్వహణ సరిగా లేదా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
ఫలక్నూమా రైలులో మంటల కలకలం.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
కోల్కతా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నూమా ఎక్స్ప్రెస్(రైలు నెంబర్ 12703)లో ప్రయాణికులు మరో అరగంటలో గమ్యస్థానానికి చేరుకోబోతున్నామనే ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో భీతిల్లిపోయారు. శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత రైలు బొమ్మాయిపల్లి – పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్యకు రాగానే ఒక్క కుదుపుతో ఆగింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు ప్రయాణికులు కిందకు దూకి దూరంగా పరుగెత్తారు. ముందుగా ఒక బోగీ నుంచి మంటలు, పొగ రావడం చూసి అన్ని బోగీలలోని ప్రయాణికులు ఉన్నఫలంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. -సాక్షి, యాదాద్రి అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సెల్ఫోన్ చాటింగ్లో కొందరు, వస్తున్నామంటూ తమ బంధువులకు సమాచారం ఇచ్చే వారు మరికొందరు, నిద్రలో ఉన్నవారు ఇంకొందరు ఇలా ఎవరి పనుల్లో వారు ఉండగా.. బోగీలకు మంటలు వ్యాపించాయనే సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు రావడంతో అరుపులు, కేకలు పెట్టారు. ఏమైందో అర్ధంకాక, ఏం చేయాలో తెలియక, భయం ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు దిగి పరుగులు తీశారు. పొగల వెంట మంటలు వస్తుండడంతో ప్రాణాలతో బయటపడతామా అంటూ కొందరు ఏడుపు మొదలు పెట్టారు. రైలు ఆగడంతో ఒక్క ఉదుటున ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తినంతా కూడగట్టుకుని రైల్లోంచి కిందికి దూకారు. రైలు పక్కన ఉన్న ఎత్తయిన మట్టిదిబ్బలను ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. బతుకుజీవుడా అంటూ దొరికిన వాహనం పట్టుకుని గమ్యస్థానం వైపు వెళ్లిపోయారు. అయితే, ఈ ప్రమాదంలో తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో విలువైన లగేజీని మాత్రం రైల్లోని వదిలివేయడంతో మంటలకు కాలిబూడిదైంది. షార్ట్ సర్క్యూటో.. లేక ఎవరైనా కావాలని చేశారో, మానవ తప్పిదంతో జరిగిందో తెలియదు కానీ, పెద్ద ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు బోగీల నుంచి బయటకు దూకేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అత్యవసర కిటికీలో నుంచి బయటపడ్డారు. లగేజీ తక్కువగా ఉన్నవారు, మొత్తం లగేజీ లేని వారు ఒక్కో బ్యాగు ఉన్న వారు ముందుగా బయటపడ్డారు. ఓ వైపు మంటలు పెరిగిపోతున్నాయి.. బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తున్నాయి. మరో వైపు కిక్కిరిసిన ప్రయాణికుల నుంచి బయటపడాలి. ఇంకో వైపు బ్యాగులు వెంట తీసుకుపోలేక నానా యాతనపడ్డారు. చూస్తుండగానే మంటలు బోగీ లకు వ్యాపించాయి. ప్రయాణికులంతా అప్పటికే దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరెక్కడున్నారో తెలియని అయోమయం బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపిస్తుండడంతో ఒకరికొకరు కనిపించని భయానక పరిస్థితి, కుటుంబ సభ్యులు ఎక్కుడున్నారో తెలియని ఆందోళన. అయినా తమ ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదని బతికి బయట పడాలన్న తపనతో ధైర్యం చేశారు. ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుని తమ చేతికి అందిన లగేజీ బ్యాగులతో బయటపడ్డారు. బోగీ వెనక బోగీకి మంటలు చిన్నగా రేగిన మంటలు వరుసగా బోగీలకు వ్యాపించాయి. దట్టమైన పొగలతో పగిడిపల్లి ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది. ఎస్4, ఎస్5, ఎస్6, ఎస్3, ఎస్2 బోగీలు మంటలో చిక్కుకున్నాయి. మంటల ధాటికి ఇనుప చువ్వలు, సీట్లు, బోగి పైబర్ అన్ని కాలుకుంటూ బోగీ మొత్తం వ్యాపించాయి. ఒక దాని తర్వాత మరొకటి చొప్పున మొత్తం 5 బోగీలు కాలిపోయాయి. మరో రెండు బోగీలు స్వల్పంగా కాలిపోయాయి. మైనారిటీ గురుకుల విద్యార్థుల సహాయక చర్యలు రైలులో మంటలు చెలరేగిన ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్ శ్రీకాంత్ గుర్తించి మీడియా, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే పాఠశాల టీచర్లు, విద్యార్థులు వెంటనే స్పందించి ప్రయాణికులను రైలు నుంచి జాగ్రత్తగా దింపి వారికి సహాయపడ్డారు. వారందరిని మైనారిటీ పాఠశాలకు చేర్చి మంచినీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. ఆటోలో హైవే వరకు చేర్చటం, అలాగే మిగిలిన ప్రయాణికులకు, పోలీసులకు, సహాయక సిబ్బందికి భోజనం వసతి ఏర్పాటు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీఓ భూపాల్ రెడ్డి, పోలీసు అధికారులు పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు. సహాయక చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే ఫలక్నూమా రైలు అగ్ని ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. అధికారులతో ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. నా సర్టిఫికెట్లు కాలిపోయాయి నేను ప్రయాణం చేస్తున్న రైలు బోగి దగ్ధమైంది. నేను, మా అమ్మనాన్నతో కలిసి హైదరాబాద్కు వెళ్తున్నాం. మా వద్ద మొత్తం 9 లగేజీ బ్యాగులు ఉన్నాయి. భయంతో నాలుగు బ్యాగులు మాత్రమే తీసుకుని కిందికి దిగాం. పదవ తరగతి, ఇంటర్, ఇంజనీరింగ్ సర్టిపికెట్లు అన్నీ బ్యాగులోనే ఉన్నాయి. బ్యాగులన్నీ కాలిపోయాయి. అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్కు నా బాధను చెప్పాను. సర్టిఫికెట్లు జారీ కోసం సహాయం చేస్తాని హామీ ఇచ్చారు. – యశ్విత, ప్రయాణికురాలు, ఒడిశా చైన్ లాగి కిందికి దూకిన రాజు రైలులో పొగలు, మంటలు చెలరేగుతుండడంతో ప్రమాదాన్ని పసిగట్టి అందులో ప్రయాణిస్తున్న రాజు అనే ప్రయాణికుడు రైలు చైన్ లాగి పక్కనే ఉన్న తన తల్లితో చెప్పి కిందికి దూకేశాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. స్పృహతప్పి కింద పడిపోయాడు. పోలీస్లు రాజును భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. సమన్వయంతో అదుపులోకి – కలెక్టర్ పమేలా సత్పతి అన్ని శాఖల సమన్వయంతో మంటలు ఆర్పినట్లు భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులకు ఆహార సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాచకొండ సీపీ ఆధ్వర్యంలో.. రైలు అగ్నిప్రమాదానికి గురైన ప్రదేశాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సందర్శించారు. రైల్వే శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, ఇతర అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement