-
కేజీ-డీ5లో ఓఎన్జీసీ 40 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) కృష్ణా గోదావరి బేసిన్ బ్లాక్ కేజీడీ5లో గ్యాస్, చమురు నిక్షేపాల అభివృద్ధి కోసం రూ. 40,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. 2018-19 నాటికల్లా ఉత్పత్తి సాధించే దిశగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్ దినేష్ కె. సరాఫ్ గురువారం తెలిపారు. ఒకే ప్రాంతంలో ఇంత అత్యధిక పెట్టుబడిని ఓఎన్జీసీ ప్రతిపాదించడం ఇదే ప్రధమం. ఇందుకు సంబంధించి క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక (ఎఫ్డీపీ)ని ఈ ఆర్థిక సంవత్సరం రె ండో త్రైమాసికంలోగా ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన వివరించారు. -
రిలయన్స్ను డిఫాల్టర్గా ప్రకటించాలి
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో ఒప్పందాలమేరకు క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ)లను అమలు చేయడంలో విఫలమైన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)పై పార్లమెంటరీ కమిటీ ధ్వజమెత్తింది. కంపెనీ కాంట్రాక్టును ఉల్లంఘించినట్టు(డీఫాల్టర్)గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ‘కాంట్రాక్టులో వాగ్దానం చేసినట్లుగా 50 బావులను కేజీ-డీ6 బ్లాక్లో తవ్వకపోవడంవల్లే గడిచిన మూడేళ్లలో ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోయేందుకు దారితీసింది. కేంద్రం ఆమోదించిన ఎఫ్డీపీను అమలుచేయకపోవడాన్ని వైఫల్యంగా కాకుండా డిఫాల్ట్గానే పరిగణించాలి. దీనిపై చమురు శాఖ తప్పకుండా చర్యలు చేపట్టాల్సిందే’ అని పెట్రోలియం, సహజవాయువులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగా, కేజీ-డీ6లో ఉత్పత్తి పెంచేందుకు తగిన చర్యలను అన్వేషించాలని కూడా కమిటీ చమురు శాఖకు సూచించింది. 2010-11లో సగటున రోజుకు 55.89 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్సీఎండీ) స్థాయిలో కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి జరగగా... 2011-12లో ఇది 26.18 ఎంఎంఎస్సీఎండీలకు దిగజారింది. తాజాగా ఇక్కడి గ్యాస్ ఉత్పత్తి ఆల్టైమ్ కనిష్టమైన 12 ఎంఎంఎస్సీఎండీలకు క్షీణించింది. అయితే, బావుల్లోకి నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళిక కారణాలే గ్యాస్ ఉత్పత్తి పడిపోవడానికి కారణమని రిలయన్స్ వాదిస్తుండగా... తగినన్ని బావులను తవ్వకపోవడమే కారణమంటూ నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) పదేపదే చెబుతూవస్తోంది. డీజీహెచ్ నియమించిన నిపుణుల కమిటీ కూడా కేజీ-డీ6లో గ్యాస్ నిల్వలు అంచనాల మేరకు(10 ట్రిలియన్ ఘనపుటడుగులు) ఉన్నాయని, పరిష్కార చర్యలు చేపడితే ఉత్పత్తి పెరుగుతుందని స్పష్టం చేసింది కూడా. అయితే, రిలయన్స్ ఎలాంటి దిద్దుబాటు చర్యలూ చేపట్టలేదని కమిటీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement