-
గ్రాసం కరువై..పోషణ బరువై
చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. చివరికి పశువులకూ గ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు గ్రాసం కోసం సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలను ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడి నుంచి గడ్డిని కొనుగోలు చేసి తీసుకురావాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం గ్రాసం కొరతను అధిగమించేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు. కొందరు రైతులు విధిలేని పరిస్థితిలోపశువులను కబేళాలకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడి రైతులకు పంటల తర్వాత ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమే. మొత్తం 6.48 లక్షల రైతు కుటుంబాలు ఉంటే, వాటిలో దాదాపు 5.60 లక్షల రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం ఆవులు 10.20 లక్షలు, గేదెలు 84,605, మేకలు 4,29,014, గొర్రెలు 12,49,460 మేరకు ఉన్నాయి. రోజుకు ఒక ఆవుకు 5 కిలోల మేరకు వరిగడ్డి అవసరం ఉంటుంది. ఈ లెక్కన మొత్తం పశువులకు రోజుకు 5,500 టన్నుల మేరకు వరిగడ్డి అవసరం ఉంటుంది. అయితే జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం రైతుల వద్ద మరో రెండు వారాలకు మాత్రం సరిపడే గడ్డి మాత్రమే నిల్వ ఉంది. దీంతో పాడి రైతులు పశువులను కాపాడుకునేందుకు గడ్డి కోసం పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణంగా ఏటా తూర్పు మండలాల్లో రబీ సీజనులో కొంతమేర వర్షాలు కురిసి రైతులు పంటలు సాగు చేస్తారు. అందులో అధికంగా దాదాపు 42 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వరి పంటను ప్రధానంగా సాగులోకి తీసుకువస్తారు. దీంతో ఆ ప్రాంతాల్లోని పశువులకు వరిగడ్డి సమస్య తలెత్తేది కాదు. జిల్లాలోని పడమటి మండలాల్లో వరిగడ్డి సమస్య ఉత్పన్నమైనా పాడి రైతులు తూర్పు మండలాలకు వెళ్లి కొనుగోలు చేసుకుని తెచ్చుకునేవారు. అయితే ఈ ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావం కారణంగా తూర్పు మండలాల్లో కనీసం మేరకు కూడా వర్షపాతం నమోదు కాలేదు. దీంతో అక్కడి రైతులు పంటలు సాగు చేయలేకపోయారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో కూడా వరిగడ్డి సమస్య ఉత్పన్నమైంది. కొనలేని స్థితి.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పాడి రైతులు తమిళనాడు, కర్ణాటకలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ట్రాక్టర్ గడ్డిని రూ.15 వేల నుంచి రూ.17 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా కొనుగోలు చేసిన గడ్డిని ట్రాక్టర్లకు లోడ్ చేసేందుకు కూలీలకు రూ.5 వేలు, అక్కడి నుంచి గ్రామాలకు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్కు రూ.5 వేలు చొప్పున ఖర్చవుతోంది. దీంతో ట్రాక్టర్ వరిగడ్డిని తీసుకురావాలంటే మొత్తం రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. ట్రాక్టర్కు రెండు టన్నుల మేరకు మాత్రమే గడ్డిని నిపంపడం సాధ్యమవుతుంది. ఈ లెక్కన కిలో గడ్డి రూ.10 నుంచి రూ.11 వరకు ఖర్చవుతోంది. ఒకరోజుకు ఒక ఆవుకు 5 కిలోల చొప్పున వరిగడ్డి అవసరం ఉంటుంది. దీంతో ఒకరోజు ఒక ఆవును పోషించాలంటే కేవలం గడ్డికి మాత్రమే రూ.50 నుంచి రూ.60 వరకు వెచ్చించాల్సి ఉంది. ఇలాంటి అధిక ఖర్చులను వెచ్చించి గడ్డిని కొనలేక పశువులను పోషిం చుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేసి పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖర్చులను భరించలేని రైతులు ఆవులు, గేదెలను సంతల్లో అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కానరాని పశుగ్రాస క్షేత్రాలు.. జిల్లాను పాల కేంద్రంగా మార్చాలన్నదే ధ్యేయమంటూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు గుప్పించింది. అయితే కరువు పరిస్థితుల్లో పశువులకు అవసరమైన గడ్డిని ఏర్పాటు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అంటూ ఊదరగొట్టినా ఆచరణలో కానరావడం లేదు. కనీసం పశుగ్రాసం విత్తనాల పంపిణీ కూడా చేయడం లేదు. తగ్గిన పాల ఉత్పత్తి.. జిల్లాలో మొత్తం పాడి ఆవులు 10.20 లక్షలు ఉండగా, గేదెలు 84 వేల వరకు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 3.75 లక్షల ఆవులు, 35 వేల గెదేలు పాలిస్తున్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది జనవరిలో రోజుకు 32 లక్షల లీటర్ల మేరకు పాల దిగుబడి అయ్యేది. అయితే ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా గడ్డి కొరత తీవ్రరూపం దాల్చింది. దీంతో దీనికి తోడు వేసవి తాపం తోడైంది. ఫలితంగా పశువుల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో పాడి రైతులకు ఆదాయం రోజురోజుకు తగ్గుముఖం పట్టింది. ఇలాంటి దుర్భర స్థితిలో పశువులను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు చేసి పశువులను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మాది బైరెడ్డిపల్లె మండలం, నాపేరు వేణుగోపాల్రెడ్డి. నాకు నాలుగు పశువులు ఉన్నాయి. వాటిని పోషించుకునేందుకు గడ్డి లేకపోవడంతో శ్రీకాళహస్తి మండలం నుంచి ట్రాక్టర్ గడ్డి రూ.16 వేలకు కొనుగోలు చేశాం. గడ్డిని ట్రాక్టర్కు లోడ్ చేసేందుకు కూలీలకు రూ.5 వేలు, ట్రాక్టర్ బాడుగ మరో రూ.5 వేలు ఖర్చవుతోంది. ఇలాంటి పరిస్థితి ప్రతి పాడి రైతుకూ ఉంది. ప్రభుత్వం స్పందించాలి. -
‘విషతుల్యం’పై సీరియస్
- ‘సాక్షి’ కథనంపై స్పందించిన యంత్రాంగం - మద్యం వ్యర్థాల సరఫరాపై ఎస్ఓటీ పోలీసుల నిఘా - ఇబ్రహీంపట్నంలో ట్యాంకర్ సీజ్ - నమూనాలను ల్యాబ్కు తరలించిన అధికారులు - రెండురోజుల్లో రిపోర్టు: ఆర్జేడీ వరప్రసాద్రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: పశువుల దాణాలో మద్యం వ్యర్థాలను కలుపుతున్న వ్యవహారంపై ఆగస్టు 24న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అమృతాహారం విషతుల్యం’ కథనానికి యంత్రాంగం స్పందించింది. మద్యం వ్యర్థాలను విక్రయించడంపై నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలో అనుమానాస్పద వ్యర్థ పదార్థాలను విక్రయిస్తున్న ట్యాంకర్ను పట్టుకున్నారు. అందులో మద్యం సంబంధిత వ్యర్థాలున్నట్లు ప్రాథమికంగా తేల్చిన అధికారులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ట్యాంకర్ యజమానులపై కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ ల్యాబ్కు నమూనాలు.. ఇదిలా ఉండగా.. మద్యం వ్యర్థాల అంశాన్ని సీరియస్గా తీసుకున్న పశుసంవ ర్థక శాఖ అధికారులు పూర్తిస్థాయి పరిశీలనకు ఉపక్రమించారు. దాణాలో కలిపే మద్యం వ్యర్థాలకు సంబంధించిన నమునాలను సేకరించి వాటిని విశ్లేషించేందుకు రాజేంద్రనగర్లోని జయశంకర్ యూనివర్సిటీలో ఉన్న వెటర్నరీ ల్యాబ్కు పంపించారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన రిపోర్టు వస్తుందని, వాటిని పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వరప్రసాద్రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement