-
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
మల్యాల(చొప్పదండి): నడుస్తున్న ట్రాక్టర్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అట్ల అంజవ్వ, నారాయణరెడ్డి దంపతులు కూలీపని చేస్తుంటారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు రాజు(15) ఉన్నాడు. ఐదోతరగతి వరకు చదివిన రాజు ట్రాక్టర్పై కూలీపనికి వెళ్తుండేవాడు. గురువారం ఉదయం ట్రాక్టర్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించేలోపు మార్గంమధ్యలో మృతిచెందాడు. మానవత్వం చూపిన సైనికుడు.. రాజు గాయపడడం చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఆర్మీసైనికుడు దూడ తిరుపతి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. మల్యాల వ్యవసాయ మార్కెట్ సమీపంలోకి చేరుకోగా, అక్కడి నుంచి 108లోకి తరలించారు. రాజు అప్పటికే మృతిచెందాడని సిబ్బంది నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి అంజవ్వ రాజు మృతదేహంపై పడి ఏడ్చిన తీరు అందరినీ కలచివేసింది. తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదుచేసినట్లు ఎస్సై నీలం రవి తెలిపారు. -
హమ్మయ్య..
ఒంగోలు క్రైం: జిల్లాలోనే సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నగరానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి గుర్రం ప్రణవ్ గురువారం సాయంత్రం కిడ్నాపైన విషయం తెలిసిందే. ఏడు గంటల్లోపే పోలీసులు బాలుడిని రక్షించి నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలంయలోని ఐటీ కోర్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కిడ్నాప్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో పాల డెయిరీ నిర్వహిస్తున్న గుర్రం ప్రసాద్ ఒంగోలు నగరం లాయర్పేటలో నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమారుడు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లారు. రాత్రి ఏడు గంటలకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే గురువారం అర్ధరాత్రి రెండు గంటలకే కిడ్నాప్కు గురైన బాలుడిని పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి తండ్రి ప్రసాద్ వద్ద గతంలో డ్రైవర్గా పనిచేసిన ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ వసీం అక్రమ్ ప్రధాన నిందితుడిగా గుర్తించి కటకటాల వెనక్కి నెట్టారు. బాలుడి తండ్రిని రూ.70 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు ఆ డబ్బులు తీసుకునేందుకు గుంటూరు నగర శివారు ఫ్లయి ఓవర్ వద్దకు వచ్చారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలేనికి చెందిన బోడా పవన్ సాయికుమార్ను పోలీసులు వలపన్ని పట్టుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన మాజీ డ్రైవర్ షేక్ వసీం అక్రమ్తో పాటు బంగారం పనిచేస్తున్న లాయర్పేటకు చెందిన ఆదిమూలపు ఈశ్వరాచారి (ఇతనే బాలుడిని కారులో బలవంతంగా ఎక్కించింది), ఒంగోలు బాలాజీ నగర్కు చెందిన పాండురంకి ధనుంజయరావు, ప్రధాన నిందితునికి తెలిసిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వీరంతా ముందు రోజు గద్దలగుంట పరిసరాల్లో రహస్య ప్రదేశంలో ఉండి పథక రచన చేశారు. రెండు బ్యాచ్లుగా ఏర్పడిన నిందితులు బాలుడిని కిడ్నాప్ చేసిన షేక్ వసీం అక్రమ్ ముఠా రెండు బ్యాచ్లుగా ఏర్పడ్డారు. ఫోన్ చేసి డబ్బులు కోసం బెదిరిస్తోంది ఒక బ్యాచ్. బాలుడిని కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తరలించింది మరో బ్యాచ్. బాలుడిని కిడ్నాప్ చేసిన తర్వాత బాలుడి ఇంటి వద్ద ఒక మహిళను రహస్యంగా కాపలా పెట్టారు. కారులో డబ్బు తీసుకొని ప్రసాద్తో పాటు మరో వ్యక్తి తన ఇంటి వద్ద కారు ఎక్కితే వెంటనే ఆ మహిళ నిందితులకు ఫోన్ చేసింది. వంటరిగా రమ్మంటే కారులో మరో వ్యక్తి ఎందుకు వస్తున్నారంటూ కిడ్నాపర్లు మళ్లీ బాలుడి తండ్రికి ఫోన్ చేశారు. అంటే కిడ్నాపర్లు ఎంతటి నెట్వర్క్ ఉపయోగించారో అర్థమైంది. ఆ తర్వాత రూ.70 లక్షలు కాకున్నా ఎంతో కొంత తొలుత ఇవ్వాలని, లేకుంటే బాలుడిని చంపేస్తామని బెదిరించడం ప్రాంరంభించారు. ప్రసాద్ ఫోన్ బిజీ వస్తే ఏం పోలీసులకు ఫోన్ చేస్తున్నావా.. అయితే నీ కుమారుడు నీకు దక్కడని బెదిరించారు. చివరకు గుంటూరు నగరం శివారులో ఫ్లయి ఓవర్ వద్ద డబ్బు కోసం వచ్చిన పవన్ సాయి కుమార్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎనిమిది పోలీస్ బృందాలు వలపన్ని పట్టుకున్నారు. అతడితో బాలుడు ఉన్న కిడ్నాపర్లకు పోలీసులు ఫోన్ చేయించారు. బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడాలని, లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని డీఎస్పీ బి.శ్రీనివాసరావు కిడ్నాపర్లను హెచ్చరించడంతో అర్ధరాత్రి 2.30 నుంచి 3 గంటల మధ్యలో ఇంటికి సమీపంలో బాలుడిని వదిలి పారిపోయారు. పోలీసులకు అభినందనలు ఏడు గంటల్లోపే బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఒన్టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్, రూరల్ సీఐ ఎం.మురళీకృష్ణ, ఎస్ఐలు నాయబ్ రసూల్, మస్తాన్వలి, ప్రసాద్, రాజారావు, సురేష్, ఖాదర్ బాషా, ఏఎస్ఐ బాబూరావు, హెచ్సీ మాల్యాద్రి, కానిస్టేబుళ్లు అహ్మద్ బాషా, రమేష్, సురేష్తో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నగదు బహుమతులు అందించి ప్రోత్సహించారు. ఎస్పీకి కృతజ్ఞతలు: ప్రసాద్, బాలుడి తండ్రి మా కుమారుడిని సురక్షితంగా అప్పగించిన ఎస్పీ బి.సత్య ఏసుబాబుకు కృతజ్ఞతలు. కిడ్నాపర్లు డబ్బులు తీసుకురమ్మన్న చోటుకు అర్ధరాత్రి 12 గంటలకు చేరుకున్నాం. నేను ఒంటరిగా కారు నడుపుకుంటూ వెళ్తుంటే వెనుక సాధారణ వ్యక్తులు మాదిరిగా ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు బృందం నన్ను అనుసరించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు విపరీతమై చలిని కూడా లెక్కచేయకుండా డీఎస్పీ, ఆయన సిబ్బంది మా బిడ్డను కాపాడేందుకు పడిన కష్టం చెప్పలేనిది. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టిన అందరికీ కృతజ్ఙతలు. -
బాలుడి జననాంగంపై కొట్టిన ఉపాధ్యాయుడు
రాజమండ్రి : ఓ ఉపాధ్యాయుడు అయిదో తరగతి విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో అతడి జననాంగానికి గాయమై నెత్తురోడింది. వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రిలోని సొసైటీ బిల్డింగ్ ప్రాంతానికి చెందిన ఆర్. శ్యామ్, దేవి దంపతుల కుమారుడు పృథ్వీరాజ్ స్థానిక నారాయణ స్కూలులో అయిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూలు అయిపోయాక పృథ్వీరాజ్ మెట్లైపై నుంచి వేగంగా దిగుతుండడంతో ఆంగ్ల ఉపాధ్యాయుడు జి. సురేంద్ర శ్రీనివాస్ ఆగ్రహించి విద్యార్థి జననాంగంపై చేతితో కొట్టడంతో గాయమై, రక్తం స్రవించింది. ఇంటికి వచ్చిన కుమారుడి నిక్కరు రక్తంతో తడి సి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. జరిగింది తెలుసుకుని కుమారునికి వైద్యం చేయించారు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం వల్ల గతంలో పిల్లలు గొడవపడి తమ బిడ్డ తలకు తీవ్రగాయమైందని, కొద్దిపాటిలో కన్ను పోయి ఉండేదని శ్యామ్, దేవి మీడియా వద్ద వాపోయారు. విషయం తెలిసిన డీఐ ఎ. తులసీదాస్ స్కూలుకు వచ్చి తల్లిదండ్రులు, స్కూలు నిర్వాహకులతో మాట్లాడారు. జరిగిన సంఘటనకు బాధ్యుడైన ఉపాధ్యాయుడిపైనా, స్కూలుపైనా తగిన చర్యలు తీసుకుంటామని డీఐ హామీ ఇచ్చారు. కాగా ఉపాధ్యాయుడు కొట్టడం వాస్తవం కాదని, విద్యార్థే మెట్ల మీంచి పడిపోయాడని స్కూలు నిర్వాహకులు అంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement