-
ఓపీఎస్తో అధోగతే..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) నుంచి ప్రభుత్వోద్యోగులు పాత పెన్షన్ స్కీముకు (ఓపీఎస్) మారితే రాష్ట్రాలు అథోగతి పాలవుతాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయన నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. ఇదే జరిగితే భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని.. వారి ప్రయోజనాల విషయంలో రాజీపడటమేనని ఆర్బీఐ నివేదిక హెచ్చరించింది. ఇటీవల కొన్ని రాష్ట్రాలు ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్కు మారుతామని చెబుతున్న నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ భారం, ఓపీఎస్కు మారితే భవిష్యత్లో పెరిగే పెన్షన్ల వ్యయం, తద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బేరీజు వేస్తూ ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఓపీఎస్కు వెళ్లడమంటే ఆర్థిక సంస్కరణల్లో వెనుకడుగు వేయడమేనని తేల్చిచెప్పింది. అలాగే, ఓపీఎస్కు మారడంవల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెనుభారం పడుతుందని పేర్కొంది. అదే జరిగితే రాష్ట్రాల మొత్తం పెన్షన్ భారం 2023 మార్చి చివరి నుంచి 2084 మార్చి చివరి వరకు సగటున 4.5 రెట్లు పెరుగుతుందని ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇది 4.3 రెట్లు ఉంటుందని తెలిపింది. దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం.. మరోవైపు.. 2022 నవంబర్ నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎన్పీఎస్ ఉద్యోగుల సంఖ్య 50 లక్షలు ఉందని, వీరి ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ కార్పస్ ఫండ్ రూ.2.5 లక్షల కోట్లు ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వీరి సంఖ్య రెండున్నర లక్షలు ఉందని.. ఇప్పటికే ఏపీ సొంత రెవెన్యూ రాబడిలో పెన్షన్లకు 24 శాతం వ్యయమవుతోందని, ఓపీఎస్కు మారితే పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఇది మూలధన వ్యయాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు తీరని నష్టం కలిగిస్తుందని కూడా ఆర్బీఐ హెచ్చరించింది. ప్రస్తుతం ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగులు రిటైరయ్యాక చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్ పొందుతారని, డియర్నెస్ రిలీఫ్ రివిజన్ల ప్రయోజనాన్ని కూడా పొందుతారని తెలిపింది. అయితే, ఉద్యోగులకు ఓపీఎస్ విధానం ఆకర్షణీయంగా ఉండవచ్చుగానీ ప్రభుత్వాల మీద అపారమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని, తద్వారా భవిష్యత్ సంవత్సరాల్లో ప్రభుత్వ పెన్షన్ బాధ్యతలను మరింత పెంచుతుందని నివేదిక స్పష్టంచేసింది. ఓపీఎస్కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ భారం 2040 నుంచి 2060 వరకు భారీగా పెరుగుతుందని, ఇది దేశ జీడీపీలో 0.9 శాతానికి చేరుకుంటుందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో పెన్షన్లు చెల్లించడమే కష్టం.. ఇక ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్కు మారితే మొత్తం రాష్ట్రాల పెన్షన్ల వ్యయం 2023 నుంచి పెరగడం ప్రారంభమై 2045 నాటికి లక్ష కోట్లకు చేరుతుందని, 2057 సంవత్సరం నాటికి రూ.1.80 లక్షల కోట్లకు పెరుగుతుందని.. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారం కానుందని ఆ నివేదిక తెలిపింది. భవిష్యత్లో పెన్షన్లను చెల్లించడమే చాలా కష్టతరం కావచ్చునని వ్యాఖ్యానించింది. అంతేకాక.. ఓపీఎస్కు వెళ్తే భవిష్యత్ తరాల ప్రయోజనాల విషయంలో రాజీపడటమే అవుతుందని, ఇది రాష్ట్రాలకు మంచిది కాదని ఆర్బీఐ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్ను 14 శాతానికి పెంచిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 14 శాతానికి పెంచాల్సి ఉందని తెలిపింది. -
భారత్ బ్యాంకింగ్ పటిష్టం
ముంబై: ప్రపంచ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ వ్యవస్థలు స్థిరంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బ్యాలెన్స్ షీట్స్లో ఎట్టి పరిస్థితుల్లో అసమతౌల్యత రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య కూడా తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. డాలర్ పెరిగిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా తోటి కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి ఒడిదుడుకులు స్వల్పంగానే ఉన్నాయన్నారు. కొచ్చిలో జరిగిన 17వ కేపీ హోర్మిస్ (ఫెడరల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు) స్మారక ఉపన్యాసంలో దాస్ మాట్లాడారు. ప్రపంచ మాంద్యం గురించి కొన్ని నెలల క్రితం తీవ్ర ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దృఢత్వం చూపిందని, క్లిష్టతలను తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు. కఠిన ద్రవ్య పరిస్థితులు తగ్గాయని అన్నారు. జీ20 భారత్ ప్రెసిడెన్సీలో మరింత సమగ్ర ప్రపంచ ఆర్థిక పురోగతి సాధనకు కృషి జరగాలన్నారు. ఆర్థిక సేవలు అందరికీ చేరువకావడం, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి ఇందుకు అవసరమని పేర్కొన్నారు. -
వృద్ధి పరుగు ఇక గ్యారంటీ
* మేక్ ఇన్ ఇండియాపై టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ * అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఉద్యోగులకు సూచన న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో రాబోయే సంవత్సరాల్లో ఇక వృద్ధి మళ్లీ పరుగులు పెట్టగలదని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. భౌగోళిక..రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగానూ, అనూహ్యంగానూ మారిపోతున్న తరుణంలో అనేక అవకాశాలు తెరపైకి వస్తున్నాయన్నారు. అయితే, దానికి సమానంగా అనేక సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న విధానపరమైన చర్యలు, వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న మార్గం..ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో వృద్ధి మళ్లీ పుంజుకోగలదని ఆయన తెలిపారు. బుధవారం గ్రూప్లోని 5.82 లక్షల మంది ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో మిస్త్రీ ఈ విషయాలు పేర్కొన్నారు. గడచిన ఏడాదిపై సింహావలోకనం చేస్తూ.. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో రెండు భిన్నమైన వృద్ధి ధోరణులు కనిపిస్తున్నాయని మిస్త్రీ వివరించారు. అమెరికా, బ్రిటన్ వంటి కొన్ని దేశాలు మెల్లగా రికవరీ సంకేతాలు కనపరుస్తుండగా.. చైనా, యూరప్ వంటి భారీ ఆర్థిక వ్యవస్థలు అంచనాలను అందుకోలేకపోయాయని ఆయన తెలిపారు. టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి .. ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలు మారిపోతుండటంతో.. గ్రూప్ సంస్థలన్నీ కొంగొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని, తదనుగుణమైన సేవలు అందించాలని ఉద్యోగులకు మిస్త్రీ సూచించారు. ప్రస్తుతం డిజిటల్ రంగంలోనూ, భౌతికంగానూ కొత్త టెక్నాలజీలు.. అత్యంత వేగంగా వ్యాపార ముఖ చిత్రాన్ని మార్చివేస్తున్నాయని చెప్పారు. కాబట్టి డిజిటైజేషన్, బిగ్ డేటా అనలిటిక్స్ మొదలైన వాటిపై అవగాహన మరింత పెంచుకోవాలని.. నవకల్పనలపై దృష్టి సారించాలని మిస్త్రీ తెలిపారు. ఇందుకోసం గ్రూప్ కూడా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింత ఇన్వెస్ట్ చేయడం కొనసాగిస్తుందని వివరించారు. ప్రస్తుతం పోటీ కారణంగా మార్జిన్లపై ఒత్తిడి పెరిగిపోతున్నందున.. గ్రూప్ కంపెనీలు పరస్పరం అనుభవాలను పంచుకోవడంతో పాటు అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టార్గెట్ 2025 .. కస్టమర్ల జీవన విధానాలను మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్న తమ నిబద్ధతతో వచ్చే పదేళ్లలో ప్రపంచ జనాభాలో 25 శాతం మందికి చేరువ కాగలమని 2025 నాటికి టాటా గ్రూప్ నిర్దేశించుకున్న లక్ష్యాలను మిస్త్రీ తెలిపారు. ఫలితంగా అంతర్జాతీయంగా 25 అత్యంత ప్రశంసనీయ కార్పొరేట్ బ్రాండ్స్లో ఒకటిగా టాటా గ్రూప్ ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. అప్పటికి ప్రపంచంలోనే 25 అత్యంత విలువైన కంపెనీలతో పోల్చతగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించగలమన్నారు. దీన్ని సాకారం చేసుకోవాలంటే టాటా గ్రూప్లోని ప్రతి కంపెనీ కూడా కస్టమర్ ప్రధానంగా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. 2014లో టాటా బ్రాండ్ అత్యంత విలువైన బ్రాండ్లలో 34వ స్థానాన్ని దక్కించుకుందని, అంతర్జాతీయంగా 60 గ్లోబల్ సంస్థలకు పోల్చతగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉందని వివరించారు. మరోవైపు మహిళా ఉద్యోగుల సాధికారతకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని..ఇందులో భాగంగానే టాటా లీడ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో గ్రూప్లో నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య మరింత పెరగగలదని మిస్త్రీ చెప్పారు. గ్రూప్లోని 1,40,000 మహిళా ఉద్యోగులు సంస్థ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారని కితాబిచ్చారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ కంపెనీ ఉద్యోగులు మరింత చురుగ్గా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement