-
అరంగేట్రంలో అత్యధిక స్కోరు
ఇండోర్: మధ్యప్రదేశ్ ఓపెనర్ అజయ్ రొహెరా బరిలోకి దిగిన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (267 నాటౌట్) సాధించి రికార్డు పుటల్లోకెక్కాడు. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్తో జరిగిన రంజీ మ్యాచ్లో 21 ఏళ్ల అజయ్ (345 బంతుల్లో 267 నాటౌట్; 21 ఫోర్లు, 5 సిక్స్లు) ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి మ్యాచ్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు ముంబై ఆటగాడు అమోల్ మజుందార్ (260; హరియాణాపై 1994లో) పేరిట ఉండేది. అజయ్, యశ్ దూబే (139 నాటౌట్; 18 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ను 562/4 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాట్స్మెన్ మరోసారి సమష్టిగా చేతులెత్తేయడంతో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 185 పరుగులకే కుప్పకూలింది. దీంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 253 పరుగులతో విజయం సాధించింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 124 పరుగులకే ఆలౌటైంది. -
పంత్ పరుగులు పనికిరావా!
ఈ సీజన్లో విశేషంగా రాణించిన ఢిల్లీ క్రికెటర్ రంజీ ట్రోఫీలో పలు రికార్డులతో టాప్ స్కోరర్ అవకాశం ఉన్నా కరుణించని సెలక్టర్లు ►మొదటి ఆటగాడు 9 ఇన్నింగ్స్ లో 874 పరుగులు చేశాడు. సగటు 97.11. స్ట్రరుుక్ రేట్ 114. 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు. ►ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ. అలాగే భారత ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు. ►రెండో ఆటగాడు 8 ఇన్నింగ్స్ లో 415 పరుగులు చేశాడు. సగటు 59.28. స్ట్రరుుక్ రేట్ 67.58. ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు. అత్యధిక స్కోరు 139. ► ఈ ఇద్దరిలో ఒకరిని జట్టులోకి ఎంపిక చేయాలి. ఎవరైనా సరే మొదటి ఆటగాడినే ఎంచుకుంటారు. కానీ భారత సెలక్టర్లు మాత్రం రెండో ఆటగాడిని జట్టులోకి తీసుకున్నారు. ఇక్కడ మొదటి ఆటగాడు ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల రిషబ్ పంత్. రెండో ఆటగాడు పార్థీవ్ పటేల్. సాహా గాయపడటంతో ఇంగ్లండ్తో మూడో టెస్టుకు వికెట్ కీపర్ అవసరమయ్యాడు. మన సెలక్టర్లు పంత్ను కాదని పార్థీవ్ను ఎందుకు ఎంపిక చేశారో వాళ్లకే తెలియాలి. సాక్షి క్రీడావిభాగం గత ఏడాది కాలంలో భారత క్రికెట్లో పెను సంచలనం ఢిల్లీకి చెందిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. బ్యాటింగ్లో సెహ్వాగ్ను మించిన దూకుడుతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్, ఐపీఎల్, ఈ సీజన్ రంజీట్రోఫీలో నిలకడగా ఆడాడు. నిజానికి తను ఎంత బాగా ఆడుతున్నాడంటే... ఈ యువ క్రికెటర్ను నియంత్రించడానికి ప్రత్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. తన ప్రదర్శనతో ఇప్పటికే జాతీయ జట్టుకు ఆడే అర్హత తనకు ఉందని నిరూపించుకున్నాడు. కానీ టెస్టుల్లో సాహా, వన్డేల్లో ధోని తుది జట్టులో ఉండటం వల్ల ఇప్పట్లో తనకు అవకాశం కష్టంగా కనిపించింది. అరుుతే ఇంగ్లండ్తో మూడో టెస్టుకు సాహా అందుబాటులో లేకపోవడంతో మరో కీపర్ను ఎంచుకునే అవకాశం లభించింది. అనూహ్యంగా పంత్ను పట్టించుకోకుండా పార్థీవ్ను తెచ్చారు. సచిన్ 16 ఏళ్లకు రాలేదా? రిషబ్ పంత్ వయసు 19 ఏళ్లు. ఇప్పుడే టెస్టు ఆడించడం కష్టం అని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కానీ 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి ఆటను శాసించిన సచిన్ గురించి గుర్తుంచుకుని ఉంటే ఈ మాట అనేవారు కాదేమో. వయసు ఎప్పుడూ అర్హత కాదు. ‘పార్థీవ్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్ కాబట్టి... దినేశ్ కార్తీక్ బదులు తనను ఎంచుకున్నాం’ అనే మాట కూడా ఆ అధికారి చెప్పారు. అలా అరుుతే రిషబ్ పంత్ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. కాబట్టి ఈ రెండూ సరైన కారణాలు కావని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క సీజన్ కూడా పూర్తిగా ఆడకుండా ఎలా తీసుకుంటారనే ప్రశ్న కూడా వినిపించింది. రిషబ్ గత ఏడాది రంజీ సీజన్లో అరంగేట్రం చేసి... తొలి మ్యాచ్లోనే అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్లోనూ విశేషంగా రాణించి భారత్ను ఫైనల్కు చేర్చాడు. కేవలం ఆ ప్రదర్శన వల్లే ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు తన బేస్ ప్రైస్కు 20 రెట్లు అధికంగా చెల్లించి పంత్ను ఐపీఎల్ కోసం తీసుకుంది. ఐపీఎల్లోనూ తను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ రంజీల్లో తన ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి సందేశం ఇస్తున్నారంటే... గత రంజీ సీజన్లో ముంబై క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ విశేషంగా రాణించాడు. కానీ తనకు ఏ స్థారుులోనూ అవకాశం రాలేదు. ఈ సీజన్లో తన ప్రదర్శన దిగజారిపోరుుంది. ఒక రకంగా తన ఆత్మవిశ్వాసం దెబ్బతింది. అలాంటి స్థితి యువ క్రికెటర్లకు రాకూడదు. వచ్చే ప్రపంచకప్ వరకూ ప్రణాళిక సిద్ధంగా ఉందని, బెంచ్ బలాన్ని పెంచుతామని పదే పదే చెబుతున్న సెలక్టర్లు... పంత్ లాంటి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల చెడు సందేశం పంపుతున్నట్లరుుంది. ఇది భారత క్రికెట్కు ఏ మాత్రం మేలు చేయదు. అనుభవం వచ్చేదెలా..? రంజీట్రోఫీ అనేది భారత జట్టులోకి రాచమార్గం. ఎవరైనా ఆటగాడు గాయపడినా రంజీల్లో ఆడి ఫిట్నెస్ను నిరూపించుకున్నాకే తిరిగి జట్టులోకి తీసుకుంటామని ఇప్పటికే కుంబ్లే స్పష్టం చేశాడు. మరి అంత ప్రాధాన్యత ఉన్న రంజీల్లో చేసిన పరుగులకు విలువ ఇవ్వకపోతే ఎలా? ఏమైనా ఒక్క మ్యాచ్కే కదా అని కూడా అనొచ్చు. నిజానికి పంత్కు అవకాశం ఇస్తే... ఒకవేళ ఆ మ్యాచ్లో అతను భారీ ఇన్నింగ్స ఆడితే తర్వాత కూడా కొనసాగించవచ్చు కదా. సాహా నిజానికి గొప్ప బ్యాట్స్మన్ కాదు. పంత్ అతనికంటే బాగా ఆడతాడో లేదో తెలియాలంటే అవకాశం ఇవ్వాల్సింది. అలా కాకుండా అనుభవం కావాలంటే ఎలా వస్తుంది. నిజానికి ప్రస్తుత సెలక్షన్ కమిటీ నిర్ణయాల్లో కుంబ్లే ముద్ర బాగా కనిపిస్తోంది. పార్థీవ్ ఎంపికలోనూ కుంబ్లే పాత్ర ఉందనడంలో సందేహం లేదు. ‘పంత్ బాగా ఆడుతున్నాడు. ఒక యువ బ్యాట్స్మన్లో ఉండాల్సిన ఎనర్జీ తనలో ఉంది. అరుుతే పార్థీవ్కు అనుభవం ఉన్నందున అతనివైపు మొగ్గుచూపాం’ అని కుంబ్లే చెప్పాడు. -
యువరాజ్ మెరుపులు
లాహ్లి: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ 13 మ్యాచ్ల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో రాణించాడు. మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో యువరాజ్ (241 బంతుల్లో 164 బ్యాటింగ్; 24 ఫోర్లు) సెంచరీతో రాణించడంతో... తొలి రోజు పంజాబ్ 89 ఓవర్లలో మూడు వికెట్లకు 347 పరుగులు చేసింది. గురుకీరత్ సింగ్ (102 బంతుల్లో 101 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్సర్) కూడా సెంచరీ చేశాడు. చత్తీస్గఢ్ 261/4 కళ్యాణి: ఆంధ్ర బౌలర్లు మరోసారి తడబడటంతో గ్రూప్ సి రంజీ మ్యాచ్లో చత్తీస్గఢ్ నిలకడగా ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసేసమయానికి చత్తీస్గఢ్ 90 ఓవర్లలో నాలుగు వికెట్లకు 261 పరుగులు చేసింది. ఖారే (136 బ్యాటింగ్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్ 2, శివకుమార్, అయ్యప్ప ఒక్కో వికెట్ తీశారు. హైదరాబాద్ 191 ఆలౌట్ జంషెడ్పూర్: హరియాణతో జరుగుతున్న గ్రూప్ సి మ్యాచ్లో హైదరాబాద్ తొలి రోజు 82.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటరుుంది. సందీప్ (44), సుమంత్ (35) మినహా అందరూ విఫలమయ్యారు. హరియాణా స్పిన్నర్ చహల్ ఆరు వికెట్లతో రాణించాడు. -
ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు ఆకాశ్ చోప్రా వీడ్కోలు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఆకాశ్ చోప్రా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 15 ఏళ్ల క్రికెట్ జీవితానికి తాజాగా వీడ్కోలు చెప్పిన ఆ క్రికెటర్ తన కెరీర్ లో 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. అతని టెస్ట్ మ్యాచ్ కెరీర్ లో 23 సగటుతో 437 పరుగులు చేశాడు. ఇందులో న్యూజిలాండ్ పై రెండు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. 2003-04 వరకూ భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ఆకాశ్ అన్ని ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement