-
పదవుల మేళా
స్వల్ప వ్యవధిలోనే ఐదు ఎన్నికలు రాజకీయ నిరుద్యోగులకు పండగ ఏ పదవులకైనా సై అంటున్న నేతలు ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్న పార్టీలు కొత్తవాళ్లతో నిండిపోతున్న వైనం సాక్షి, ఏలూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికలన్నీ ఒకేసారి రానే వచ్చేశాయి. రాజకీయ నిరుద్యోగుల నెత్తిన పాలుపోశాయి. ఈసారి ఏదో ఓ పదవి తప్పక వరిస్తుందని గంపెడాశలు పెట్టుకున్న నేతలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఎలాగైనా టికెట్ సంపాదించాలని వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఆశావహులకు సీట్లు సర్దుబాటు చేయడంలో అధినాయకులు తల మునకలయ్యారు. రాజకీయం అనే రొంపిలోకి వెళ్లకూడదనే అపోహల నుంచి బయటపడి కొత్తవారు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. కొందరికి చావోరేవో! ఎన్నికల్లో ఏదో ఓ పదవి సంపాదించకపోతే ఈసారి కొందరికి రాజ కీయ భవిష్యత్ ఉండని పరిస్థితి. వారిలో గల్లీ నాయకుడి నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్య మం కారణంగా కొందరికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయే ప్రమా దం ఏర్పడింది. ఈ కోవకు చెందినవారే జిల్లాకు చెందిన ఓ కేంద్రమంత్రి. సమైక్యాంధ్ర నినాదంతో పదవిని చేపట్టి అనంతరం అధిష్టానానికి జై కొట్టడంతో అతనిపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఈ ఎన్నికలు ఆయనకు చావోరేవోగా మారాయి. అలాగే జిల్లాకు చెందిన మరో మంత్రికీ ఇవి చివరి ఎన్నికలు కానున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధికార చెలాయించిన పార్టీ లో ఉన్న ఈ నేతా ప్రజాగ్రహాన్ని చవిచూడనున్నారు. స్థానిక సమరంపై దృష్టి మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో కొందరు మునిసిపల్ చైర్మన్ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. తమ అనుయాయులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీల అధిష్టానాల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలు కూడా టికెట్ పంపకాల్లో సమస్యలు తలెత్తకుండా ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్నాయి. అసెంబ్లీ టికెట్ కుదరకపోతే మునిసిపల్ చైర్మన్, అదీ కుదరకపోతే జెడ్పీటీసీ టికెట్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నాయి. కొందరికి ఎంపీటీసీ టికెట్ ఇస్తామంటున్నారంటే ప రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఇవేవీ కుదరకపోతే వాటిని మించిన నామినేటెడ్ పదవి ఇస్తామంటూ ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నారు. పాతవారిపై వ్యతిరేకత ఉన్నచోట కొత్తవారిని బరిలోకి దిం చాలని భావిస్తున్నారు. ఏదైనా పర్లే దు టికెట్ ఇస్తే చాలంటూ కొందరు నేతలు సర్దుకుంటున్నారని పలువు రు గుసగుసలాడుతున్నారు. -
పంచతంత్రం
సాక్షి, ఏలూరు: ఓటరన్నకు పండగొచ్చింది.. నా యకులకు చిక్కొచ్చింది.. ఒకేసారి తరుముకొచ్చిన ఎన్నికలతో ప్రజలు ఉబ్బితబ్బిబవుతుండగా.. రాజకీయ పక్షాలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సార్వత్రిక పోరుకు సన్నద్ధమవుతున్న తరుణంలో మునిసిపల్ ఎన్నికలతో సతమతమవుతున్న వారిని ‘ప్రాదేశిక’ పోరు ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలల వ్యవధిలో మునిసిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం వీరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నేడు ‘ప్రాదేశిక’ నోటిఫికేషన్ జిల్లాలో ఏలూరు కార్పొరేషన్తో పాటు నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి ఈనెల 30న ఎ న్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే వీటి వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలిన నేత లకు ఇప్పుడు హఠాత్తుగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రానుండటం కలవరపెడుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లాలో 46 జెడ్పీటీసీ, 903 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏప్రిల్ 6న వీటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానేవచ్చింది. జిల్లాలో 15 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. మూడేళ్లుగా తాత్సారం జిల్లాలో నగరపాలక సంస్థ, మునిసిపాలిటీలకు 2010 సెప్టెంబర్తో గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారులను నియమించి వీటిలో పాలన సాగిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవులు 2011 జులైతో ముగిశాయి. దివంగత సీఎం వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో పాలన ఉన్నా లేనట్టుగానే మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా పరిస్థితి చక్కబడలేదు. దీనిని గమనించిన కాంగ్రెస్ పెద్దలు ఎన్నికలు నిర్వహించకుండా జనాభా లెక్కలు, రిజర్వేషన్లు పేరుతో ఇప్పటివరకు తాత్సారం చే స్తూ వచ్చారు. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో వీటికి మోక్షం కలిగింది. ఖంగు తిన్న కాంగ్రెస్ గత జులైలో పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ ధైర్యం చేయలేకపోయింది. ఈలోపు రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. దీంతో పాలకులు స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఎన్నికలు జరపాల్సిందేనని ఆదేశించడంతో తప్పనిసరై నోటిఫికేషన్లు వెలువరిస్తున్నారు. దీంతో ఇటు నాయకులు అటు అధికారులు పరుగులు తీస్తున్నారు. ఏర్పాట్లలో యంత్రాంగం, అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఎక్కడ చూసినా వీటిపై చర్చలే కనిపిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement