-
రేణిగుంటలో విమాన సర్వీసులు పునరుద్ధరణ
రేణిగుంట: ఎట్టకేలకు రేణిగుంట నుంచి విమానాలు ఎగిరాయి. ఈనెల 17న స్పైస్జెట్ విమానమొకటి రన్వేలో ముందుకు దూసుకుపోయి చక్రాలు బురదలో కూరుకుపోయి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తిరుపతికి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా 27 గంటల పాటు ప్రయాణికులు అవస్థ పడ్డారు. ఆదివారం రాత్రి 11గంటలకు ఎయిర్ ఇండియా విమానం రన్వేపై లాండ్ అయింది. అదుపు తప్పి రన్వేను దాటి వెళ్లి బురదలో కూరుకుపోయిన విమానాన్ని అతికష్టం మీద∙ఎయిర్పోర్టు అధికారులు రన్వే మీదకు తీసుకొచ్చారు. సోమవారం మరమ్మతు పనులను ఇంజినీర్లు చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు చెన్నై డీజీసీఏ, డీసీఎస్ నుంచి విచారణ అధికారులు చేరుకున్నారు. ఆదివారం పూర్తిగా ఎయిర్పోర్టులో తిష్టవేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. విమానం నడిపిన ఇద్దరు పైలట్లను విచారించారు. వీరు తమ నివేదికను పౌరవిమానయాన శాఖ ఉన్నతాధికారులకు వెంటనే నివేదించనున్నారు. ఎయిర్పోర్టు డైరెక్టర్ పుల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. విమాన రాకపోకలు నిర్ణీత సమయంలో జరుగుతుండటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
క్షణమొక యుగంలా..
గోపాలపట్నం : మా ఆయన వచ్చేస్తారంటూ ధైర్యం? వస్తారంటారా అని అనుమానం? ఎక్కడున్నారో అని ఆందోళన... ఇదీ విమానంలో గల్లంతైన ఎన్ఏడీ ఉద్యోగుల భార్యల్లో ఉద్విఘ్నమైన పరిస్థితి. ఎవరెళ్లి పలకరించినా ఇదే ఆవేదన.. ఆందోళన. ఎన్ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పి.నాగేంద్రరావు, ఆర్వీ ప్రసాద్బాబు, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్ మహారాణా, ఎన్.చిన్నారావు, జి.శ్రీనివాసరావులతో పాటు 29 మంది ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్టుబ్లెయిర్కు ఎయిర్ఫోర్సు విమానంలో వెళ్తూ గత శుక్రవారం ఉదయం గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం నుంచి నిద్రహారాలు సహించక ఆయా కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. క్షణమొక యుగంలా రాక కోసం ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. తిండి సహించడం లేదు.. గర్భిణి కావడంతో గంట్ల శ్రీనివాసరావు భార్య ఈశ్వరి పరిస్థితి మరింత బాధగా ఉంది. గత శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిండి సహించడం లేదు. కునుకు తీయడంలేదు. భర్త జాడ ఏమైందంటూ అందర్నీ వేడుకుంటోంది. ఎవరి నోట విన్నా ఇంకా తెలీదన్న మాటే వస్తుండడంతో సానుకూల కబురు కోసం టీవీ వార్తలను వింటోంది. ఆమె కాస్త అస్వస్థతకు గువ్వవడంతో కుటుంబసభ్యులు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శ్రీనివాసరావు తల్లి సూరీడమ్మ కొడుకు ఎక్కడున్నాడంటూ రోదిస్తోంది. గుండెలవిసిపోతున్నాయి.. గోపాలపట్నం శ్రీనివాసనగర్లో ఉన్న పాటి నాగేంద్ర కుటుంబం తీవ్రఆందోళన చెందుతోంది. ఆరు రోజుల యినా నాగేంద్ర రాకపోవడమేంటని ఆవేదన చెందుతున్నారు. భార్య పూర్ణిమ రోదనలతో గుండెలవిసిపోతున్నాయి. తల్లిదండ్రులు, అత్తమామలు దుఃఖం జీర్ణించుకోలేక, పూర్ణిమని ఓదార్చే శక్తి లేక కుంగిపోతున్నారు. నాగేంద్ర ప్రాణాలతో తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. పూర్ణిమకు తిండి, నీరు సహించక పోవడంతో ఆరోగ్యం మందగించింది. ఆమెకు వైద్యులు సెలైన్ ఎక్కించాల్సి వచ్చింది. కేరళ నుంచి నేవీ ఉన్నతాధికారుల ఫోన్ కేరళ నుంచి నేవీ ఉన్నతాధికారులు మంగళవారం పాటి నాగేంద్ర భార్య పూర్ణిమ, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఎయిర్ఫోర్స్ విమానం జాడ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇంతవరకూ ఎలాంటి జాడ లేదని చెప్పారు. లేనిపోని వదంతులు నమ్మవద్దని, స్పష్టమైన సమాచారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement