-
దేశం కోసం తుపాకీ పట్టిన మాజీ మిస్ ఉక్రెయిన్
రష్యా దాడితో ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్ తన వద్ద ఉన్న తక్కువ ఆయుధాలు, సైన్యంతో పోరాడుతోంది. బలబలాల విషయంలో రష్యాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేని స్థితిలో ఉక్రెయిన్ ఉన్నప్పటికీ శక్తి వంచన లేకుండా రష్యన్ బలగాలను ఎదుర్కుంటోంది. చివరికి దేశాధ్యక్షుడు జెలెన్స్కీ సైతం యుద్ధభూమిలోకి దిగి దేశ ప్రజలకు కూడా ఆయుధాలు ఇస్తామని పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నుంచి సెలబిట్రీల సైతం ఆయుధాలు చేతబట్టి రణరంగంలో దిగుతున్నారు. తాజాగా ఉక్రెయిన్కు చెందిన అందాల భామ కూడా ఆర్మీలో చేరారు. ఆమె ఎవరో కాదు.. 2015 లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్లో ఉక్రెయిన్ తరపున పాల్గొన్న బ్యూటీ అనస్తాసియా లెన్నా. ప్రస్తుతం ఆమె గన్ను పట్టి శత్రువులను మట్టుబెట్టేందుకు యుద్ధభేరిలో పాల్గొంటున్నారు. View this post on Instagram A post shared by Miss Ukraine🇺🇦Anastasiia Lenna (@anastasiia.lenna) -
మోడల్పై మాజీ ప్రియుడి యాసిడ్ దాడి
ఆమె మాజీ బ్యూటీక్వీన్. ఇప్పుడు కూడా టాప్ మోడళ్లలో ఒకరు. అలాంటి మోడల్పై యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడి చేసింది కూడా ఎవరో కాదు.. ఆమె మాజీ బోయ్ఫ్రెండు. మాజీ మిస్ ఇటలీ అయిన జెస్సికా నొటారో ముఖంపై అతడు యాసిడ్ పోయడంతో ఇప్పుడు ఆమె కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. టీవీ ప్రెజెంటర్గాను, డాల్ఫిన్ల శిక్షకురాలిగా కూడా పనిచేసిన నొటారోకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. యాసిడ్ దాడితో ఆమె తీవ్రంగా గాయపడటంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె ముఖం మీద, కళ్లలోకి బాగా లోపలి వరకు యాసిడ్ గాయాలు కావడంతో.. ప్లాస్టిక్ సర్జరీ తప్పడం లేదని, ఆమె కాళ్ల మీద, పిరుదుల మీద కూడా యాసిడ్ పడిందని చెబుతున్నారు. నిందితుడు, నొటారో మాజీ బోయ్ఫ్రెండు జార్జ్ ఎడ్సన్ టవారెస్ను అరెస్టు చేశారు. అయితే, తాను ఆ దాడి చేయలేదని అతడు వాదిస్తున్నాడు. ఒక అక్వేరియంలోని డాల్ఫిన్ షోలో పనిచేసే సమయంలో 2014లో ఎడ్సన్ను నొటారో తొలిసారి కలిసింది. రెండేళ్ల బంధం అనంతరం ఇద్దరూ గత వేసవిలో విడిపోయినా, అతడు తరచు వెంటపడుతూ వేధిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వెంటపడటం మాత్రం మానలేదు. ఇన్ని బాధలు ఉన్నా నొటారో ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదని, ఆశాభావంతో ఉండేదని స్నేహితులు చెప్పారు. ఆమె మంచి గాయని, డాన్సర్ కూడా అని, తరచు టీవీ షోలలో కనిపించేదని అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
తప్పక చదవండి
Advertisement