-
ప్రతిభా భారతికి తీవ్ర అనారోగ్యం
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్, టీడీపీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభా భారతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పినాకిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య (92) ను చూసేందుకు ఆమె శుక్రవారం విశాఖపట్నం వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ప్రతిభా భారతికి అత్యవసర చికిత్స అందిస్తున్నామనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. -
వరించిన అదృష్టం
అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిభా భారతి ఎంపిక చివరి క్షణంలో చక్రం తిప్పిన అచ్చెన్న శ్రీకాకుళం :రాష్ట్ర మాజీమంత్రి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని అదృష్టం వరించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తరువాత అనూహ్యంగా ఈమెను అధిష్టానం ఎంపిక చేసింది. గురువారం ఉదయం నుంచి అభ్యర్థుల ఎంపికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎస్సీ వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేయాలని తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించింది. ఇటీవలే పార్టీలో చేరిన జూపూడి ప్రభాకరరావుపేరు దాదాపు ఖరారైపోయింది. ఆయనకు తెలంగాణాలో ఓటు ఉండడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పోటీకి అనర్హులయ్యారు. దీంతో ప్రతిభా భారతిని ఎంపిక చేసి నామినేషన్ దాఖలు చేయించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలలో మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన ప్రతిభకు మంచిపేరుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అప్రతిహత విజయాలు సొంతం చేసుకున్న ఈమె వైఎస్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. అటు తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వేషన్లు సైతం మారడంతో రాజాం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రతిభా భారతి పదవిలో ఉన్నప్పుడు ఎంతో సఖ్యతతో ఉన్న కళావెంకటరావుతో విభేదాలు మొదలయ్యాయి. తన ఓటమికి కళావెంకటరావే కారణమని అధిష్టానానికి ఫిర్యాదు చేసే స్థాయికి వారి విభేదాలు వెళ్లాయి. అటు తరువాత ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొలుత ప్రతిభా భారతిని ఎంపిక చేయక పోవడానికి కారణం కళావెంకటరావేనన్న ప్రచారం కూడా జిల్లాలో జరిగింది. ఇటీవలే పార్టీలోకి వచ్చిన జూపూడిని ఎంపిక చేయించి ప్రతిభ ఎదుగుదలను అడ్డుకున్నారని ప్రతిభ వర్గీయులు ఆరోపించారు. అనూహ్యంగా జూపూడి అనర్హులు కావడంతో ప్రతిభను కాకుండా వేరొకరిని ఎంపిక చేయాలని అధిష్టానం భావించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోచించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చక్రం తిప్పి ప్రతిభను ఎంపిక చేయించినట్టు తెలుస్తోంది. కళావెంకటరావును దెబ్బతీసేందుకు ఇదొక అస్త్రంగా వినియోగించుకొని ప్రతిభా భారతి ద్వారా రాజాం ప్రాంతంలో కళా వెంకటరావు ఆధిపత్యాన్ని తగ్గించాలని అచ్చెన్న యోచించి అధిష్టానంపై ఒత్తిడి తేవడం ద్వారా ఈమెను ఎంపిక చేయించినట్టు భోగట్టా. ఏది ఏమైనా దశాబ్ద కాలం తరువాత అయినా ప్రతిభా భారతికి గుర్తింపు రావడంతో ఆమె అనుయాయిలు ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement