-
నాడు అన్నపూర్ణ రాష్ట్రం.. నేడు అప్పుల రాష్ట్రం !
సాక్షి, అమరావతి : సహజంగా మనం అప్పు ఎందుకు చేస్తాం?... ఏదైనా ఆస్తి కొనుగోలుకు అవసరమైతే! సాధారణంగా ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే ఏం చేస్తాం? ...దానిని పెట్టుబడిగా పెట్టి కొంత రాబడి పొందాలని చూస్తాం! మరి... చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? వేల కోట్ల రూపాయిలను ఎలా ఖర్చు పెడుతోందో తెలుసా? అసలిప్పటివరకు ఎంత అప్పు చేసిందో తెలుసా?ఐదేళ్లలో మొత్తం ఏమేరకు రుణం తీసుకుందో తెలుసా? తెలుసుకోండి మరి... మాట్లాడితే తనది నలభై ఏళ్ల అనుభవమని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు... దాంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించలేకపోయారు. పైగా అందినకాడికి అప్పులు చేసి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను రుణగ్రస్తురాలిగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని 1995– 2004 మధ్య నాటి పాలనా కాలమైనా, విభజిత ఏపీలోని ప్రస్తుత పాలనా కాలమైనా చాటుతున్నది ఇదే. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు చే బదుళ్లతోనే నడిపించి, ఓ దశలో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేనంతటి పరిస్థితి వచ్చిందంటేనే చంద్రబాబు పాలనా తీరు ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. తర్వాతైనా ఆయన ధోరణి మారలేదనడానికి గణాంకాలు సహా ఎన్నో ఉదాహరణలున్నాయి. అంతేగాక బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల ఎడాపెడా అప్పులతో భవిష్యత్తులో అప్పు పుట్టడం గగనం అన్నంతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. దివాలా తీయించారు... ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఎన్నికల ముందు కూడా ఎడాపెడా రుణాలు తీసుకొచ్చారు. ఓపక్క వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టి రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆర్థిక శాఖ వర్గాలు నెత్తీనోరు కొట్టుకుంటున్నాయి. ఆఖరికి చే బదుళ్లనూ సకాలంలో చెల్లించకుండా డిఫాల్టర్గా మారి... వాటి వడ్డీలు చెల్లించిన ఘనత చంద్రబాబు సర్కారుకు దక్కింది. ‘తల’సరి రూ.83 వేలు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. అక్షరాలా అవి రూ.4.15 లక్షల కోట్లకు చేరాయి. దీనిప్రకారం చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.83 వేల అప్పున్నట్లు లెక్క. బడ్జెట్ లోపల ఇప్పటికే నిబంధనలకు మించిన ప్రభుత్వం... ఇంకా అనుమతి లేకపోవడంతో బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో భారీగా అధిక వడ్డీలకు తెచ్చింది. అంతా నిరర్ధకమే! తీసుకున్న రుణాలను రాష్ట్రానికి ఉపయోగపడే ఆస్తుల కల్పనకు కాకుండా నిరర్ధక ఖర్చులకు ఉపయోగించారు. కమీషన్లు వచ్చేలా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, శంకుస్థాపనల హడావుడి, ప్రత్యేక విమానాల్లో పర్యటనలు, ఈవెంట్లు, రాజకీయ ప్రయోజనం కలిగించే ప్రచార ఆర్భాటాలకు వ్యయం చేశారు. రూపాయి కూడా వెనక్కురాని ఇలాంటివాటితో డబ్బంతా కర్పూరంలా హరించుకుపోతోంది. ఆ భారం పరోక్షంగా రాష్ట్ర ప్రజలపైనే పడుతోంది. 58 నెలల్లో రూ.1,93,870 కోట్లు విభజన నాటికి రాష్ట్ర రుణ భారం రూ.96 వేల కోట్లుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అవి ఏకంగా రూ.2,89,870.02 కోట్లకు చేరింది. అంటే... 58 నెలల పాలనలో ఏకంగా రూ.1,93,870 కోట్లు అప్పు చేశారని స్పష్టమవుతోంది. వీటితో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం గాని, ప్రాజెక్టు గాని పూర్తి చేయలేదు. మరోపక్క రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ పేదల ఇళ్ల నిర్మాణం, వివిధ కార్పొరేషన్ల పేరిట భారీగా రుణాలు తీసుకున్నారు. దొడ్డిదారి ప్రయత్నాలతో బడ్జెట్లో ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేసేందుకు నిబంధనలు అనుమతించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన వెళ్తోంది. గతంలో ఇచ్చిన గ్యారెంటీలను దాచేస్తూ, బడ్జెట్ బయట పరిమితికి మించి ఎడాపెడా అప్పులు చేస్తోంది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు దొరికినచోటల్లా చేయి చాస్తోందని అధికార వర్గాలు వాపోతున్నాయి. ఎఫ్ఆర్బీఎం చట్టం తుంగలోకి ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం నిబంధనలకు మించి బడ్జెట్ బయట అప్పులు తెస్తూ ఆర్బీఐ నిబంధనలనూ ఉల్లంఘిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. బడ్జెట్ బయట ప్రభుత్వ సంస్థల ద్వారా రాష్ట్ర సొంత ఆదాయంలో 90 శాతం అప్పు చేసేలా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు వీలుంది. నిబంధనల మేరకు రూ.94,555.89 కోట్ల రుణాలకు పూచీగా ఉండాల్సి ఉండగా అదనంగా రూ.1,154.25 కోట్లు తెచ్చారు. మరోవైపు ఎన్నికల ముందు 2 నెలల్లోనే రూ.29,465 వేల కోట్ల రుణం కోసం ప్రయత్నాలు చేశారు. అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన పెద్దలతో స్వయంగా సీఎం కార్యాలయం చర్చలు జరిపింది. వీటినీ తీసుకుంటే నిబంధనలకు మించి బడ్జెట్ బయట రూ.30,619 కోట్లు అప్పు చేసినట్లవుతుందని, ఇలా చేయడం రాష్ట్ర ప్రజలను ఊబిలోకి నెట్టడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు. పరిమితి మించి 2018 మార్చి 31 నాటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి బడ్జెట్ బయట చేసిన అప్పులు రూ.37,489.56 కోట్లు. డిసెంబర్ నాటికి అవి రూ.47,379.56 కోట్లకు పెరిగాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో నిబంధనల మేరకు రూ.47,176.33 కోట్లకు మాత్రమే బడ్జెట్ బయట అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాల్సి ఉండగా దాన్ని మించి రూ.1154.25 కోట్లు అదనంగా రూ.48,330,58 కోట్లకు గ్యారంటీ ఇచ్చేసింది. కమీషన్ల కోసం.. ఎన్నికలకు రెండు నెలల ముందు రూ.29,465 కోట్లకు గ్యారంటీ ఇచ్చేసి బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరుతో అప్పు చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైళ్లు ఆర్థిక శాఖలో చకచకా కదిలాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మార్చి 29న సాగునీటి ప్రాజెక్టుల పేరుతో గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్ ద్వారా రూ.5,545 కోట్లు అప్పు చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. వాణిజ్య బ్యాంకులతో బేరసారాలు సాగించి ఎక్కువ వడ్డీకైనా సరే అప్పులు చేయాలని స్వయంగా సీఎం చంద్రబాబే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, వీటిని ప్రాజెక్టులకు కాకుండా రాష్ట్ర ఖజానాకు బదలాయిస్తూ అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, అనుత్పాదక రంగాలపై వెచ్చిస్తున్నారు. వాస్తవంగా ఏ ఉద్దేశంలో డబ్బు తెస్తే అందుకే వెచ్చించాల్సి ఉంది. కానీ, ఖజానాకు మళ్లించి ఇష్టానుసారం పంచుతున్నారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే బడ్జెట్ లోపల చేసిన అప్పులను నిరర్ధక అంశాలపై ఖర్చు చేయడంతో అప్పులు పెరిగి ఆస్తులు తగ్గిపోతున్నాయి. ‘ప్రభుత్వంలో ఏ రంగం, ఏ శాఖ చూసినా అప్పు అనే పదం తప్ప మరొకటి వినిపించడం లేదు. ఏ ప్రాజెక్టుకు అప్పు కావాలంటే ఆ ప్రాజెక్టు ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకోమని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే సూచిస్తున్నారు. దీంతో రాష్ట్రంపై భారం పెరిగిపోతోంది’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయే నాటికి 13 జిల్లాలకు చెందిన అప్పు రూ.96 వేల కోట్లుండగా ఇప్పుడది రూ.2.89 లక్షల కోట్లయింది. వివిధ కార్పొరేషన్ల పేరిట గ్యారంటీతో తెచ్చే అప్పులను కూడా ప్రభుత్వమే తీర్చాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం పరిమితి మించడంతో వచ్చే ప్రభుత్వానికి రుణం దక్కే వెసులుబాటు కూడా లేకుండా పోతోందని, రాష్ట్రాన్ని ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి నెట్టేస్తున్నారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అన్నింటికి నిలిపేస్తూ ముఖ్యమంత్రి చెప్పినవాటికి మాత్రమే బిల్లు చెల్లిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్న చిన్న సప్లయర్స్ బిల్లుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతుండగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పైరవీలు, కమీషన్లతో ప్రభుత్వ పెద్దలతో కలిసి బిల్లులు పొందుతున్నారు. రాజధాని ప్రజలపైనా... భవిష్యత్తులో రూ.37 వేల కోట్ల అప్పులు చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఇందుకోసం రైతుల నుంచి తీసుకున్న భూముల్లో 8,217 ఎకరాల విక్రయం, తాకట్టు పెట్టేందుకు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ అప్పుపై వచ్చే 18 ఏళ్లలో కేవలం వడ్డీ భారమే రూ.36,500 కోట్లవుతుందని సీఆర్డీఏ పేర్కొంది. అసలుతో సమానంగా వడ్డీ భారమై ఏకంగా రూ.73 వేల కోట్ల భారం రాజధాని ప్రజలపై పడనుంది. చిత్రమేమంటే సాగునీటి ప్రాజెక్టులు, మున్సిపల్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేసి బడ్జెట్ బయట అప్పు చేస్తున్నారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో సర్కారు గ్యారెంటీతో చేసిన అప్పులు (కోట్లలో) గతేడాది 31 మార్చి నాటికి వివిధ కార్పొరేషన్ల పేరిట సర్కారు గ్యారెంటీతో అప్పులు 37,489.56 సీఆర్డీఏ, ఆర్టీసీ, ట్రాన్స్కో, అపిట్కో, గ్రామీణ మంచినీటి సంస్థల పేరుతో ... 9890.00 ఏపీ ట్రాన్స్కో 9166.36 మచిలీపట్నం పోర్టు 1385.00 గ్రామీణ మంచినీటి సరఫరా సంస్థ 4300.00 ఏపీ సీఆర్డీఏ గవర్నమెంట్ క్వార్టర్స్ 3307.00 ఏపీఆర్డీఏ 5940.00 మున్సిపల్ కార్పొరేషన్లు 13,035.00 అపిట్కో 1164.22 గృహ నిర్మాణ సంస్థ 3600.00 ఆప్కో 150.00 ఏపీఐఐసీ 2000.00 ఏపీ ఫైబర్నెట్ 3283.00 హడ్కో 1000.00 మొత్తం 95,709 రెండు నెలల్లో కొత్తగా అప్పులు తెచ్చేందుకు ఫైలు ప్రోసెస్లో ఉన్న వివరాలు (రూ.కోట్లలో) గ్రామీణ మంచినీటి సరఫరా సంస్థ : 9,400 ట్రాన్స్కో : 9,300 రైతు సాధికార సమితి : 4,000 జలవనరుల అభివృద్ధి సంస్థ : 3,000 రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ : 3,000 స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ : 500 కర్నూలు మున్సిపాలిటీ : 265 మొత్తం : 29,465 - బడ్జెట్ లోపల రూ. 2,89,870.02 కోట్లు - బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరుతో...రూ.1,25,174 కోట్లు - ఇప్పటికే పరిమితికి మించి బడ్జెట్ బయట రూ.1154.25 కోట్ల అప్పు - సర్కారు గ్యారెంటీతో రూ.95,709 కోట్లు పొందిన వైనం - దొంగ లెక్కలతో మళ్లీ భారీగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం - నిబంధనలకు మించి మరో రూ, 29,465 కోట్లు అప్పు చేస్తున్న సర్కారు - ఇవన్నీ ఎన్నికల ముందు పంపకాలు, కమీషన్లు కోసమే! - డబ్బంతా ఆర్భాటాలు, దుబారాలు, ఈవెంట్లకు వ్యయం - ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా పయనం -
అప్పు.. రూ. లక్ష కోట్లు..!
⇒ ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలిస్తే తెలంగాణపై మరింత రుణభారమే ⇒ తొలి ఏడాది రూ. 8,500 కోట్ల అప్పు ⇒ ఈసారి రూ. 18,962 కోట్లు లక్ష్యం సాక్షి, హైదరాబాద్: అప్పులు తప్ప గత్యంతరం లేదని తెలంగాణ సర్కారు అంచనా వేసుకుంది. అందుకే ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలు సడలించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ బృందానికి విజ్ఞప్తి చేశారు. కానీ.. సడలిస్తే రాష్ట్రంపై అప్పుల భారం మరింత పెరిగిపోనుంది. ఏళ్లకేళ్లుగా చేసిన అప్పులు.. వడ్డీల భారం తెలంగాణ రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. తొలి ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణ సర్కారు రూ. 8,500 కోట్ల అప్పులు తెచ్చింది. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ వాటాగా వచ్చిన రుణ భారం మొత్తం రూ. 61 వేల కోట్లు. ఆడిటింగ్ పూర్తయితే ఇది రూ.71 వేల కోట్లు దాటుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ లెక్కన మొత్తం అప్పు ఇప్పటికే రూ.80 వేల కోట్లకు చేరువలో ఉంది. కొత్తగా రూ.18,962 కోట్ల అప్పులు చేసేలా ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించాలనేది సర్కారు వాదన. ఈ తీరు చూస్తే.. వచ్చే ఏడాది తెలంగాణ అప్పు రూ.98,962 కోట్లు.. ఇంచుమించుగా లక్ష కోట్ల దరిదాపుల్లోకి చేరటం ఖాయంగా కనిపిస్తోంది. గత ఏడాది అప్పులపై వడ్డీలకు ప్రభుత్వం రూ.5,925 కోట్లు చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీల చెల్లింపులకు రూ.7,554 కోట్లు ఖర్చు చేయనుంది. 14వ ఆర్థిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ప్రకటించింది. ఈ ప్రకటన రాష్ట్రానికి లాభం కంటే నష్టాలనే ఎక్కువగా తెచ్చి పెట్టిందని ఆర్థిక శాఖ తల పట్టుకుంది. ఆశించినంత రెవిన్యూ రాబడులు లేకపోవటంతో తొలి ఏడాదిలోనే అంచనాలు తలకిందులయ్యాయి. నిధుల సర్దుబాటు సంక్లిష్టంగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నింటికీ కత్తెర పడటంతో పాటు... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విడుదలయ్యే గ్రాంట్లు రాకుండా పోయాయి. కొత్త రాష్ట్రం కావటంతో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి దాదాపుగా బుట్ట దాఖలైంది. దీంతో రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లింది. రెవిన్యూ మిగులు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన అవసరమేమీ లేదని ఈ ఆర్థిక సంఘం బీఆర్జీఎఫ్ ఊసెత్తకుండానే వదిలేసింది. దీంతో తెలంగాణలో ఆరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు రాకుండా పోయాయి. పన్నుల వాటా, గ్రాంట్లు మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే రూ. 6,000 కోట్లు కేంద్రం నుంచి కత్తెర పడింది. ఎఫ్ఆర్బీఎం చట్ట ప్రకారం రాష్ట్రాలు తమ జీఎస్డీపీలో 3 శాతం మేరకు అప్పులు తెచ్చుకునే వీలుంటుంది. ఈ వార్షిక బడ్జెట్టులో తెలంగాణ ప్రభుత్వం 3.49 శాతం ద్రవ్యలోటును చూపించింది. రూ.16969 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని అంచనాలు వేసింది. కానీ.. ఎఫ్ఆర్బీఎం నిబంధన ప్రకారం ఈ అప్పులు రూ.13,053 కోట్లు మించకూడదు. అందుకే ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్టులో 3.9 శాతం ద్రవ్యలోటు చూపించాయి. రెవిన్యూ మిగులు ఉన్నందున తెలంగాణకు కేంద్రం తరహాలోనే ద్రవ్యలోటుకు అనుమతించాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ బృందానికి ఆర్థిక శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ లెక్కన తెలంగాణ ప్రభుత్వం రూ.18,962 కోట్ల అప్పులు తెచ్చి ఈ వార్షిక బడ్జెట్టులో లోటు పూడ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ధనిక రాష్ట్రమైతే అప్పులతో అవసరమేముందన్న ధోరణితో కేంద్రం ఈ అంశాన్ని దాటవేస్తోందని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
ఆసీస్, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్కప్ ఫైనల్
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement