-
నిధుల వరద..!
ఆదిలాబాద్అర్బన్: పల్లెల ప్రగతికి నిధుల వరద పారుతోంది. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో పంచాయతీలకు నిధులు ఇస్తున్నాయి. పట్టణాలను తలపించేలా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు వీటిని ఖర్చు చేయాల్సి ఉంది. నిధులు సక్రమంగా వినియోగించేలా చట్టాలు కూడా తెస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చెక్పవర్ కూడా రద్దు కానుంది. అయితే ఈ చట్టం ప్రకారం గతంలో కంటే ఈసారి ఎక్కువగానే నిధులు వచ్చే అవకాశం ఉంది. గ్రామ జనాభా ప్రకారం నిధులు రానున్నాయి. గడిచిన ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు రూ.150 కోట్లపైగా నిధులు అయ్యాయి. వీటిని పంచాయతీ ఖాతాల్లో నేరుగా జమ చేశాయి. ఒక్కో పంచాయతీకి రూ.అరకోటిపైగా వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఐదేళ్లలో రూ.150 కోట్లకుపైనే నిధులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 866 పాత పంచాయతీలు ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ ఫండ్, 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) ద్వారా నిధులు విడుదల చేస్తున్నాయి. ఒక్కో ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగుసార్లు వీటిని జమ అవుతున్నాయి. ఐదేళ్లలో సాధారణ పంచాయతీకి రూ.50 లక్షలు, మేజర్ పంచాయతీలకు దాదాపు కోటి వరకు నిధులు సమకూరాయి. ఉమ్మడి జిల్లాలోని 866 పంచాయతీలకు ఐదేళ్లలో రూ.150 కోట్లుకుపైగానే వచ్చా యి. సంవత్సరాల వారీగా పరిశీలిస్తే.. 2014–15లో రెండు విడతలుగా రూ.25.98 కోట్లు రాగా, 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రూ.67.55 కోట్లు విడుదల అయ్యాయి. 2016–17లో రెండు ప్రభుత్వాలు మొత్తం 29.60 కోట్లు , 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 25.86 కోట్లు విడుదల చేశాయి. 2018–19లో 866 జీపీలకు రెండుసార్లు విడుదలైన నిధులు కలిపి రూ.14.56 కోట్లు పంచాయతీల ఖాతాలకు జమయ్యాయి. జీపీలకు మూడురకాల ప్రభుత్వ నిధులు.. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రకాలుగా నిధులు విడుదల చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధులు గతంలో మండల, జిల్లా పరిషత్కు జమయ్యేవి. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 2015 నుంచి వీటిని నేరుగా పంచాయతీలకు ఇస్తోంది. దీంతో ఆర్థిక సంఘం నిధులు నాలుగేళ్లుగా పంచాయతీలకు జమవుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు కూడా జీపీలకే వస్తున్నాయి. వీటితోపాటు జనరల్ ఫండ్ నిధులు కూడా సమకూరుతున్నాయి. ఈ మూడురకాల ఆదాయ వనరులు కాకుండా పంచాయతీలకు ఇంటి, నల్లా పన్నులు, భూ సంబంధిత నిధులు, ఇసుక, మైన్స్ ఇతర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం కూడా జమవుతున్నాయి. నిధులను గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలుల నిర్మాణాలు, పూడికతీత, పారిశుధ్యం నిర్వహణ, శానిటేషన్, పారిశుధ్య కార్మికులకు వేతనాలు, వీధిలైట్లు, తాగునీరు తదితర పనులకు వినియోగిస్తున్నాయి. బడ్జెట్ను తొలిసారి వినియోగించుకోనున్న 659 జీపీలు.. ఉమ్మడి జిల్లాలోని కొత్త పంచాయతీలకు తొలిసారిగా బడ్జెట్ వినియోగంలోకి రానుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీంభీం, నిర్మల్ నాలుగు జిల్లాల పరిధిలో పాత పంచాయతీలు 866 ఉండగా, కొత్తగా 659 పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త సర్పంచుల పాలన ప్రారంభం అయింది. మున్సిపాలిటీలో కలిసిన పంచాయతీలను మినహాయిస్తే ప్రస్తు తం ఉమ్మడి జిల్లాలో 1508 పంచాయతీలు ఉన్నాయి. మం చిర్యాల జిల్లాలోని మొత్తం 322 జీపీలు ఉండగా, 112 కొత్తగా ఏర్పాటయ్యాయి. కుమురంభీంలో మొత్తం 334 ఉండగా, 161 జీపీలు కొత్తగా ఏర్పాటు చేశారు. నిర్మల్లో 400 జీపీలు ఉండగా, 160 జీపీలు, ఆదిలాబాద్లో మొత్తం 467 ఉండగా, 226 పంచా యతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు తొలిసారిగా ప్రభుత్వం విడుదల చేయనున్న బడ్జెట్ను వివిధ అభివృద్ధి పనులకోసం ఉపయోగించనున్నాయి. రానున్న ఐదేళ్లలో మరింత నిధులు..? కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు ఎక్కువ నిధులు సమకూర్చే అవకా శం ఉంది. సర్పంచ్లకు కొత్త చట్టంపై శిక్షణ.. నిధులు–విధులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కొత్త చట్టం ప్రకారం జీపీలకు నిధులు విడుదల చేసి దుర్వినియోగం కాకుండా చూసేందుకు చట్టం కూడా తెచ్చింది. రానున్న ఐదేళ్లలో గతం కంటే ఎక్కువ విడుదలయ్యే నిధులతో పల్లెలు అభివృద్ధిబాట పట్టనున్నాయి. పంచాయతీకి ఐదేళ్లలో వచ్చిన నిధులు ఇలా.. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు పంచాయతీకి గడిచిన ఐదేళ్లలో రూ.48.76 లక్షల నిధులు విడుదలయ్యాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి మొత్తం రూ.3 లక్షలకుపైగా విడుదల కాగా, 2015–16 సంవత్సరంలో జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సీ, 13వ ఆర్థిక సంఘం నిధులు కలిపి ఎనిమిది సార్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఈ జీపీకి రూ.11.44 లక్షలు విడుదలయ్యాయి. ఇక 2016–17 సంవత్సరంలో నాలుగుసార్లు కలిపి రూ.8.26 లక్షలు జమయ్యాయి. 2017–18లో రూ.16.82 లక్షలు, 2018–19లో రూ.9.24 లక్షలు జమైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. -
యాసిన్కు నిధులెలా వచ్చాయి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 40 వరకూ బాంబు పేలుళ్లు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది యాసిన్ భత్కల్కు పాకిస్థాన్ నుంచి నిధులు ఏ మార్గంలో అందాయనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరా తీస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలన్నింటికీ పాకిస్థాన్ నుంచే నిధులు అందినట్లు ఎన్ఐఏ విచారణలో యాసిన్ అంగీకరించాడు. దీంతో హవాలా మార్గంలో వచ్చాయా, నకిలీనోట్ల ముఠాల ద్వారానా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు. ఒక్కో ఆపరేషన్కు ఒక్కో హవాలా ఏజెంట్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్ నుంచి డబ్బును పంపేవిధానం రెండేళ్లవరకూ కొనసాగింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా తీవ్రం కావడంతో ఇటీవలి కాలంలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు ఎన్ ఐఏ ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. పాకిస్థాన్ ఐఎస్ఐ సహకారంతో ముద్రించే నకిలీ నోట్లను ఉగ్రవాద మాడ్యూల్స్ ద్వారానే నేపాల్ మీదుగా పెద్దమొత్తంలో భారతదేశంలోకి తరలిస్తున్నారు. దీంతో ఈ ముఠాల ద్వారానే దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు పంపే ఎత్తుగడ వేశారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, మరోవైపు శాంతిభద్రతల సమస్య సృష్టించి హైదరాబాద్ వంటి నగరాలకు పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు. ఇదేవిషయాన్ని యాసిన్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. గత ఏడాది కాలంగా ఐఎం కీలక నేతలు రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్ మాడ్యూల్ల ద్వారా కోట్లాది రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల చలామణి జరుగుతున్నట్లు దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాయి. యాసిన్ మాడ్యూల్లో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు వ్యక్తులు నకిలీనోట్ల చలామణి ముఠాల నుంచి మారకం రూపంలో సేకరించిన డబ్బునే దిల్సుఖ్నగర్ పేలుళ్ల కోసం అప్పగించినట్లు సమాచారం. ఈ పేలుళ్ల కోసమే రూ.10 లక్షల వరకూ ఖర్చుచేసినట్లు కూడా బయటపడింది. ఇలావుండగా 2011లో ముంబైలో జరిగిన మూడు వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి యాసిన్ను, అక్తర్ అలియాస్ తబ్రేజ్ను కస్టడీలోకి తీసుకునేందుకు వీలుగా అక్కడి మోకా కోర్టు సోమవారం బదిలీ వారంట్ జారీ చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement